ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ప్రధానమంత్రిని కలిసిన ఆంత్రోపిక్ సీఈఓ డారియో అమోడై

प्रविष्टि तिथि: 11 OCT 2025 10:17PM by PIB Hyderabad

న్యూఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ఆంత్రోపిక్ సంస్థ సీఈఓ శ్రీ డారియో అమోడై సమావేశమయ్యారుఈ సందర్భంగా భారత్ లో ఆంత్రోపిక్ విస్తరణక్లాడ్ కోడ్ వంటి ఏఐ సాధనాల వినియోగంపై చర్చించారుదేశంలో జూన్ నుంచి క్లాడ్ కోడ్ వినియోగం అయిదు రెట్లు పెరిగినట్లు చర్చలో ప్రస్తావించారు.

మెరుగైన సాంకేతిక వ్యవస్థమానవ కేంద్రీకృతమైనబాధ్యతాయుతమైన ఏఐ ఆవిష్కరణలను ముందుకు తీసుకెళ్లటంలో ప్రతిభావంతులైన యువతతో కూడిన దేశ సామర్థ్యాన్ని శ్రీ నరేంద్ర మోదీ తెలియజేశారుఆంత్రోపిక్ విస్తరణను స్వాగతిస్తూ.. ఈ భాగస్వామ్యం ద్వారా విద్యఆరోగ్యంవ్యవసాయం వంటి కీలక రంగాల్లో భారత ఏఐ సామర్థ్యం బలపడుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు.

ఏఐ విధానం పట్ల భారత్ వైఖరినిసమ్మిళిత వృద్ధికి సాంకేతికతను వినియోగించుకోవటాన్ని శ్రీ అమోడీ అభినందించారు.

సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ లో ప్రధానమంత్రి ఇలా పోస్ట్ చేశారు:

మిమ్మల్ని కలవటం సంతోషంగా ఉందిమెరుగైన సాంకేతిక వ్యవస్థనైపుణ్యం గల యువతతో మానవ-కేంద్రీకృతమైనబాధ్యతాయుతమైన ఏఐ ఆవిష్కరణలకు భారత్ సిద్ధంగా ఉందిఆంత్రోపిక్ సంస్థ విస్తరణను మేం స్వాగతిస్తున్నాంవిద్యఆరోగ్యంవ్యవసాయం వంటి కీలక రంగాల్లో అభివృద్ధికి ఏఐని వినియోగించుకునేందుకు మీతో కలిసి పనిచేయటానికి మేం ఎదురుచూస్తున్నాం”.

 

***


(रिलीज़ आईडी: 2178060) आगंतुक पटल : 17
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Bengali , Manipuri , Assamese , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam