ప్రధాన మంత్రి కార్యాలయం
‘వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్ 2.0’లో యువత పాల్గొనాలని కోరిన ప్రధానమంత్రి
Posted On:
27 OCT 2025 8:40PM by PIB Hyderabad
‘వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్ 2.0’లో యువత చురుకుగా పాల్గొనాలని ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ కోరారు. దేశ నిర్మాణానికి దోహపడేందుకు ఇదొక విలువైన అవకాశమని తెలిపారు.
ఈ కార్యక్రమంలో యువజనులంతా పాల్గొని, అభివృద్ధి చెందిన భారత్ కోసం ఆలోచనలను పంచుకోవాలని ప్రధానమంత్రి కోరారు. ముందుగా నిర్వహించే ప్రత్యేక క్విజ్ పోటీలో పాల్గొనడం ద్వారా ఈ కార్యక్రమంలో పాలుపంచుకోవాలని యువతకు విన్నవించారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఈ విధంగా పేర్కొన్నారు:
“ దేశ నిర్మాణానికి దోహదపడేందుకు వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్ 2.0 ఒక గొప్ప అవకాశం. మన యువత ఆలోచనలు, లోతైన పరిశీలనలు వికసిత్ భారత్ను సాకారం చేసుకునే మార్గాన్ని చూపుతాయి.
ఈ కార్యక్రమంలో చేరాలంటే ముందుగా ప్రత్యేకంగా రూపొందించిన ఈ క్విజ్ పోటీలో పాల్గొనాలి. మీరందరూ దీనికి హాజరవ్వాలని నేను కోరుకుంటున్నాను”
***
(Release ID: 2183455)
Visitor Counter : 4
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam