ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఒడిశాలోని ఝార్సుగూడలో పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవంలో ప్రధానమంత్రి ప్రసంగం

Posted On: 27 SEP 2025 3:53PM by PIB Hyderabad

జై జగన్నాథ్జై మాతా సమలేయ్జై మాతా రామ చండీ!

ఇక్కడి కొంతమంది యువ మిత్రులు అనేక కళాకృతులను తీసుకువచ్చారుఒడిశాకు కళ పట్ల ఉన్న ప్రేమ ప్రపంచ ప్రసిద్ధి చెందిందిమీ అందరి నుంచి నేను ఈ కానుకలను స్వీకరిస్తాను.. ఈ కానుకలన్నీ మీ నుంచి సేకరించమని నా ఎస్‌పీజీ సహచరులను నేను అభ్యర్థిస్తున్నానుమీరు మీ పేరుచిరునామాను వెనుక రాసి ఇస్తే మీకు కచ్చితంగా నా నుంచి ఒక లేఖ వస్తుందిఅక్కడ వెనకాల ఒక అబ్బాయి చాలాసేపు ఏదో పట్టుకుని ఉన్నట్లు నేను చూస్తున్నానుఅతని చేతులు నొప్పి పెట్టవచ్చు.. దయచేసి అతనికి సహాయం చేసి దానిని కూడా సేకరించండివెనక మీ పేరుచిరునామా రాసి ఉంటేనేను కచ్చితంగా మీకు లేఖ రాస్తానుఈ కళాకృతులను తయారు చేసినందుకు.. మీ అభిమానానికీ.. యువతీయువకులకుచిన్న పిల్లలకు నేను హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను.

 

ఒడిశా గవర్నర్ శ్రీ హరిబాబు గారుఅత్యంత ప్రజాదరణ గలఅంకితభావం కలిగిన ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ గారుకేంద్ర మంత్రివర్గంలో నా సహచరులు జుయెల్ ఓరం గారుఒడిశా ఉప ముఖ్యమంత్రులు ప్రవతి పరిదా గారుకనక్ వర్ధన్ సింగ్ దేవ్ గారుపార్లమెంటులో నా సహచరులు బైజయంత్ పాండా గారుప్రదీప్ పురోహిత్ గారుఒడిశా భాజపా అధ్యక్షులు మన్మోహన్ సమల్ గారు అలాగే వేదికపై ఆసీనులైన ఇతర ప్రముఖులు..

 

లక్షలాది మంది ప్రజలతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న అనేక మంది కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు ఈ రోజు కార్యక్రమంలో వివిధ ప్రాంతాల నుంచి మాతో అనుసంధానమయ్యారువారందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నానుఝార్సుగూడలోని నా సోదరీ సోదరులకు నేను గౌరవంగా నమస్కరిస్తున్నానుమీ ఆప్యాయతకు నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నానుఈ కార్యక్రమానికి హాజరైన గౌరవనీయ ప్రముఖులందరికీ జోహార్.

 

మిత్రులారా,

 

ప్రస్తుతం నవరాత్రి పండగ జరుగుతోంది. ఈ పవిత్రమైన పండగ రోజుల్లో మాతా సమలేయ్మాతా రామ చండీ కొలువైన భూమిపై మీ అందరి 'దర్శనంపొందే అదృష్టం నాకు లభించిందిపెద్ద సంఖ్యలో తల్లులుఆడపడుచులు ఈ కార్యక్రమానికి తరలివచ్చారుమీ ఆశీర్వాదాలు మాకు బలం.. మీ అందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను.

సోదరీ సోదరులారా,

 

ఏడాదిన్నర క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఒడిశా ప్రజలు కొత్త తీర్మానంతో ప్రతిజ్ఞ చేశారుఆ సంకల్పం ‘వికసిత్ ఒడిశా’ కోసంనేడు ఒడిశా డబుల్ ఇంజిన్ ప్రభుత్వ వేగంతో ముందుకు సాగడం ప్రారంభించడాన్ని మనం చూడవచ్చుఒడిశా అభివృద్ధి కోసందేశాభివృద్ధి కోసం వేల కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులు ఈ రోజు ప్రారంభమయ్యాయినేటి నుంచి బీఎస్ఎన్ఎల్ కొత్తగా మన ముందుకు వస్తోందిబీఎస్ఎన్ఎల్ స్వదేశీ 4G సేవలు ప్రారంభించుకున్నాందేశంలోని అనేక రాష్ట్రాల్లో ఐఐటీల విస్తరణ కూడా ఈ రోజు ప్రారంభమైందిఒడిశాలో విద్యనైపుణ్యాభివృద్ధికనెక్టివిటీకి సంబంధించిన అనేక ప్రాజెక్టులూ ప్రారంభించుకున్నాంమరికొన్ని పనులకు శంకుస్థాపన చేసుకున్నాంకొద్దిసేపటి కిందట బెర్హంపూర్ నుంచి సూరత్ వరకు ఆధునిక అమృత్ భారత్ రైలు ప్రారంభమైందిసూరత్‌తో సంబంధం ఎంత ముఖ్యమో మీకు కూడా తెలుసుసూరత్‌లో బంధువులు లేని గ్రామం ఈ ప్రాంతంలో చాలా అరుదుపశ్చిమ బెంగాల్ తర్వాతఒడిశా వెలుపల అతిపెద్ద ఒడియా జనాభా గుజరాత్‌లోనే ముఖ్యంగా సూరత్‌లోనే నివసిస్తుందని కూడా కొందరు అంటున్నారుఅందుకే ఇక్కడ నుంచి నేరుగా రైలు సేవలను వారి కోసం ప్రారంభించాంఈ అభివృద్ధి పనులన్నింటి కోసం మీ అందరికీఒడిశా ప్రజలందరికీ నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నానుఈ రోజు మన రైల్వే మంత్రి కూడా సూరత్‌ నుంచి ఒడియా సోదరీ సోదరులందరితో కలిసి ఈ కార్యక్రమంలో మనతో పాటు చేరారు.

 

మిత్రులారా,

 

భాజపా ప్రభుత్వం పేదలకు సేవ చేసే, పేదలకు సాధికారత కల్పించే ప్రభుత్వంపేదలుదళితులువెనకబడిన వర్గాలుగిరిజన వర్గాలకు ప్రాథమిక సౌకర్యాలు కల్పించడం మా ప్రాధాన్యంగా ఉంటుందిఈ కార్యక్రమంలోనూ మేం ఆ నిబద్ధతను చూస్తున్నాంఅంత్యోదయ గృహ యోజన లబ్ధిదారులకు మంజూరీ పత్రాలను అందజేసే అవకాశం నాకు లభించిందిఒక పేద కుటుంబానికి పక్కా ఇల్లు లభించినప్పుడు.. అది వారి వర్తమానాన్ని సులభతరం చేయడమే కాకుండా భవిష్యత్ తరాల జీవితాన్ని కూడా సురక్షితం చేస్తుందిఇప్పటివరకు మా ప్రభుత్వం దేశవ్యాప్తంగా నాలుగు కోట్లకు పైగా పేద కుటుంబాలకు పక్కా ఇళ్ళు అందించిందిఒడిశాలో కూడా వేలాది ఇళ్ళు వేగంగా నిర్మితమవుతున్నాయిఈ విషయంలో మా ముఖ్యమంత్రి మోహన్ జీఆయన బృందం ప్రశంసనీయమైన పని చేస్తున్నారునేటికి దాదాపు యాభై వేల కుటుంబాల సొంత ఇంటి కల నెరవేరిందిఒడిశాలో ప్రధానమంత్రి జన్ మన్ యోజన కింద గిరిజన కుటుంబాల కోసం 40,000కి పైగా ఇళ్ళు మంజూరయ్యాయిఅంటే అత్యంత అణగారిన గిరిజన వర్గాలకు ఈ రోజు వారి అతి పెద్ద కల నెరవేరుతోందిలబ్ధిదారులైన నా సోదరీ సోదరులందరికీ శుభాకాంక్షలు.

 

మిత్రులారా,

ఒడిశా సామర్థ్యంపైనాస్థానిక ప్రజల ప్రతిభపైనా నాకు ఎప్పుడూ గొప్ప నమ్మకం ఉందిప్రకృతి ఒడిశాను సమృద్ధిగా దీవించిందిఒడిశా దశాబ్దాల పేదరికాన్ని చూసింది.. కానీ ఇప్పుడు ఈ దశాబ్దం మిమ్మల్ని శ్రేయస్సు దిశగా నడిపిస్తుందిఈ దశాబ్దం ఒడిశా జీవితంలో చాలా ముఖ్యమైందిమా ప్రభుత్వం ఒడిశాకు ప్రధాన ప్రాజెక్టులనూ తీసుకువస్తోందిఇటీవలే కేంద్ర ప్రభుత్వం ఒడిశా కోసం రెండు సెమీ కండక్టర్ యూనిట్లను కేటాయించిందిఇంతకుముందు అస్సాంలో గానీఒడిశాలో గానీ సెమీ కండక్టర్ల వంటి అత్యాధునిక పరిశ్రమను స్థాపించవచ్చని ఎవరూ ఊహించి ఉండరుకానీ ఇక్కడి యువత సామర్థ్యం కారణంగానే ఇప్పుడు అలాంటి పరిశ్రమలు మీ దగ్గరకు వస్తున్నాయిచిప్స్ తయారు చేయడానికి ఒడిశాలో సెమీ కండక్టర్ పార్కు కూడా ఏర్పాటు కానుందిమీ ఫోన్టీవీఫ్రిజ్కంప్యూటర్కారుఅనేక ఇతర పరికరాలకు శక్తినిచ్చేది.. అది లేకుండా ఏ పరికరం పనిచేయలేనిది అయిన చిన్న చిప్ ఇక్కడ ఒడిశాలోనే తయారయ్యే రోజు మరెంతో దూరంలో లేదుఇప్పుడు బిగ్గరగా చెప్పండి-జై జగన్నాథ్!

 

మిత్రులారా,

 

చిప్స్ నుంచి షిప్స్ వరకు ప్రతి రంగంలోనూ భారత్ స్వయం-సమృద్ధి సాధించాలనేది మా సంకల్పంనేను మిమ్మల్ని ఒక విషయం అడుగుతున్నానుమీరు జవాబిస్తారానేను అడిగితే మీరు సమాధానం ఇస్తారామీరు పూర్తి శక్తితో సమాధానం ఇస్తారానాకు చెప్పండి.. భారత్ స్వయం-సమృద్ధి సాధించాలా వద్దాభారత్ స్వయం-సమృద్ధి సాధించాలా వద్దాభారత్ స్వయం-సమృద్ధి సాధించాలా వద్దాచూడండి.. ఈ దేశంలోని ప్రతి పౌరుడు మన దేశం ఇప్పుడు ఎవరిపైనా ఆధారపడకూడదని కోరుకుంటున్నాడుభారత్ ప్రతి విషయంలోనూ స్వయం-సమృద్ధి సాధించాలిఅందుకే పారాదీప్ నుంచి ఝార్సుగూడ దాకా విశాలమైన పారిశ్రామిక కారిడార్‌ను అభివృద్ధి చేస్తున్నాం.

 

సోదరీ సోదరులారా,

ఆర్థికంగా బలంగా మారాలనుకునే ఏ దేశమైనా నౌకా నిర్మాణానికి, పెద్ద పెద్ద నౌకలను తయారు చేయడానికి ఎక్కువ ప్రాధాన్యమిస్తుందినౌకా నిర్మాణం ద్వారా వాణిజ్యంసాంకేతికతజాతీయ భద్రత వంటి ప్రతి రంగానికి ప్రయోజనం కలుగుతుందిమనకు సొంత నౌకలు ఉన్నప్పుడు సంక్షోభ సమయాల్లో కూడా ప్రపంచంతో ఎగుమతులు-దిగుమతులకు అంతరాయం ఉండదుఅందుకే మన భాజపా ప్రభుత్వం చాలా పెద్ద ముందడుగు వేసిందిదేశంలో నౌకా నిర్మాణం కోసం మేం 70,000 కోట్ల రూపాయల ప్యాకేజీని ఆమోదించాందీని వల్ల దేశంలోకి దాదాపు 4.5 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడి వస్తుందిఈ డబ్బు ఉక్కుయంత్రాలుఎలక్ట్రానిక్స్చిన్న-కుటీర పరిశ్రమలకు చేరుతుందిఅతిపెద్ద ప్రయోజనం నా యువతకు.. ఈ దేశంలోని కుమారులుకుమార్తెలకు వెళుతుందిఇది లక్షలాది కొత్త ఉద్యోగాలు సృష్టిస్తుందిఒడిశా కూడా దీని నుంచి చాలా ప్రయోజనం పొందుతుందిఒడిశా పరిశ్రమలుయువత ఈ ఉపాధి అవకాశాల నుంచి చాలా ప్రయోజనం పొందుతారు.

 

మిత్రులారా,

దేశం స్వయం-సమృద్ధి దిశగా ఈ రోజు కీలక ముందడుగు వేసిందిటెలికాం ప్రపంచంలో 2జీ, 3జీ, 4జీ సేవలు ప్రారంభమయ్యే నాటికి భారత్ చాలా వెనకబడి ఉందిఅప్పుడు ఏమి జరిగిందో మీ అందరికీ బాగా తెలుసు. 2జీ, 3జీ గురించిన జోకులు సోషల్ మీడియాలో విస్తృతంగా వ్యాపించాయి.

 

సోదరీ సోదరులారా,

2జీ, 3జీ, 4జీ సేవల సాంకేతికతల కోసం భారత్ విదేశాలపై ఆధారపడి ఉండేదిఅలాంటి పరిస్థితి మన దేశానికి మంచిది కాదుఅందుకే ఈ ముఖ్యమైన టెలికాం సాంకేతికతలను భారత్‌లోనే అభివృద్ధి చేయాలని దేశం నిర్ణయించిందిబీఎస్ఎన్ఎల్ మన దేశంలో పూర్తిగా స్వదేశీ 4జీ సాంకేతికతను అభివృద్ధి చేయడం మనకు గర్వకారణంకృషిఅంకితభావంఅపారమైన నైపుణ్యంతో బీఎస్ఎన్ఎల్ చరిత్ర సృష్టించిందిఈ విజయానికి దోహదపడిన మన దేశ యువతనువారి ప్రతిభనుభారత్‌ స్వయం-సమృద్ధి కోసం వారు చేసిన గొప్ప సేవను నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నానుభారతీయ కంపెనీలు ఈ రోజు పూర్తిగా స్వదేశీ సాంకేతికతతో 4జీ సేవలను ప్రారంభించగల సామర్థ్యం ఉన్న ప్రపంచంలోని ఐదు దేశాల సరసన భారత్‌ను సగర్వంగా నిలిపాయిఇప్పుడు 4జీ సేవలు ప్రారంభించడానికి 'స్వదేశీసాంకేతికతను కలిగి ఉన్న ప్రపంచంలోని ఐదు దేశాల్లో మనం కూడా ఉన్నాం.

 

మిత్రులారా,

యాదృచ్ఛికమే అయినాఈ రోజు బీఎస్ఎన్ఎల్ 25వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకుంటున్నదిఈ చరిత్రాత్మక సందర్భంలో బీఎస్ఎన్ఎల్దాని భాగస్వాముల కృషి ద్వారా భారత్ ప్రపంచ టెలికాం తయారీ కేంద్రంగా మారే దిశగా ముందుకు సాగుతోందిఈ రోజు ఝార్సుగూడ నుంచి బీఎస్ఎన్ఎల్ స్వదేశీ 4జీ నెట్‌వర్క్ ప్రారంభం కావడం ఒడిశాకు గర్వకారణంఇందులో దాదాపు లక్ష 4జీ టవర్లు ఉన్నాయిఇది జాతికే గర్వకారణంఈ టవర్లు దేశంలోని మారుమూల ప్రాంతాలను అనుసంధానించడంలో కొత్త విప్లవాన్ని తీసుకురాబోతున్నాయిఈ 4జీ టెక్నాలజీ విస్తరణతో దేశవ్యాప్తంగా కోట్లకు పైగా ప్రజలు ప్రత్యక్ష ప్రయోజనం పొందుతారుహై-స్పీడ్ ఇంటర్నెట్ సౌకర్యం లేని దాదాపు 30,000 గ్రామాలు ఇప్పుడు అనుసంధానమవుతున్నాయి.


 

మిత్రులారా

ఈ చారిత్రాత్మక ఘట్టాన్ని ఈ వేలాది గ్రామాల ప్రజలు కూడా ఈ రోజు మనతో పాటు వీక్షిస్తున్నారుఈ కొత్త హై-స్పీడ్ ఇంటర్నెట్ సాంకేతికత ద్వారా సరిహద్దులలోని మారుమూల గ్రామాల్లో ఉన్న వాళ్లు ఇక్కడ జరిగేది చూస్తూ మాట్లాడేది వింటున్నారుఈ శాఖ బాధ్యతలు నిర్వహించే మన కమ్యూనికేషన్ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా గారు కూడా ఈ రోజు అస్సాం నుంచి మనతో పాటు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు.

మిత్రులారా

బీఎస్ఎన్ఎల్ స్వదేశీ 4జీ సేవల ద్వారా నా గిరిజన ప్రాంతాలునా గిరిజన సోదరీసోదరులుమారుమూల గ్రామాలుసుదూర కొండ ప్రాంతాలకు ప్రయోజకం చేకూరుతుందిఇప్పుడు ఈ ప్రాంతాల్లో నివసించే ప్రజలు కూడా అద్భుతమైన డిజిటల్ సేవలను పొందుతారుగ్రామీణ ప్రాంతాల్లోని పిల్లలు ఆన్‌లైన్ తరగతులకు హాజరుకావచ్చు.. మారుమూల ప్రాంతాల్లోని రైతులు పంటల ధరలను తెలుసుకోవచ్చు.. ఆనారోగ్యంగా ఉన్న వారు టెలిమెడిసిన్ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాల ద్వారా దేశంలోని ఉత్తమ వైద్యుల నుంచి వైద్య సలహా తీసుకోవచ్చుఇది సరిహద్దులలోహిమాలయాల శిఖరాల్లోఎడారుల్లో విధులు నిర్వర్తిస్తోన్న మన సైనికులకు కూడా ఎంతో ప్రయోజనం కలిగిస్తుందిమెరుగైన అనుసంధానత వల్ల వాళ్లు కూడా ఒకరితో ఒకరు సంభాషించుకోవచ్చు

మిత్రులారా

భారత్‌లో ఇప్పటికే అత్యంత వేగవంతమైన 5జీ సేవలు అందుబాటులోకి వచ్చాయిఈ రోజు ప్రారంభించిన బీఎస్ఎన్ఎల్ టవర్లను 5జీ సేవలకు సులభంగా ఆధునికీకరించొచ్చుఈ చారిత్రాత్మక రోజును పురస్కరించుకొని బీఎస్ఎన్ఎల్దేశ ప్రజలందరికీ నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను.

మిత్రులారా

'ఆత్మనిర్భర్ భారత్తయారుచేయాలంటే నైపుణ్యం కలిగిన యువతతో పాటు పరిశోధనలకు మంచి వాతావరణం ఉండటం కూడా అవసరంఅందుకే ఇది భాజపా ప్రభుత్వానికి ప్రధాన ప్రాధాన్యతగా ఉందినేడు ఒడిశాతో సహా దేశవ్యాప్తంగా విద్యనైపుణ్యాభివృద్ధిలో గణనీయంగా పెట్టుబడులు పెడుతున్నాందేశంలోని ఇంజనీరింగ్ కళాశాలలుపాలిటెక్నిక్‌ విద్యా సంస్థలను కూడా మేం ఆధునికీకరిస్తున్నాంఇవాళ దీనికి సంబంధించిన మెరిట్ అనే కొత్త పథకాన్ని ప్రారంభించాంఈ పథకం కింద సాంకేతిక విద్యను అందించే సంస్థలపై వేల కోట్ల రూపాయలను ఖర్చు పెట్టనున్నాంఫలితంగా నాణ్యమైన సాంకేతిక విద్య కోసం మన యువత ఇకపై పెద్ద నగరాలకు వెళ్లాల్సిన అవసరం ఉండదుఆధునిక ప్రయోగశాలలను ఉపయోగించుకునేందుకుప్రపంచ స్థాయి నైపుణ్యాలను నేర్చుకోవడానికిసొంత పట్టణాల్లోనే సొంత అంకురాలను ప్రారంభించేందుకు వాళ్లు అవకాశాలను పొందుతారు.

మిత్రులారా

ప్రస్తుతం దేశంలోని ప్రతి ప్రాంతంలోప్రతి వర్గానికిప్రతి ఒక్కరికి సదుపాయాలు అందేలా చూసుకునేందుకు పని జరుగుతోందిరికార్డు స్థాయిలో వ్యయం చేస్తున్నాంఅయితే గతంలో పరిస్థితి ఏ విధంగా ఉందో మీకు బాగా తెలుసుమిమ్మల్ని దోచుకునే అవకాశాన్ని కాంగ్రెస్ ఎప్పుడూ వదులుకోలేదు.

మిత్రులారా

2014లో ప్రజలు మా ప్రభుత్వానికి సేవ చేసే అవకాశం ఇచ్చినప్పుడే దేశాన్ని కాంగ్రెస్ దోపిడీ వ్యవస్థ నుంచి విజయవంతంగా విముక్తి చేశాంగత ప్రభుత్వ కాలంలో ఉద్యోగులువ్యాపారవేత్తలు రూ. 2 లక్షల వరకు ఆదాయం పొందినప్పటికీ.. దానిపై కూడా పన్ను చెల్లించాల్సి ఉండేదికాంగ్రెస్ ఈ వ్యవస్థను 2014 వరకు కొనసాగించిందికానీ మీరు నాకు సేవ చేయడానికి అవకాశం ఇచ్చిన తర్వాత.. ప్రస్తుతం 12 లక్షల రూపాయల వరకు వార్షిక ఆదాయం పూర్తి పన్ను రహితంగా ఉంది.

మిత్రులారా

2025 సెప్టెంబర్ 22 నుంచి ఒడిశాతో సహా దేశవ్యాప్తంగా కొత్త జీఎస్టీ సంస్కరణలు అమల్లోకి వచ్చాయిఈ సంస్కరణలు అందరికీ జీఎస్టీ బచత్ ఉత్సవ్ (పొదుపు పండుగఅనే బహుమతిని ఇచ్చాయిఇవి ముఖ్యంగా మాతృమూర్తులుసోదరీమణులకు వంటగది ఖర్చులను మరింత తగ్గించిందిచాలా నిత్యావసరాలపై ధరలు గణనీయంగా తగ్గాయినేను ఒక ఉదాహరణను ద్వారా దీన్ని వివరిస్తాను. 2014 కంటే ముందు ఒడిశాలోని ఒక కుటుంబం నిత్యావసరాలపై సంవత్సరానికి రూ.1 లక్ష ఖర్చు చేసినట్లయితే.. దానిపై రూ. 20వేల నుంచి రూ. 25వేల వరకు పన్ను ఉండేది. 2014 కంటే ముందు మీరు ఒక లక్ష రూపాయలు ఖర్చు చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం 20,000–25,000 రూపాయలను పన్నుగా తీసుకునేదిఅంటే మీరు రూ. 1 లక్ష ఖర్చు చేయాలంటే వాస్తవానికి రూ. 1.25 లక్షలు చెల్లించాల్సి వచ్చేది. 2017లో మా ప్రభుత్వం జీఎస్టీని ప్రవేశపెట్టినప్పుడు ఈ పన్నును తగ్గించటం ద్వారా మీపై భారాన్ని గణనీయంగా తగ్గించాంప్రస్తుతం చేపట్టిన నూతన సంస్కరణలతో పన్ను మరింత తగ్గిందిఇవాళ రూ. 1 లక్ష వార్షిక ఖర్చుపై ఒక కుటుంబం రూ. 5,000 నుంచి రూ. 6,000 మాత్రమే పన్ను చెల్లించాలిఇప్పుడు చెప్పండి.. గతంలో రూ. 25,000 ఎక్కడఇప్పుడు ఉన్న రూ. 5,000 నుంచి రూ. 6,000 ఎక్కడ!. కాంగ్రెస్ ప్రభుత్వ కాలంతో పోల్చితే ఇప్పుడు రూ. 1 లక్ష వార్షిక ఖర్చుపై ఒక పేదసామాన్యనవ మధ్య తరగతి కుటుంబం రూ. 15వేల నుంచి రూ. 20వేల వరకు ఆదా చేసుకుంటోంది.

మిత్రులారా

ఒడిశా రైతు బిడ్డల రాష్ట్రంజీఎస్టీ పొదుపు పండుగ రైతులకు కూడా చాలా ప్రయోనకరంగా ఉంటుందిప్రతిపక్షాల హయంలో రైతులు ట్రాక్టర్ కొనుగోలు చేసేటప్పుడు ఒక్క ట్రాక్టర్‌‍పై రూ. 70,000 పన్ను చెల్లించాల్సి ఉండేదిజీఎస్టీ ప్రవేశపెట్టి మేం ఆ పన్నును తగ్గించాంఇప్పుడు కొత్త జీఎస్టీ సంస్కరణల వల్ల రైతులు ఇప్పుడు అదే ట్రాక్టర్‌పై సుమారు రూ. 40,000 ఆదా చేసుకుంటున్నారుఇప్పుడు వరి నాట్లు వేసేందుకు ఉపయోగించే యంత్రాలపై రూ. 15,000 ఆదా చేస్తున్నారుకర్షకులు పవర్ టిల్లర్లపై రూ. 10,000, నూర్పిడి యంత్రాలపై రూ. 25,000 వరకు పొదుపు చేసుకుంటున్నారుభాజపా ప్రభుత్వం ఇలాంటి అనేక వ్యవసాయ ఉపకరణాలుపరికరాలపై పన్నులను గణనీయంగా తగ్గించింది

మిత్రురాలా

ఒడిశాలో ఎక్కువ గిరిజన జనాభా ఉంటుందివారంతా జీవనోపాధి కోసం అటవీ ఉత్పత్తులపై ఆధారపడతారుమన ప్రభుత్వం ఇప్పటికే కెండు ఆకులు సేకరించేవారి కోసం పనిచేస్తోంది.. ఇప్పుడు వీటిపై జీఎస్టీ గణనీయంగా తగ్గించిందిఇది ఈ పనిచేసే వాళ్లు కెండు ఆకులపై మెరుగైన ధరలు పొందేలా చూసుకుంటుంది

మిత్రులారా

భాజపా ప్రభుత్వం నిరంతరం మీకు పన్ను ఉపశమనం కల్పిస్తూ మీ పొదుపును పెంచుతోందిప్రతిపక్షాలు మాత్రం పాత పద్ధతులను విడిచిపెట్టటం లేదుకాంగ్రెస్ ఇప్పటికీ కూడా మిమ్మల్ని దోచుకునే పనిలో ఉంది

దీన్ని నేను కారణం లేకుండా చెప్పటం లేదుదేశవ్యాప్తంగా ప్రజలు గణనీయంగా ప్రయోజనం పొందుతున్నారన్న దానికి ఆధారాలు నా దగ్గరున్నాయికొత్త పన్ను రేట్లలో భాగంగా మేం సిమెంట్‌పై పన్ను తగ్గించాంహిమాచల్ ప్రదేశ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందికాంగ్రెస్ మమ్మల్ని అన్ని విధాలా తిట్టే అలవాటు చేసుకుందిసిమెంట్‌పై జీఎస్టీ రేటును మేం తగ్గించినప్పుడు.. దేశవ్యాప్తంగా సిమెంట్ ధరలు తగ్గాయికానీ కాంగ్రెస్ సామాన్య ప్రజలకు ఈ ఉపశమనాన్ని ఇవ్వదలుచుకోలేదుగతంలో మేం పెట్రోల్డీజిల్ ధరలను తగ్గించినప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న ప్రతిచోటా వాటిపై మరో పన్ను విధించిందిఫలితంగా ధరలు మారలేదువాళ్లు సొంత ఖజానాలను నింపుకుంటూ దోపిడీకి ద్వారాలు తెరిచారుహిమాచల్ ప్రదేశ్‌లో కూడా అదే జరిగిందిమన ప్రభుత్వం సిమెంట్ ధరను తగ్గించినప్పుడు వాళ్లు కొత్తగా సొంత పన్నును విధించారుభారత ప్రభుత్వం హిమాచల్ ప్రజలకు ఇవ్వాలనుకున్న ప్రయోజనాన్ని ఈ విధంగా ఈ దోపిడీ కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డుకుందిఅందుకే నేను చెప్పేది ఏంటంటే.. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న ప్రతిచోటా ప్రజలను దోచుకుంటుందిఅందుకే దేశ ప్రజలు కాంగ్రెస్‌తో పాటు దాని మిత్రపక్షాల పట్ల కూడా జాగ్రత్తగా ఉండాలి.

మిత్రులారా

జీఎస్టీ పొదుపు పండుగ తల్లులుఅక్కాచెళ్లెలకు ఎక్కువ ఆనందాన్ని తీసుకొచ్చిందిమహిళలుకుమార్తెలకు సేవ చేయడం మా ప్రభుత్వానికి ప్రాధాన్యతతో కూడిన అంశంమేం మాతృమూర్తులుఅక్కాచెళ్లెల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెడుతున్నాం.

మిత్రులారా

కుటుంబం కోసం త్యాగాలు చేసే వారిలో మాతృమూర్తులు మొదటి స్థానంలో ఉంటారుతల్లి చేసే త్యాగాలు మనందరికీ తెలుసుపిల్లల మీద భారం పడకుండా ప్రతి కష్టాన్ని తమపై వేసుకుంటారువైద్య ఖర్చుల భారం కుటుంబంపై పడకుండా ఉండేందుకు సొంత అనారోగ్యాలను కూడా దాచిపెడతారుదీని కోసమే ఆయుష్మాన్ భారత్ యోజన తీసుకొచ్చాంఇది దేశంలోని తల్లులుఅక్కాచెళ్లెలుమహిళలకు ఎంతో ప్రయోజనం చేకూర్చిందివీరంతా లక్షల రూపాయల వరకు ఉచిత చికిత్స పొందుతున్నారు

మిత్రులారా

తల్లి ఆరోగ్యంగా ఉన్నప్పుడు కుటుంబం ధృడంగా ఉంటుందిఅందుకే విశ్వకర్మ జయంతి సందర్భంగా సెప్టెంబర్ 17 నుంచి ప్రతి తల్లి ఆరోగ్యం కోసం దేశవ్యాప్తంగా ‘స్వస్థ్ నారిసశక్త్ పరివార్ అభియాన్’ను (ఆరోగ్యకరమైన మహిళలుబలమైన కుటుంబంప్రారంభించాంతల్లి ఆరోగ్యంగా ఉన్నప్పుడు కుటుంబం బలంగా మారుతుందిఇప్పటివరకు దేశవ్యాప్తంగా లక్షలకు పైగా ఆరోగ్య శిబిరాలను నిర్వహించాంఈ శిబిరాల్లో ఇప్పటికే కోట్లకు పైగా మహిళలు ఆరోగ్య పరీక్షలు చేయించుకున్నారువీటిలో మధుమేహంరొమ్ము క్యాన్సర్టీబీసికిల్ సెల్ అనీమియాఅనేక ఇతర వ్యాధుల కోసం పరీక్షలు నిర్వహిస్తున్నాంఒడిశాలోని మాతృమూర్తులుఅక్కాచెళ్లెలుకుమార్తెలు అందరూ ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని నేను కోరుతున్నాను.

మిత్రులారా

ప్రజలనుదేశాన్ని బలోపేతం చేసేందుకు ప్రభుత్వ నిరంతరంగా అంకితభావంతో పనిచేస్తోందిపన్ను తగ్గింపు అయినాఆధునిక అనుసంధానత అయినా మేం ప్రజా సౌలభ్యంశ్రేయస్సుకు మార్గాలను వేస్తున్నాంఒడిశా కూడా దీని నుంచి గణనీయంగా ప్రయోజనం పొందుతోందిప్రస్తుతం ఒడిశాలో ఆరు వందే భారత్ రైళ్లు నడుస్తున్నాయిదాదాపు 60 రైల్వే స్టేషన్ల ఆధునీకరణ కొనసాగుతోందిఝార్సుగూడలోని వీర్ సురేంద్ర సాయి విమానాశ్రయాన్ని ఇప్పుడు దేశంలోని అనేక ప్రధాన నగరాలకు అనుసంధానమవుతోందిఒడిశా ఇప్పుడు ఖనిజాలుగనుల తవ్వకం ద్వారా చాలా ఎక్కువ ఆదాయాన్ని పొందుతోందిసుభద్ర యోజన ద్వారా ఒడిశా మాతృమూర్తులుఅక్కాచెల్లెలకు నిరంతరం మద్దతు లభిస్తోందిమన ఒడిశా ఇప్పటికే పురోగతి మార్గంలో ప్రయాణాన్ని ప్రారంభించిందిఈ అభివృద్ధి వేగ మరింత ఊపందుకుంటుందని నేను మీకు హామీ ఇస్తున్నానుమీ అందరికీ మరోసారి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నానుఇప్పుడు పూర్తి సామర్థ్యంతో మీరంతా నాతో కలిసి అనండి—

భారత మాతా కీ జై!

భారత మాతా కీ జై!

భారత మాతా కీ జై!

జై జగన్నాథ్!

జై జగన్నాథ్!

జై జగన్నాథ్!

చాలా ధన్యవాదాలు.

గమనికప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ హిందీలో చేసిన ప్రసంగానికి అనువాదం.

 

***


(Release ID: 2172923) Visitor Counter : 12