సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
ప్రత్యేక ప్రచారం 5.0 ద్వారా మంత్రిత్వ శాఖ చేపట్టిన కార్యక్రమాలను పరిశీలించిన సమాచార, ప్రసార శాఖ సహాయ మంత్రి శ్రీ డాక్టర్ ఎల్. మురుగన్
प्रविष्टि तिथि:
31 OCT 2025 7:00PM by PIB Hyderabad
2025, అక్టోబర్ 30న న్యూఢిల్లీలోని శాస్త్రి భవన్లో ఉన్న సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ కార్యాలయంలో ‘‘ప్రత్యేక ప్రచారం 5.0’’ సమీక్షా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా స్వచ్ఛత, పెండింగ్ అంశాల పరిష్కారంపై తీసుకున్న చర్యలను కేంద్ర సమాచార, ప్రసార, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి డాక్టర్ ఎల్. మురుగన్ సమీక్షించారు. ఈ కార్యక్రమానికి సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ సంజయ్ జాజు, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ప్రిన్సిపల్ డైరెక్టర్ జనరల్ శ్రీ ధీరేంద్ర ఓఝా హాజరయ్యారు. మంత్రిత్వ శాఖలోని వివిధ విభాగాలు, రికార్డు గదిని సందర్శించి వాటి పరిస్థితిని మరింత మెరుగుపరచాలని, డిజిటలైజేషన్ ప్రక్రియను మరింత సవ్యంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.
2025, అక్టోబర్ 30న న్యూ ఢిల్లీలోని మండీ హౌస్లో ఉన్న దూరదర్శన్ భవన్లో చేపట్టిన ప్రత్యేక ప్రచారాన్ని సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ, పార్లమెంటరీ వ్యవహారాల రాష్ట్ర మంత్రి డాక్టర్ ఎల్. మురుగన్ పరిశీలించారు. ఈ సందర్భంగా స్వచ్ఛత, పెండింగ్ అంశాల పరిష్కారం కోసం చేపట్టిన చర్యలను ఆయన సమీక్షించారు. ఈ కార్యక్రమంలో ప్రసార భారతి ఛైర్మన్ శ్రీ నవనీత్ కుమార్ సెహగల్, ప్రసార భారతి సీఈఓ శ్రీ గౌరవ్ ద్వివేది, సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ సీనియర్ ఆర్థిక సలహాదారు, నోడ్ల్ అధికారి శ్రీ ఆర్.కే. జెనా, ప్రసార భారతీకి చెందిన ఇతర అధికారులు పాల్గొన్నారు.
2025 అక్టోబర్ 31నన్యూఢిల్లీలోని ఆకాశవాణి స్వచ్ఛత, పెండింగ్ తగ్గింపుపై నిర్వచించిన ప్రత్యేక ప్రచారం 5.0 కార్యకలాపాలను సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ, పార్లమెంటరీ వ్యవహారాల రాష్ట్ర మంత్రి డా. ఎల్. మురుగన్ పరిశీలించి, సమీక్షించారు. ఈ కార్యక్రమానికి మంత్రిత్వ శాఖ సీనియర్ ఆర్థిక సలహాదారు, సమాచార ప్రసార శాఖ నోడల్ అధికారి శ్రీ ఆర్కె జెనా, ఆకాశవాణి డైరెక్టర్ జనరల్ శ్రీ రాజీవ్ జైన్, ప్రసార భారతికి చెందిన అధికారులు హాజరయ్యారు.
***
(रिलीज़ आईडी: 2185529)
आगंतुक पटल : 17