ప్రధాన మంత్రి కార్యాలయం
పీయూష్ పాండే మృతి.. ప్రధానమంత్రి సంతాపం
Posted On:
24 OCT 2025 11:29AM by PIB Hyderabad
వాణిజ్య ప్రకటనలు, కమ్యూనికేషన్ల రంగ దిగ్గజం శ్రీ పీయూష్ పాండే మృతికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు సంతాపాన్ని వ్యక్తం చేశారు. శ్రీ పాండే అసాధారణ సృజనాత్మక ప్రతిభనూ, భారతదేశ వాణిజ్య ప్రకటనల రంగానికి ఆయన అందించిన మహత్తర సేవలనూ ప్రధానమంత్రి నిండుమనసుతో ఓ సందేశంలో స్మరించుకొన్నారు.
‘ఎక్స్’లో ప్రధానమంత్రి ఒక సందేశాన్ని పొందుపరుస్తూ, ఇలా పేర్కొన్నారు:
‘‘పీయూష్ పాండే గారి సృజనాత్మక ప్రజ్ఞ ప్రశంసనీయం. వాణిజ్య ప్రకటనలు, కమ్యూనికేషన్ల జగతికి స్మరణీయ సేవలను అందించారాయన. గత కొన్నేళ్లలో మేం ఇద్దరం చర్చించిన అంశాల్ని నేను చాలా ఆప్యాయంగా నా మదిలో పదిలపరుచుకొంటాను. ఆయన మరణ వార్త తెలిసి, ఎంతో బాధపడ్డాను. ఆయన కుటుంబానికీ, ఆయన అభిమానులకూ నా సానుభూతిని తెలియజేస్తున్నాను. ఓం శాంతి.’’
***
MJPS/SR
(Release ID: 2182111)
Visitor Counter : 12
Read this release in:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam