ప్రధాన మంత్రి కార్యాలయం
రాజమాత విజయరాజే సింధియా జయంతి సందర్భంగా నివాళులర్పించిన ప్రధానమంత్రి
प्रविष्टि तिथि:
12 OCT 2025 9:10AM by PIB Hyderabad
రాజమాత విజయరాజే సింధియా జయంతి సందర్భంగా ఆమెకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ హృదయపూర్వక నివాళులు అర్పించారు.
సమాజ సేవకు రాజమాత విజయరాజే సింథియా చేసిన కృషి ఎప్పటికీ మరువలేనిదని ప్రధానమంత్రి అన్నారు.
భారతదేశ సాంస్కృతిక మూలలపై విజయరాజే సింథియాకు అపారమైన ప్రేమ ఉండేదని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. దేశ సాంస్కృతిక వారసత్వాన్ని రక్షించటానికి, ప్రాచుర్యం కల్పించటానికి ఆమె చేసిన నిరంతర కృషి దేశ సంప్రదాయాలు, విలువల పరిరక్షణకు ఇచ్చిన ప్రాధాన్యతను ప్రతిబింబిస్తుంది.
సామాజిక మాధ్యమం ‘‘ఎక్స్’’లో ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు:
“రాజమాత విజయరాజే సింధియా జయంతి సందర్భంగా నివాళులు అర్పిస్తున్నాను. సమాజ సేవకు ఆమె చేసిన కృషి ఎన్నటికీ మరువలేనిది. జనసంఘ్ నీ, బీజేపీని బలోపేతం చేయటంలో ఆమె పాత్ర కీలకమైనది. మన సాంస్కృతిక మూలాలపై విజయరాజే సింధియాకు అపారమైన ప్రేమ ఉంది. వాటిని పరిరక్షించటానికి, ప్రాచుర్యం కల్పించటానికి ఆమె నిరంతరం కృషి చేశారు”
(रिलीज़ आईडी: 2178063)
आगंतुक पटल : 30
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam