ఆర్థిక మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

అక్రమంగా దిగుమతి చేసుకున్న 30,000 టపాసులను ముంద్రా ఓడరేవులో స్వాధీనం చేసుకున్న డీఆర్ఐ బాణసంచా విలువ రూ.5 కోట్లు.. ఒకరి అరెస్టు

Posted On: 17 NOV 2025 9:40AM by PIB Hyderabad

చైనాలో తయారు చేసిన బాణసంచాను మన దేశంలోకి అక్రమంగా దిగుమతి చేసుకొనే యత్నాన్ని రెవెన్యూ ఇంటెలిజెన్స్ డైరెక్టరేట్ (డీఆర్ఐ)  విజయవంతంగా అడ్డుకుందిచట్టవిరుద్ధంగా దిగుమతి చేసుకోవడాన్ని అరికట్టడానికి నిర్వహిస్తున్న ‘‘ఫైర్ ట్రయల్’’ కార్యకలాపాల్లో ఇది ఒక భాగం.


image.png



చైనా నుంచి వస్తున్న 40 అడుగుల కంటెయినర్ ను ముంద్రా ఓడరేవులో డీఆర్ఐ అధికారులు అడ్డుకున్నారుఆ కంటెయినర్లో నీళ్ల గ్లాసులుపూల కుండీలు ఉన్నాయని మొదట సమాచారాన్ని ఇచ్చారుఅడుగున 30,000 టపాసులను ఉంచిపైవరుసలో నీళ్ల గ్లాసులను ఉంచారుఇంతకు ముందూగత నెలలో ట్యూటికొరిన్ముంబయిల్లో చైనా టపాసులను చట్టవిరుద్ధంగా దిగుమతి చేసుకోవడానికి చేసిన ప్రయత్నాలను కూడా డీఆర్ఐ విజయవంతంగా అడ్డుకుంది.
విదేశీ వాణిజ్య విధానంలోని ఐటీసీ (హెచ్ఎస్వర్గీకరణ ప్రకారం టపాసుల దిగుమతిపై నియంత్రణ ఉందిదీని కోసం పేలుడు పదార్థాల నియమావళి-2008లో భాగంగా విదేశీ వాణిజ్య డైరెక్టర్ జనరల్ (డీజీఎఫ్‌టీనుంచీపెట్రోలియంఎక్స్‌ప్లోజివ్స్ సేఫ్టీ ఆర్గనైజేషన్ (పీఈఎస్ఓనుంచీ లైసెన్సు తీసుకోవాల్సి ఉంటుందిఅయితేదిగుమతిదారు సంస్థ వద్ద ఎలాంటి లైసెన్సులూ లేవుడబ్బు కోసమే సరుకుల్ని అడ్డదారిలో రవాణా చేసినట్లుగా సంస్థ ఒప్పుకుందిదీంతోదిగుమతి చేసుకొన్న

టపాసులనూవాటిని రవాణా కోసం ఉపయోగించిన కంటెయినర్ఇతర సరుకులు సహా కస్టమ్స్ చట్టం-1962 ప్రకారం ఈ నెల 15న స్వాధీనం చేసుకున్నారువాటి విలువ రూ.5 కోట్లు ఉంటుందని అంచనాఈ లావాదేవీకి సూత్రధారిగా ఉండడమే కాక ఆర్థికసాయాన్నందించిన వ్యక్తిని అరెస్టు చేశారు.
ప్రమాదకరమైన వస్తువులను చట్టవిరుద్ధంగా దిగుమతి చేసుకోవడంజాతిభద్రతకూప్రజలకూకీలక ఓడరేవులకే కాకుండా విస్తృత నౌకాయానానికీఆధునిక వస్తు రవాణా వ్యవస్థకూ కూడా తీవ్ర ముప్పును తెచ్చిపెడుతుందివ్యవస్థీకృత దొంగరవాణా ముఠాలను పసిగట్టి వాటి భరతం పట్టిప్రమాదకరమైన వస్తువుల ప్రభావం నుంచి ప్రజలను రక్షించడమే కాకుండా మన దేశ వాణిజ్యభద్రతా సంబంధిత అనుబంధ విస్తారిత వ్యవస్థ సమగ్రతను పరిరక్షించాలన్న తన కర్తవ్యాన్ని నిర్వహించడానికి డీఆర్ఐ కట్టుబడి ఉంది.

 

***


(Release ID: 2191021) Visitor Counter : 5