ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఇండియా మొబైల్ కాంగ్రెస్-2025లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం


ఆత్మ నిర్భర భారత్ లక్ష్యానికున్న సామర్థ్యాన్ని ఇండియన్ మొబైల్ కాంగ్రెస్,

టెలికాం రంగంలో దేశం సాధించిన విజయం ప్రతిబింబిస్తాయి: పీఎం


ఒకప్పుడు 2జీతో ఇబ్బంది పడిన దేశంలో ఇప్పుడు.. ప్రతి జిల్లాలోనూ 5జీ సేవలు: పీఎం


దేశీయంగా సాధించిన విజయమే మేడిన్ ఇండియా 4జీ స్టాక్‌...

ప్రపంచంలో ఈ సామర్థ్యం ఉన్న అయిదు దేశాల్లో భారత్ ఒకటి: పీఎం


మన దగ్గర ప్రపంచంలోనే రెండో అతి పెద్ద టెలికాం మార్కెట్,

రెండో అతిపెద్ద 5జీ మార్కెట్, శ్రామిక శక్తి, రవాణా, నాయకత్వ శక్తి ఉన్నాయి: పీఎం


భారత్‌లో డిజిటల్ అనుసంధానత ఇకపై విశేషమైనదో.. విలాస వస్తువో కాదు..

అది ప్రతి భారతీయుని జీవితంలో ఒక భాగం: పీఎం


భారత్‌లో పెట్టుబడులకు, ఆవిష్కరణలకు, తయారీకి ఇదే సరైన సమయం: పీఎం


అంతర్జాతీయంగా మొబైల్, టెలికాం, ఎలక్ట్రానిక్స్, టెక్నాలజీ రంగాల్లో తలెత్తిన సమస్యలకు

భారత్ పరిష్కారాలను అందిస్తుంది: పీఎం

నాడు పోస్టు చేయడమైనది: 08 OCT 2025 12:40PM by PIB Hyderabad

ఆసియాలోనే అతిపెద్ద టెలికాంమీడియాటెక్నాలజీ కార్యక్రమమైన ఇండియా మొబైల్ కాంగ్రెస్ (ఐఎంసీ) 9వ సంచికను న్యూఢిల్లీలోని యశోభూమిలో ఈ రోజు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రారంభించారుఇండియా మొబైల్ కాంగ్రెస్ ప్రత్యేక ఎడిషన్‌కు ప్రతినిధులను ఆహ్వానిస్తూ.. ఆర్థిక మోసాల నివారణక్వాంటం కమ్యూనికేషన్, 6జీఆప్టికల్ కమ్యూనికేషన్సెమీకండక్టర్లు సహా ఇతర కీలకమైన అంశాలపై అనేక స్టార్టప్‌లు వినూత్న ఆలోచనలతో ఈ కార్యక్రమంలో పాల్గొన్నాయన్నారుముఖ్యమైన అంశాలపై ఏర్పాటు చేసిన ఈ ప్రదర్శనలు భారత సాంకేతిక భవిష్యత్తు భద్రమైన చేతుల్లోనే ఉందనే నమ్మకాన్ని ఇస్తున్నాయని తెలియజేశారుఈ కార్యక్రమాల నేపథ్యంలో శుభాకాంక్షలు తెలియజేశారు.

మొబైల్టెలికాం పరిధిని అధిగమించి.. కొన్నేళ్లలోనే ఆసియాలోనే అతి పెద్ద డిజిటల్ టెక్నాలజీ ఫోరంగా ఇండియా మొబైల్ కాంగ్రెస్ ఆవిర్భవించిందని తెలియజేస్తూ.. ఈ విజయ గాథను ఎలా రాశారనిదాన్ని ఎవరు నడిపించారని ప్రశ్నించారుదీనిని భారతీయ సాంకేతిక ఆలోచనలే రూపొందించాయనిప్రతిభాశక్తితో నిండిన దేశ యువత దానిని ముందుకు నడిపించిందని వివరించారు.

దేశీయ సామర్థ్యానికి ప్రభుత్వం అందించిన బలమైన తోడ్పాటుతోనే ఈ వృద్ధి సాధ్యమైందనిదీనిని ఆవిష్కర్తలుఅంకుర సంస్థలు ముందుకు తీసుకెళ్లాలని ప్రధానమంత్రి అన్నారుటెలికాం టెక్నాలజీ డెవలప్మెంట్ ఫండ్డిజిటల్ కమ్యూనికేషన్స్ ఇన్నోవేషన్స్ స్వేర్ లాంటి కార్యక్రమాల ద్వారా అంకుర సంస్థలకు నిధులు అందిస్తున్నామని వెల్లడించారుఉత్పత్తులను అభివృద్ధి చేయడానికి 5జీ, 6జీ సాంకేతికతలుఅత్యాధునిక ఆప్టికల్ కమ్యూనికేషన్లుటెరాహెట్జ్ సాంకేతికతలను పరీక్షించే వ్యవస్థలను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తోందని ప్రధాని తెలియజేశారుఅంకుర సంస్థలుప్రముఖ పరిశోధనా సంస్థల మధ్య భాగస్వామ్యాల ఏర్పాటు సులభతరమైందనిప్రభుత్వ సహకారంతో భారతీయ పరిశ్రమఅంకుర సంస్థలువిద్యాసంస్థలు వివిధ రంగాల్లో సహకారం కుదుర్చుకుంటున్నాయని తెలిపారుదేశీయ సాంకేతిక పరిజ్ఞానాలను అభివృద్ధి చేయడంవిస్తరించడంలోనూపరిశోధనాభివృద్ధి ద్వారా మేధో సంపదను తయారు చేయడంఅంతర్జాతీయ ప్రమాణాలకు దోహదపడటంఇలా అన్ని కోణాల్లోనూ భారత్ పురోగమిస్తోందని ఆయన చెప్పారుఈ ప్రయత్నాలే అంతర్జాతీయ యవనికపై భారతదేశాన్ని సమర్థవంతమైన స్థానంలో నిలిపాయని వెల్లడించారు.

‘‘ఆత్మనిర్భర భారత్ దార్శనికత సామర్థ్యాన్ని టెలికాం రంగంలో ఇండియా మొబైల్ కాంగ్రెస్ సాధించిన విజయం ప్రతిబింబిస్తుంది’’ అని ప్రధాని చెప్పారుసాంకేతికంగా అధునాతన ఉత్పత్తులను తయారు చేయడంలో భారత్ సామర్థ్యాన్ని సందేహించిన సంశయవాదులు ‘మేక్ ఇన్ ఇండియా’ ఆలోచనను ఎలా హేళన చేశారో గుర్తు చేసుకున్నారుగత ప్రభుత్వాల హయాంలో కొత్త సాంకేతికతలను స్వీకరించడానికి దశాబ్దాల తరబడి జాప్యం చేశారని విమర్శించారుదేశం నిర్ణయాత్మకంగా స్పందించిందని శ్రీ మోదీ స్పష్టం చేశారుఒకప్పుడు 2జీ తో ఇబ్బందులు ఎదుర్కొన్న దేశంలో ఇప్పుడు ప్రతి జిల్లాలోనూ 5జీ సేవలు అందుతున్నాయని, 2014 నుంచి ఎలక్ట్రానిక్ వస్తువుల ఉత్పత్తి ఆరు రెట్లు పెరిగిందనిమొబైల్ ఫోన్ల తయారీ 28 రెట్లు పెరిగిందనిఅదే సమయంలో వాటి ఎగుమతులు 127 రెట్లు పెరిగాయని వెల్లడించారుగడచిన దశాబ్దంలో మొబైల్ ఫోన్ల తయారీ రంగం మిలియన్ల సంఖ్యలో ప్రత్యక్ష ఉద్యోగాలను కల్పించిందిఇటీవలే ఒక ప్రధాన స్మార్ట్ ఫోన్ సంస్థ విడుదల చేసిన సమాచారాన్ని ఉటంకిస్తూ.. ఈ తయారీ వ్యవస్థలో 45 భారతీయ సంస్థలున్నాయనిదాదాపుగా 3.5 లక్షల ఉద్యోగాలను ఒకే సంస్థ అందించిందని వెల్లడించారుదేశవ్యాప్తంగా అనేక సంస్థలు పెద్ద ఎత్తున ఉత్పత్తిలో నిమగ్నమయ్యాయనిపరోక్ష ఉద్యోగాలను కూడా జోడిస్తే.. ఉపాధి గణాంకాలు మరింత పెరుగుతాయని ప్రధానమంత్రి తెలియజేశారు.

‘‘స్వదేశీ విజయంగా నిలిచిన మేడిన్ ఇండియా 4జీ స్టాక్‌ను భారత్ ఇటీవలే ప్రారభించిందితద్వారా ఈ సామర్థ్యమున్న అయిదు దేశాల సరసన భారత్ చేరింది’’ అని శ్రీ మోదీ చెప్పారుదీనిని డిజిటల్ స్వావలంబనసాంకేతిక స్వాతంత్ర్యం దిశగా వేసిన కీలకమైన ముందడుగుగా అభివర్ణించారుదేశీయంగా అభివృద్ధి చేసిన 4జీ, 5జీ స్టాక్ ద్వారా ఎలాంటి అవరోధాలు లేని అనుసంధానాన్ని నిర్దారిస్తూ.. హై స్పీడ్ ఇంటర్నెట్‌నునమ్మకమైన సేవలను తన పౌరులకు భారత్ అందిస్తోందని ఆయన తెలియజేశారు.

4జీ స్టాక్‌ను ప్రారంభించిన రోజున దేశవ్యాప్తంగా దాదాపుగా ఒక లక్ష 4జీ టవర్లు ఒకే సమయంలో పనిచేయడం ప్రారంభించి.. రెండు కోట్ల మంది ప్రజలను భారత డిజిటల్ ఉద్యమంలో భాగం చేశాయన్నారువీటిలో ఎక్కువ భాగం మారుమూల ప్రాంతాల్లోనూ.. గతంలో డిజిటల్ అనుసంధానం లేని చోటే ఉన్నాయనిఇప్పుడు ఈ ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవలు అందుబాటులోకి వచ్చాయని వివరించారు.

భారత్‌లో తయారైన 4జీ స్టాక్‌లో మరో ప్రధాన అంశం ఎగుమతుల సంసిద్ధత గురించి శ్రీ మోదీ ప్రస్తావించారుదేశీయంగా అభివృద్ధి చేసిన ఈ స్టాక్ భారతీయ వ్యాపార విస్తృతికి మాధ్యమంగా పనిచేస్తుందని, ‘ఇండియా 6జీ విజన్ 2030’ దిశగా తోడ్పాటు అందిస్తుందన్నారు.

గడచిన దశాబ్దంలో భారతీయ సాంకేతిక విప్లవం వేగంగా అభివృద్ధి చెందిందనిఈ వేగాన్నిస్థాయిని అందుకోవడానికి చట్టపరంగా బలమైనఆధునిక విధాన పునాది అవసరమైందని ప్రధానమంత్రి తెలియజేశారుముత్తాతల నాటికాలం చెల్లిన టెలిగ్రాఫ్ చట్టంఇండియన్ వైర్లెస్ టెలిగ్రాఫ్ చట్టం స్థానంలో ఆధునిక టెలీకమ్యూనికేషన్ల చట్టాన్ని తీసుకువచ్చినట్లు తెలిపారు. 21వ శతాబ్దపు విధానాలకు అనుగుణంగా కొత్త నియమావళి ఉండాల్సిన వివరిస్తూ.. దానిని ప్రభుత్వం విజయవంతంగా అమలు చేసిందని స్పష్టం చేశారుకొత్త చట్టం.. నియంత్రణా వ్యవస్థగా కాకుండా.. ఆమోద ప్రక్రియను సులభతరం చేసేఅనుమతులను సత్వరమే జారీ చేసే సహాయకారిగా పనిచేస్తుందన్నారుఫలితంగా ఫైబర్మొబైల్ నెట్వర్క్ విస్తరణ వేగంగా సాగుతోందనివ్యాపార సౌలభ్యం విస్తరిస్తోందనిపెట్టబడులకు ప్రోత్సాహం లభిస్తోందనిపరిశ్రమలు దీర్ఘకాలికంగా ప్రణాళికలు రచించడానికి వీలవుతోందని శ్రీ మోదీ వెల్లడించారు.

దేశంలో సైబర్ భద్రతకు సమ ప్రాధాన్యం ఇస్తున్నట్లు ప్రధానమంత్రి తెలిపారుసైబర్ మోసాలకు వ్యతిరేకంగా కఠినమైన చట్టాలు చేశామనిజవాబుదారీతనాన్ని పెంచామనిసమస్యల పరిష్కార మార్గాలను మెరుగుపరిచామని చెప్పారుదీనివల్ల పరిశ్రమలువినియోగదారులు లబ్ధిపొందుతున్నారని వెల్లడించారు.

భారత్ సామర్థ్యాన్ని ప్రపంచం గుర్తిస్తుందని చెబుతూప్రపంచవ్యాప్తంగా రెండో అతిపెద్ద టెలికాం మార్కెట్ గా, 5జీ మార్కెట్ గా భారత్ అవతరించిందని ప్రధానమంత్రి వెల్లడించారుమార్కెట్ బలంతో పాటు మానవ వనరులుపనిచేసే సామర్థ్యంప్రగతిశీల దృక్పథంతో భారత్ ఉందన్నారుఎక్కువ సంఖ్యలోనైపుణ్యం కల మానవ వనరులు భారత్ లో ఉన్నాయని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారుప్రపంచంలోనే అత్యధిక యువ జనాభా భారత్ లో ఉందనిఈ తరానికి భారీ స్థాయిలో శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారుప్రస్తుతం భారత్ లో అత్యంత వేగంగా సాఫ్ట్ వేర్ నిపుణుల సంఖ్య పెరుగుతోందని వ్యాఖ్యానించారు.

భారత్ లో ప్రస్తుతం ఒక కప్పు టీ ధర కంటే ఒక జీబీ వైర్ లెస్ డేటా ధర తక్కువగా ఉందని శ్రీ నరేంద్ర మోదీ అన్నారువినియోగదారులవారీగా డేటా వినియోగంలో ముందున్న దేశాల్లో ఒకటిగా భారత్ నిలుస్తుందనిడిజిటల్ కనెక్టివిటీ ఇకపై విలాస వస్తువేమీ కాదనిఅది రోజువారీ జీవితంలో ఒక అవసరంగా మారిందని స్పష్టం చేశారు.

"పరిశ్రమలుపెట్టుబడిని విస్తరించాన్న ఆలోచనతో భారత్ ముందుకు వెళ్తుందిఅని శ్రీ నరేంద్ర మోదీ అన్నారుదేశంలోని ప్రజాస్వామ్య వ్యవస్థప్రభుత్వాలు పెట్టుబడులను ఆహ్వానించే వైఖరిసులభతర వాణిజ్య విధానాలుభారత్ ను పెట్టుబడిదారులకు అనుకూల గమ్యస్థానంగా మార్చిందని తెలిపారుప్రభుత్వానికున్న డిజిటల్-ఫస్ట్ అనే విధానానికి నిదర్శనంగా భారత్ లోని డిజిటల్ ప్రజా మౌలిక సదుపాయాలు సాధించిన విజయాలను ప్రస్తావించారు. "భారత్ లో పెట్టుబడులు పెట్టేందుకునూతన ఆవిష్కరణలకుమేక్ ఇన్ ఇండియా కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు ఇదే అత్యుత్తమ సమయం!" అని ప్రధానమంత్రి పూర్తి విశ్వాసంతో స్పష్టం చేశారుతయారీ రంగం నుంచి సెమీ కండక్టర్లుమొబైల్స్ నుంచి ఎలక్ట్రానిక్స్ వరకుఅన్ని రంగాల్లో స్టార్టప్ లతో భారత్ లో అవకాశాలుఉత్సాహం పెరుగుతుందన్నారు.

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్రకోట నుంచి తాను చేసిన ప్రసంగాన్ని గుర్తు చేసుకుంటూప్రస్తుత సంవత్సరాన్ని ప్రధాన సంస్కరణలుపరివర్తనాత్మక మార్పుల ఏడాదిగా ప్రధానమంత్రి ప్రకటించారువేగంగా మారుతున్న సంస్కరణలతో పరిశ్రమలుఆవిష్కర్తల బాధ్యత కూడా పెరుగుతుందన్నారువేగంసాహస సామర్థ్యాలతో సరికొత్త మార్గాలుఅవకాశాలను సృష్టిస్తున్న అంకుర సంస్థలుయువ ఆవిష్కర్తల కీలక పాత్రను ఆయన స్పష్టం చేశారుఈ ఏడాది ఇండియా మొబైల్ కాంగ్రెస్ 500కు పైగా అంకుర సంస్థలను ఆహ్వానించడం.. పెట్టుబడిదారులుప్రపంచవ్యాప్తంగా ఉన్న నిపుణులతో అనుసంధానమయ్యే అవకాశాన్ని కల్పించటం పట్ల శ్రీ నరేంద్ర మోదీ సంతృప్తి వ్యక్తం చేశారు.

ఈ రంగాన్ని విస్తరించేందుకు ఇప్పటికే స్థిరపడిన సంస్థలు ముఖ్య పాత్రను పోషిస్తున్నాయనిపరిశోధనఅభివృద్ధి సామర్థ్యాల మద్దతులో దేశ ఆర్థిక వ్యవస్థను ముందుకు నడిపేందుకు ఈ సంస్థలు స్థిరత్వంపరిమాణందిశను చూపిస్తున్నాయని తెలిపారుస్టార్టప్ ల వేగంస్థిరమైన సంస్థలు కలిసి పనిచేయటం ద్వారా భారత్ మరింత శక్తిమంతంగా మారుతుందని ప్రధానమంత్రి స్పష్టం చేశారు.

పరిశ్రమలోని అనేక కీలక రంగాల్లో యువ స్టార్టప్ ఆవిష్కర్తలువిద్యాసంస్థలుపరిశోధనా సంఘంవిధాన రూపకర్తల నుంచి ఉమ్మడి ప్రయత్నాలు అవసరమని చెబుతూఅటువంటి చర్చలకు ఇండియా మొబైల్ కాంగ్రెస్ వంటి వేదికలు సమర్థ ఉత్ప్రేరకాలుగా ఉపయోగపడతాయని ప్రధానమంత్రి ఆశాభావం వ్యక్తం చేశారుమొబైల్టెలికాంఎలక్ట్రానిక్స్విస్తృత సాంకేతిక వ్యవస్థలో ప్రపంచ సరఫరా వ్యవస్థలోని అంతరాయాలపై దృష్టి సారించాలనిప్రపంచంలో ఎక్కడ అడ్డంకులు ఉన్నాపరిష్కారాలను అందించే అవకాశం భారత్ కు ఉందని ఆయన తెలిపారుగతంలో సెమీ కండక్టర్ తయారీ సామర్థ్యం కొన్ని దేశాల్లోనే ఉండేదనిప్రపంచం ఇప్పుడు వైవిధ్యాన్ని కోరుకుంటున్నదని శ్రీ నరేంద్ర మోదీ ఉదహరించారుఈ దిశగా భారత్ చర్యలు తీసుకుంటుందనిదేశవ్యాప్తంగా పది సెమీ కండక్టర్ తయారీ యూనిట్లలో పనులు జరుగుతున్నట్లు ఆయన వెల్లడించారు.

పరిమాణంవిశ్వసనీయతను అందించగలిగే నమ్మకమైన భాగస్వామ్య గ్లోబల్ కంపెనీల కోసం ఎలక్ట్రానిక్స్ తయారీ రంగం చూస్తుందని ప్రధానమంత్రి అన్నారుటెలికాం నెట్‌వర్క్ పరికరాల తయారీకి కూడా నమ్మకమైన భాగస్వాములు అవసరమని చెప్పారుఈ సందర్భంగా ఆయన ఒక బలమైన ప్రశ్నను సంధించారు... భారతీయ కంపెనీలు నమ్మదగిన ప్రపంచ సరఫరాదారులుగాతయారీ భాగస్వాములుగా ఎందుకు మారలేవు?

మొబైల్ తయారీకి కావాల్సిన చిప్ సెట్లుబ్యాటరీలుడిస్ ప్లేలుసెన్సార్ల వంటి విడిభాగాలు దేశంలోనే ఉత్పత్తి చేయాల్సిన అవసముందని శ్రీ మోదీ అన్నారుగతంలో ఎన్నడూ లేనంత డేటాను ప్రపంచం ఉత్పత్తి చేస్తోందనిదీనివల్ల నిల్వ చేయటంభద్రతసార్వభౌమాధికారం వంటి అంశాలు కీలకమవుతాయని చెప్పారుడేటా కేంద్రాలుక్లౌడ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ పై పనిచేయటం ద్వారా ప్రపంచ డేటా కేంద్రంగా ఎదిగే సామర్థ్యం భారత్ కు ఉందని ప్రధానమంత్రి స్పష్టం చేశారురాబోయే సెషన్లు కూడా అదే విధానాన్నిలక్ష్యాన్ని కొనసాగిస్తాయని ఆశిస్తూ ప్రసంగాన్ని ముగించారుఇండియా మొబైల్ కాంగ్రెస్ కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ మరోసారి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రులు శ్రీ జ్యోతిరాదిత్య సింథియాడాక్టర్ చంద్రశేఖర్ పెమ్మసానిఇతర ప్రముఖులు పాల్గొన్నారు.

నేపథ్యం

టెలి కమ్యూనికేషన్ విభాగం (డీఓటీ), సెల్యూలార్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (సీఓఏఐసంయుక్తంగా నిర్వహిస్తున్న ఇండియా మొబైల్ కాంగ్రెస్ (ఐఎంసీ) 2025 అక్టోబర్ నుంచి 11వ తేదీ వరకు జరుగుతుంది. "మార్పు కోసం ఆవిష్కరణఅనే ఇతివృత్తంతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం డిజిటల్ మార్పుసామాజిక పురోగతికి ఆవిష్కరణలను వినియోగించుకోవాలనే భారతదేశ ప్రాధాన్యతను స్పష్టం చేస్తుంది.

టెలికాంఅభివృద్ధి చెందుతున్న సాంకేతికతలోని తాజా పరిణామాలను ఐఎంసీ 2025 ప్రదర్శిస్తుందిఈ కార్యక్రమంలో ప్రపంచ నాయకులువిధాన రూపకర్తలుపారిశ్రామిక రంగ నిపుణులుఆవిష్కర్తలు పాల్గొంటున్నారుఆప్టికల్ కమ్యూనికేషన్లుటెలికాం రంగంలో సెమీ కండక్టర్లుక్వాంటమ్ కమ్యూనికేషన్లు, 6జీఫ్రాడ్ రిస్క్ ఇండికేటర్లు వంటి కీలక అంశాలపై ఈ కార్యక్రమం దృష్టి సారిస్తుందిదీని ద్వారా భవిష్యత్ తరం కనెక్టివిటీడిజిటల్ సార్వభౌమాధికారంసైబర్ మోసాల నియంత్రణప్రపంచ సాంకేతిక నాయకత్వంలో భారత వ్యూహాత్మక ప్రాధాన్యతలను తెలియజేస్తుంది.

150కి పైగా దేశాల నుంచి 1.5 లక్షల మందికి పైగా సందర్శకులు, 7,000కు పైగా ప్రపంచ ప్రతినిధులు, 400లకు పైగా కంపెనీలు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నాయి. 5G/6G, ఏఐస్మార్ట్ మొబిలిటీసైబర్‌ భద్రతక్వాంటం కంప్యూటింగ్గ్రీన్ టెక్నాలజీ వంటి రంగాల్లో 1,600కి పైగా నూతన వినియోగ పద్ధతులు 100కి పైగా సెషన్లలో 800కి పైగా వక్తల ద్వారా తెలియజేస్తారు.

ఈ కార్యక్రమంలో జపాన్కెనడాయూకేరష్యాఐర్లాండ్ఆస్ట్రియా ప్రతినిధుల బృందాలు పాల్గొనటం ద్వారా అంతర్జాతీయ సహకారాన్ని ఐఎంసీ 2025 స్పష్టం చేస్తుంది.


(రిలీజ్ ఐడి: 2176530) సందర్శకుల సూచీ సంఖ్య : : 48