కమ్యూనికేషన్లు- సమాచార సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
దీపావళి బొనాంజా... పండుగ ఆఫర్లను ప్రకటించిన బీఎస్ఎన్ఎల్
Posted On:
17 OCT 2025 4:13PM by PIB Hyderabad
ఢిల్లీ, 2025 అక్టోబర్ 15: దేశవ్యాప్తంగా ఉన్న వినియోగదారులకు భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) ఈ రోజు ప్రత్యేక దీపావళి బొనాంజాగా... పండుగ ఆఫర్లను ప్రకటించింది.
దీపాల పండుగను చేసుకునేందుకు ప్రజలు సిద్ధమవుతున్న వేళ వినియోగదారులందరికీ పండుగ ఆఫర్లను ప్రకటించింది. ఈ ఆఫర్ల కింద కొత్త - పాత వినియోగదారులు, వ్యక్తిగత - వ్యాపార వినియోగదారులు ప్రయోజనాలు పొందుతారు. ఇందులో భాగంగా వయో వృద్ధులకు కూడా ప్రత్యేక ప్రయోజనాలు అందుతాయి. 2025 అక్టోబర్ 18 నుంచి 2025 నవంబర్ 18 ఉండనున్న ఈ ఆఫర్లను.. ఆనందాన్ని పంచుకోవడం, వెలుగును వ్యాప్తి చేయడం, కనెక్షన్లను బలోపేతం చేయడం అనే దీపావళి స్ఫూర్తిని పంచుకోవడానికి తీసుకొచ్చింది.
ఏ. కొత్త వినియోగదారుల కోసం దీపావళి బొనాంజా 4జీ ప్లాన్
“దీపపు కాంతుల్లో కొత్త కనెక్షన్లు”
బీఎస్ఎన్ఎల్ కుటుంబంలోకి కొత్త వినియోగదారులను స్వాగతించేందుకు రూ. 1 దీపావళి 4జీ ప్లాన్ను ప్రారంభించింది. ఇది కొత్త వినియోగదారులకు ఒక నెల ఉచిత మొబైల్ సేవలను అందిస్తుంది. నామమాత్రపు యాక్టివేషన్ రుసుంగా కేవలం రూ. 1 చెల్లించడం ద్వారా కొత్త వినియోగదారులు.. 30 రోజుల అపరిమిత కనెక్టివిటీని పొందొచ్చు. కొత్త వినియోగదారులకు దీపావళి సందర్భంగా బీఎన్ఎన్ఎల్ ఇచ్చిన బహుమతి ఇది. ఇటీవలే ప్రారంభమైన స్వదేశీ 4జీ నెట్వర్క్పై బీఎస్ఎన్ఎల్కు ఉన్న విశ్వాసాన్ని ఇది తెలియజేస్తోంది. ఎలాంటి ఖర్చు లేకుండా నెట్వర్క్ ప్రయోజనాలను తెలుసుకోవాలని కొత్త వినియోగదారులను ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ ఆహ్వానిస్తోంది.
దీపావళి బొనాంజా ప్లాన్ ముఖ్యమైన ప్రయోజనాలు (మొదటి 30 రోజులు):
* ఇష్టమైన వారితో మాట్లాడేందుకు అపరిమిత వాయిస్ కాల్స్ (ప్లాన్ నిబంధనలు- షరతుల ప్రకారం)
* వీడియోలు, ఫోటోలతో పాటు పండుగ శుభాకాంక్షలు ఉచితంగా పంచుకునేందుకు రోజుకు 2 జీబీ హై-స్పీడ్ డేటా
* దీపావళి శుభాకాంక్షలు పంపించేందుకు రోజుకు 100 ఎస్ఎంఎస్లు
* యాక్టివేషన్తో ఉచిత సిమ్ కార్డ్ (డీఓటీ మార్గదర్శకాల ప్రకారం కేవైసీ తప్పనిసరి)
2025 అక్టోబర్ 15 నుంచి 2025 నవంబర్ 15 వరకు కనెక్షన్ తీసుకునే వారికి ఈ ఆఫర్ వర్తిస్తుంది.
ఈ పండుగ ప్లాన్ను ప్రకటించిన బీఎస్ఎన్ఎల్ సీఎండీ శ్రీ ఎ. రాబర్ట్ జే. రవి మాట్లాడుతూ.. “దీపావళి అంటే కొత్త ప్రారంభాలు, వెలుగుల వేడుకలకు ప్రతీక. నెల రోజుల ఉచిత ప్లాన్ అనే బహుమతితో కొత్త వినియోగదారులను స్వాగతించటం పట్ల మేం సంతోషంగా ఉన్నాం. దీపావళి సందర్భంగా వేడుక చేసుకునేందుకు అంతా సిద్ధమౌతున్న వేళ.. ఈ రూ. 1 దీపావళి బొనాంజా ప్లాన్ ద్వారా ప్రజలు మా అత్యాధునిక, భారత్లో తయారైన 4జీ నెట్వర్క్ను వాడి చూడాలని కోరింది. సేవల్లో నాణ్యత పెరిగినట్లు వినియోగదారులు భావించినట్లయితే పండుగ సీజన్ తర్వాత కూడా మీరు బీఎస్ఎన్ఎల్తో కొనసాగుతారని మేం విశ్వాసంతో ఉన్నాం” అని అన్నారు.
బీ. వినియోగదారుల కోసం లక్కీ డ్రా
“సంపదల సంబరం, సంతోషాల బంధం”
పాత వినియోగదారుల పండుగ ఆనందానికి దీపావళి లక్కీ డ్రాతో అదనపు వెలుగును బీఎస్ఎన్ఎల్ తీసుకొచ్చింది. 2025 అక్టోబర్ 18, 19, 20 తేదీల్లో సెల్ఫ్-కేర్ యాప్ లేదా బీఎస్ఎన్ఎల్ వెబ్సైట్లో రూ. 100 లేదా అంతకంటే ఎక్కువ రీఛార్జ్ చేసుకునే వినియోగదారులు అదే రోజు లక్కీ డ్రాకు ఆటోమేటిక్గా అర్హత సాధిస్తారు. పాత వినియోగదారులతో పాటు బొనాంజా సమయంలో చేరిన వినియోగదారులకు కూడా ఈ లక్కీ డ్రా వర్తిస్తుంది.
రీఛార్జ్ చేసుకున్న వారు లక్కీ డ్రాలోకి ఆటోమేటిక్గా వెళ్తారు. ఇందులో పది మంది వినియోగదారులు.. ప్రతిరోజూ 10 గ్రాముల వెండి నాణేలను గెలుచుకుంటారు. వీటిని ఆయా వినియోగదారులకు డెలివరీ ద్వారా అందిస్తారు.
లక్కీ డ్రా గురించి బీఎస్ఎన్ఎల్ సీఎండీ శ్రీ ఎ. రాబర్ట్ జే. రవి మాట్లాడుతూ.. “భారతదేశ వ్యాప్తంగా లక్షలాది దీపాలను వెలిగిస్తున్న వేళ మా వినియోగదారులకు ఆనందం అనే వెలుగును ఇవ్వాలని మేం భావించాం. మా వినియోగదారులు మాపై ఉంచిన నమ్మకాన్ని మేం గౌరవిస్తున్నాం. ఈ అదృష్టమైన పండుగ సందర్భంగా వారి వేడుకల్లో ఉత్సాహాన్ని నింపాలని, బహుమతిని అందించాలని మేం ఆశిస్తున్నాం” అని అన్నారు.
సీ. వ్యాపారాలకు సంబంధించిన కాంబో ఆఫర్లు
"ఉన్నతమైన వ్యాపారాలు, ప్రకాశవంతమైన వేడుకలు"
దీపావళి కేవలం ఇళ్లకు సంబంధించినది మాత్రమే కాదు.. సంస్థలు, వ్యాపారాలు కూడా విజయాలను వేడుకగా చేసుకునేందుకు, అవి కుటుంబాల మాదిరిగానే బంధాలను ఏర్పరచుకునే సమయం ఇదని బీఎస్ఎన్ఎల్ భావిస్తోంది. వ్యాపార, కార్పోరేట్ వినియోగదారుల కోసం కార్పొరేట్ కాంబో ఆఫర్లను బీఎస్ఎన్ఎల్ ఆవిష్కరించింది. దీని ప్రకారం ప్రత్యేక పండుగ ధరల్లో మరిన్ని సేవలు పొందొచ్చు. కనీసం 10 కొత్త పోస్ట్-పెయిడ్ కనెక్షన్లు, ఒక ఎఫ్టీటీహెచ్ కనెక్షన్ తీసుకునే వినియోగదారులకు మొదటి నెల ఎఫ్ఎంసీపై 10 శాతం తగ్గింపు ఉంటుంది.
డీ. ఒక రీఛార్జ్ను బహుమతిగా ఇవ్వటం
“ఒక్కో రీఛార్జితో చిరునవ్వును పంచుదాం”
ఇతరులకు ఇవ్వటం, పంచుకోవటం అనే దీపావళి పండుగ నిజమైన స్ఫూర్తికి అనుగుణంగా బీఎస్ఎన్ఎల్ “ఒక రీఛార్జ్ను బహుమతిగా ఇవ్వటం (గిఫ్ట్ ఏ రీఛార్జ్)” అనే సదుపాయాన్ని తీసుకొచ్చింది. ఈ ఫీచర్ ద్వారా బీఎస్ఎన్ఎల్ వినియోగదారులు స్నేహితులు, కుటుంబ సభ్యులకు ప్రీపెయిడ్ రీఛార్జ్, టాప్-అప్ను దీపావళి బహుమతిగా ఇవ్వొచ్చు. వేరే నగరాల్లో నివసిస్తోన్న తల్లిదండ్రులైనా లేదా స్నేహితులను ఆశ్చర్యపరచాలనుకున్నా.. మీరు ఇప్పుడు వారికి టాక్-టైమ్ లేదా డేటాను బహుమతిగా పంపించొచ్చు. ఇది పండుగల సమయంలో ఇష్టమైన వాళ్లతో కనెక్ట్ అయి ఉండేలా చూసుకుంటుంది. ఈ బహుమతిని పంపించటం కూడా చాలా సులువు. సెల్ప్కేర్ యాప్ను ఉపయోగించిన ఏదైనా బీఎస్ఎన్ఎల్ ఫోన్ నంబర్ను రీఛార్జ్ చేయొచ్చు. పర్సనల్ మెస్సేజ్ కూడా దీనితో పంపించవచ్చు.
అదనపు పండుగ బోనస్గా ప్రతి రీఛార్జ్పై కొంత అదనపు విలువను బీఎస్ఎన్ఎల్ అందిస్తోంది. సద్భావన చిహ్నంగా అందిస్తోన్న ఈ అదనపు విలువ ద్వారా పండుగ తర్వాత కూడా పండుగ ఆనందం కొనసాగుతుంది. బహుమతి పొందిన వారు బహుమతి మొత్తంలో 2.5 శాతాన్ని అదనంగా పొందుతారు. ఈ ఆఫర్ 2025 అక్టోబర్ 18 నుంచి 2025 నవంబర్ 18 వరకు ఉంటుంది.
ఈ బహుమతి గురించి శ్రీ ఏ. రాబర్ట్ జే. రవి మాట్లాడుతూ.. “మనకు ఇష్టమైన వారిని చేరుకునేందుకు, వారితో మాట్లాడేందుకు దీపావళి కంటే మంచి సమయం లేదు. మనం స్వీట్లు, బహుమతులు పంచుకున్నట్లే.. కమ్యూనికేషన్ బహుమతిని ఇవ్వటాన్ని సులభతరం చేయాలని మేం కోరుకుంటున్నాం. 'ఒక రీఛార్జ్ను బహుమతిగా ఇవ్వటం'తో కుటుంబంతో ఫోన్ కాల్ లేదా వీడియో చాట్ చేయటం అనేది ఒక బహుమతిగా ఉంటుంది. ఇది మైళ్ల దూరంలో ఉన్నప్పుడు కూడా దగ్గరగా ఉన్నారనే భావనను ఇస్తుంది. ఈ దీపావళికి మీరు పెద్ద వాళ్లకు లేదా స్నేహితులకు రీఛార్జ్ పంపినప్పుడు.. మీరు డేటా లేదా టాక్-టైమ్ ఇచ్చినట్లు మాత్రమే కాదు.. మీరు హృదయపూర్వక సంభాషణను బహుమతిగా ఇస్తున్నారు. ఈ విలువైన సంభాషణలు మరింత ఎక్కువ కాలం ఉండేలా చూసుకోవడానికి అదనపు విలువను బీఎస్ఎన్ఎల్ అందించేందుకు సంతోషంగా ఉంది” అని అన్నారు.
ఈ. వయో వృద్ధుల ప్లాన్
“బంధాల కలయిక, తరాల వేడుక”
బాణసంచా కాల్చుతూ కుటుంబ సభ్యుల కలయికలతో దీపావళి చేసుకుంటున్న వేళ మన సమాజంలోని వయోవృద్ధులపై బీఎస్ఎన్ఎల్ ప్రత్యేక శ్రద్ధ వహిస్తోంది. మనకు జ్ఞానం, ప్రేమను అందించే వయోవృద్ధుల కోసం దీపావళి బొనాంజాలో భాగంగా ప్రత్యేక వినోదంతో కూడిన వయో వృద్ధుల ప్లాన్ను (సీనియర్ సిటిజన్ ప్లాన్) బీఎస్ఎన్ఎల్ ప్రవేశపెట్టింది. ఈ ప్లాన్ను 60 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న వినియోగదారులకు అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దారు. ఇందులో టారిఫ్లపై డిస్కాంట్, అదనపు ప్రయోజనాలు, ఎక్కువ సౌలభ్యం అందనున్నాయి.
వయోవృద్ధులకు మాత్రమే సంబంధించిన ఈ ప్లాన్ కోసం రూ. 1812 రీఛార్జ్ చేసుకోవాలి. దీనివల్ల వచ్చే ప్రయోజనాలు:
రోజుకు 2జీబీ ఇంటర్నెట్ డేటా,
అపరిమిత కాల్స్,
రోజుకు 100 ఎస్ఎంఎస్లు,
365 రోజులు చెల్లుబాటు
ఉచిత సిమ్
బీఐటీవీ ప్రీమియం వినోదం 6 నెలల పాటు ఉచితం.
వయోవృద్ధులు తీసుకునే ఈ కొత్త కనెక్షన్ ఆఫర్ 2025 అక్టోబర్ 18 నుంచి 2025 నవంబర్ 18 వరకు అందుబాటులో ఉంటుంది.
దీని గురించి సీఎండీ మాట్లాడుతూ.. “మన గృహాలను వెలుగులతో నింపే దీపం మాదిరిగానే మన పెద్దలు కూడా మన కుటుంబాలకు దారి చూపే దీపం లాంటి వారు. ఈ దీపావళికి ఎలాంటి చింతా లేని కనెక్టివిటీతో వారి జీవితాలను ప్రకాశవంతం చేయటం ద్వారా వయోవృద్ధులను గౌరవించాలనుకుంటున్నాం. దూరంగా ఉన్న పిల్లలు, మనవరాళ్లతో వయోవృద్ధులను కనెక్ట్ చేయటం ద్వారా మనకు ఎంతో చేసిన తరానికి ధన్యవాదాలు చెప్పే మార్గమే ఈ వయోవృద్ధుల ప్లాన్” అని వ్యాఖ్యానించారు.
ఎఫ్. ఎంపిక చేసిన ప్లాన్లపై పండుగ బోనస్
“కొంచెం ఆదా, కొంచెం పంచుకోవటం”
ఇతరులకు ఇవ్వటం అనే దీపావళి స్ఫూర్తికి అనుగుణంగా బీఎస్ఎన్ఎల్ సెల్ఫ్-కేర్ యాప్ లేదా బీఎస్ఎన్ఎల్ వెబ్సైట్ నుంచి చేసే రూ. 485, రూ. 1,999 ప్లాన్ రీఛార్జ్లపై 5 శాతం పండుగ ప్రయోజనాన్ని అందిస్తోంది. ఇది 2025 అక్టోబర్ 18 నుంచి 2025 నవంబర్ 18 వరకు అమలులో ఉంటుంది.
ముఖ్య లక్షణాలు:
* 2.5 శాతం తక్షణ డిస్కౌంట్
* మిగిలిన 2.5 శాతాన్ని సామాజిక సేవా కార్యక్రమాలకు బీఎస్ఎన్ఎల్ విరాళంగా ఇస్తుంది. మరిన్ని జీవితాలను ప్రకాశవంతం చేసేందుకు చిన్న దీపం అనే భావనకు అనుగుణంగా ఇది ఉంది.
బీఎస్ఎన్ఎల్ సీఎండీ శ్రీ ఏ. రాబర్ట్ జే. రవి ఈ విధంగా వ్యాఖ్యానించారు:
“మనం వెలుగును పంచుకున్నప్పుడు దీపావళి మరింత ప్రకాశవంతంగా మారుతుంది. ఈ ‘కొంచెం ఆదా, కొంచెం పంచుకోవటం’ అనే క్యాంపెయిన్తో ప్రతి రీఛార్జ్ ‘ఒకరి సగం చిరునవ్వు కోసం మీ సగం పొదుపు’ అనే ఒక సహృదయ భావనగా మారుతుంది. అందరం కలిసి మరిన్ని ఇళ్లలో మరిన్ని జ్యోతులను వెలిగిద్దాం”
ఈ దీపావళికి కనెక్టివిటీ అనే వెలుగును వ్యాప్తి చేయటం:
దీపావళి బొనాంజా ఆఫర్ల ద్వారా వినియోగదారుల సంతోషం, డిజిటల్ సమ్మిళితత్వం విషయంలో నిబద్ధతను బీఎస్ఎన్ఎల్ పునరుద్ఘాటిస్తోంది. దీపావళి సంస్కృతికి సాంకేతికతతో మెరుగులు దిద్దటం ద్వారా ఈ పండుగ సీజన్లో ఇంటి నుంచి దూరంగా ఉన్న విద్యార్థులు, వ్యాపార సంస్థలు లేదా వయో వృద్ధులు.. ఇలా ఎవరైనా ప్రియమైన వారికి దూరంగా ఉన్నారనే భావన లేకుండా చూసుకోవాలని బీఎస్ఎన్ఎల్ లక్ష్యంగా పెట్టుకుంది.
దీపపు కాంతుల్లా ఇళ్లను, బంధాలను ప్రకాశింపజేసి సిరి సంపదలు పంచుకోవటం అనే దీపావళి స్ఫూర్తికి అనుగుమంగా ఈ ఆఫర్లు ఉన్నాయి.
బీఎస్ఎన్ఎల్ వినియోగదారులందరితో పాటు దేశ ప్రజలందరికీ దీపావళి సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తోంది. ఈ దీపావళి జీవితాలను వెలుగు, ఆనందం, లెక్కలేనన్ని ప్రియమైన కనెక్షన్లతో నింపాలని ఆశిస్తోంది.
దీపావళి బొనాంజాను పొందడంలో ఏవైనా సందేహాలు ఉన్నా, ఏదైనా సహాయం కావాలన్నా సమీపంలోని బీఎస్ఎన్ఎల్ వినియోగదారు సేవా కేంద్రాన్ని (సీఎస్సీ) సందర్శించండి. 1800-180-1503కు ఫోన్ చేయండి. లేదా bsnl.co.inని సందర్శించండి. అందరికీ దీపావళి శుభాకాంక్షలు!
****
(Release ID: 2180750)
Visitor Counter : 6