గనుల మంత్రిత్వ శాఖ
సెప్టెంబర్ 26న ఢిల్లీలో జాతీయ జియోసైన్స్ అవార్డులు-2024 ప్రదానం చేయనున్న భారత రాష్ట్రపతి
Posted On:
25 SEP 2025 8:45AM by PIB Hyderabad
2025 సెప్టెంబర్ 26న ఉదయం 11 గంటలకు ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ సాంస్కృతిక కేంద్రంలో జరగనున్న ప్రత్యేక కార్యక్రమంలో 2024 ఏడాదికి చెందిన ప్రతిష్ఠాత్మక జాతీయ జియోసైన్స్ అవార్డులను (ఎన్జీఓ) భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము ప్రదానం చేస్తారు. ఈ కార్యక్రమానికి కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి శ్రీ జీ. కిషన్ రెడ్డి, బొగ్గు- గనుల శాఖ సహాయ మంత్రి శ్రీ సతీష్ చంద్ర దూబే హాజరవుతారు.
1966లో కేంద్ర ప్రభుత్వ గనుల మంత్రిత్వ శాఖ ప్రారంభించిన ఈ జాతీయ జియోసైన్స్ అవార్డులు.. దేశ భూవిజ్ఞాన శాస్త్ర రంగంలో ఎక్కువ కాలం నుంచి ఉన్న అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ఆవార్డులుగా ప్రసిద్ధి చెందాయి. 2009 వరకు వీటిని జాతీయ ఖనిజాల అవార్డులుగా పిలిచేవారు.
ఖనిజాల ఆవిష్కరణ- అన్వేషణ, గనుల తవ్వకానికి సంబంధించిన సాంకేతికత- ఖనిజ శుద్ధి, ప్రాథమిక లేదా అనువర్తిత భూవిజ్ఞాన శాస్త్రం వంటి భౌగోళిక శాస్త్ర రంగాల్లో అసాధారణ విజయాలు, అత్యుత్తమ కృషి చేసిన వ్యక్తులను, బృందాలను సత్కరించడమే లక్ష్యంగా ఈ అవార్డులను ఇస్తున్నారు. గనుల మంత్రిత్వ శాఖ ఏటా ఈ మూడు విభాగాల కింద జాతీయ జియోసైన్స్ అవార్డులను ప్రదానం చేస్తోంది:
I. జీవిత సాఫల్య జాతీయ జియోసైన్స్ అవార్డు
II. జాతీయ జియోసైన్స్ అవార్డు
III. జాతీయ యువ భూగర్వ శాస్త్రవేత్త అవార్డు
2024 సంవత్సరం అవార్డులకు సంబంధించి.. మూడు విభాగాల్లో 208 నామినేషన్లను మంత్రిత్వ శాఖ అందుకుంది. మూడు దశల నిశిత పరిశీలన అనంతరం ఈ మూడు విభాగాల కింద 12 అవార్డులను ఖరారు చేశారు. వీటిలో వ్యక్తిగత స్థాయిలో 9, బృంద స్థాయిలో 3 అవార్డులు ఉన్నాయి. 12 జాతీయ జియోసైన్స్ అవార్డులను భారత రాష్ట్రపతి 20 మంది భూవిజ్ఞాన శాస్త్రవేత్తలకు ప్రదానం చేస్తారు.
ఆదర్శప్రాయమైన జీవితంతో భూవిజ్ఞాన శాస్త్రంలో చేసిన కృషికి గుర్తింపుగా.. భారత జాతీయ శాస్త్రవిజ్ఞాన అకాడమీ (ఐఎన్ఎస్ఏ) సీనియర్ శాస్త్రవేత్త, ఐఐఎస్ఈఆర్ పుణేకు చెందిన విజిటింగ్ ప్రొఫెసర్ శ్యామ్ సుందర్ రాయ్కు జీవన సాఫల్య జాతీయ జియోసైన్స్ అవార్డును అందిస్తారు.
భౌగోళిక రంగంలో చేసిన అత్యుత్తమ కృషికిగాను జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా సీనియర్ భూగర్బ శాస్త్రవేత్త శ్రీ సుశోభన్ నియోగికి జాతీయ యువ భూగర్భ శాస్త్రవేత్త అవార్డును ప్రదానం చేస్తారు.
ఈ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ భూవిజ్ఞాన శాస్త్రవేత్తలు, నిపుణులు, విధాన నిర్ణేతలు, ఇతర ప్రముఖులు హాజరవుతారు. ఎన్జీఏ- 2024 అవార్డు గ్రహీతల పూర్తి జాబితా ఇక్కడ ఉంది.
జాతీయ జియోసైన్స్ అవార్డులు- 2024 జీవన సాఫల్య పురస్కారం. (ఉమ్మడి అవార్డు)
|
ప్రొఫెసర్ శ్యామ్ సుందర్ రాయ్, సీనియర్ శాస్త్రవేత్త, ఐఎన్ఎస్ఏ.. విజిటింగ్ ప్రొఫెసర్, ఐఐఎస్ఈఆర్, పుణే
|
జాతీయ జియోసైన్స్ అవార్డ్ 2024 (10 అవార్డులు)
|
విభాగం I: ఖనిజావిష్కరణ- అన్వేషణ (3 అవార్డులు)
|
ఉప విభాగం (i): ఆర్థిక లేదా వ్యూహాత్మక ప్రాముఖ్యత కలిగిన ఖనిజాల ఆవిష్కరణ- అన్వేషణ (శిలాజ ఇంధనాలు మినహాయించి), వినూత్న సాంకేతికతల ఉపయోగం. ఈ రంగంలోని రెండు అవార్డులలో కనీసం ఒక దానిని కీలక ఖనిజాలకు సంబంధించి ఇస్తారు. (2 అవార్డులు)
1. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జీఎస్ఐ) బృందం. ఇందులో వీళ్లు ఉన్నారు-
i. శ్రీ హరమాన్ మహంత, సీనియర్ భూగ్భ శాస్తవేత్త,
ii. శ్రీ ఉత్పల్ కుమార్ దాస్, సీనియర్ భూగ్భ శాస్తవేత్త,
iii. శ్రీ శ్యామ్ కుమార్ సంగం రెడ్డి, సీనియర్ భూగ్భ శాస్తవేత్త,
iv. శ్రీ సాయి కుమార్ సామల, భూగర్భ శాస్త్రవేత్త
2. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జీఎస్ఐ) బృందం. ఇందులో వీళ్లు ఉన్నారు-
i. శ్రీ నవజీత్ సింగ్ నయ్యర్, డైరెక్టర్,
ii. శ్రీ అమిత్ కుమార్, సీనియర్ భూగర్భ శాస్త్రవేత్త,
iii. శ్రీమతి త్రిప్తి బాబా, సీనియర్ భూగర్భ శాస్త్రవేత్త,
iv. డాక్టర్ సందీప్ కుమార్, జియాలజిస్ట్
|
బృందానికి ఇచ్చే అవార్డు
బృందానికి ఇచ్చే అవార్డు
|
ఉప విభాగం (ii): ఆర్థిక లేదా వ్యూహాత్మక ప్రాముఖ్యత గల స్థాయిలో గనుల్లో బొగ్గు, లిగ్నైట్ , మీథేన్ ఆవిష్కరణ- ఆర్థిక.. వినూత్న సాంకేతికతలు... చమురు, సహజ వాయువు, షేల్ గ్యాస్, గ్యాస్ హైడ్రేట్ల ఆవిష్కరణ- అన్వేషణ (వనరులు అన్వేషణ, నిర్వహణకు దారితీసే ప్రాజెక్టుల ప్రణాళిక, అభివృద్ధితో సహా). (1 అవార్డు)
జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జీఎస్ఐ) బృందం-
i. శ్రీమతి శ్రద్ధాంజలి శుభదర్శిని, సూపరింటెండింగ్ భూగర్భ శాస్త్రవేత్త,
ii. శ్రీ సుప్రియా చక్రవర్తి, సీనియర్ భూగర్భ శాస్త్రవేత్త,
iii. శ్రీ జయదీప్ ముఖర్జీ, డైరెక్టర్.
|
బృందానికి ఇచ్చే అవార్డు
|
విభాగం II: మైనింగ్ టెక్నాలజీ, ఖనిజాల శుద్ధి - సుస్థిర ఖనిజాభివృద్ధి (2 అవార్డులు)
|
ఉప విభాగం (iii): కొత్త పద్ధతులు- సాంకేతికల వాడకం, పరిశోధన - అభివృద్ధి. ఖనిజ వనరుల పరిరక్షణ, గనులకు సంబంధించిన క్రమబద్ధమైన ప్రణాళిక, గనుల విషయంలో భద్రత, గనుల్లో మంటలు, గనుల్లో ప్రమాదాలు, గనుల పునరుద్ధరణ- పునరావాసంతో సహా గనులకు సంబంధించిన సాంకేతికత. (1 అవార్డు)
డాక్టర్ జై కృష్ణ పాండే, ప్రధాన శాస్త్రవేత్త, సీఎస్ఐఆర్-సెంట్రల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మైనింగ్ అండ్ ఫ్యూయల్ రీసెర్చ్, ధన్బాద్
|
వ్యక్తిగత
అవార్డు
|
ఉప విభాగం (iv): ఖనిజాల శుద్ధి (ఖనిజ శుద్ధి, తక్కువ నాణ్యత గల ఖనిజాలను వినియోగించుకోవటంతో పాటు విలువ ఆధారిత ఖనిజ ఉత్పత్తి కోసం ప్రాజెక్టులను అభివృద్ధి చేయటం, ఖనిజాలకు సంబంధించిన ఆర్థిక అంశాలు).. సుస్థిర జనిఖాభివవృద్ధి (గనుల మూసివేత, ప్రాజెక్టుల అభివృద్ధి, సంస్థాగత అభివృద్ధి, సామర్థ్యం నిర్మాణంతో సహా). (1 అవార్డు)
డా. రంజిత్ కుమార్ సింగ్, ప్రధాన శాస్త్రవేత్త, సీఎస్ఐఆర్-నేషనల్ మెటలర్జికల్ లాబొరేటరీ, జంషెడ్పూర్
|
వ్యక్తిగత అవార్డు
|
విభాగం III: మౌలిక భూవిజ్ఞాన శాస్త్రం (2 అవార్డులు)
|
ఉప విభాగం (v): స్తర శాస్త్రం(స్ట్రాటిగ్రఫీ), నిర్మాణాత్మక భూగర్భ శాస్త్రం, పురాతన జీవ శాస్త్రం(పాలియోంటాలజీ), భూగతి శాస్త్రం(జియోడైనమిక్స్), భూ రసాయన శాస్త్రం, భూ కాలమాన - ఐసోటోప్ భూగర్భ శాస్త్రం, సముద్రాభివృద్ధి (ఓషనోగ్రఫీ, మెరైన్ భూగర్భ శాస్త్రం), హిమ శాస్త్రం- ఆర్కిటిక్, అంటార్కిటిక్ పరిశోధనలతో సహా మౌలిక భూవిజ్ఞాన శాస్తం.. భూగర్భ, భూ రసాయన మ్యాపింగ్, సర్వే- సంస్థాగత థీమాటిక్ మ్యాపింగ్తో సహా శాస్త్ర విజ్ఞాన సర్వేలు లేదా మౌలిక భూవిజ్ఞాన శాస్త్ర సమాచార సేకరణ. (2 అవార్డులు)
1. డా. వేదుల వెంకట సుబ్రహ్మణ్య శ్రీనివాస శర్మ, ప్రధాన శాస్త్రవేత్త, సీఎస్ఐఆర్-నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ, విశాఖపట్నం ప్రాంతీయ కేంద్రం.
2. డా. మేకల రామ్ మోహన్, ప్రధాన శాస్త్రవేత్త, సీఎస్ఐఆర్-నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్, హైదరాబాద్
|
వ్యక్తిగత
అవార్డు
వ్యక్తిగత
అవార్డు
|
విభాగం IV: అనువర్తిత భూవిజ్ఞాన శాస్త్రం (3 అవార్డులు)
|
ఉప విభాగం (vi): అనువర్తిత భూవిజ్ఞాన శాస్త్రం: ఇంజనీరింగ్ భూవిజ్ఞాన శాస్త్రం, భూఉష్ణ శక్తి, భూకంప భౌగోళిక నిర్మాణం, భూ గణాంక శాస్త్రం, రిమోట్ సెన్సింగ్- భూ సమాచార వ్యవస్థ (ప్రాదేశిక డేటా నిర్వహణ అప్లికేషన్లు , డేటా ఇంటిగ్రేషన్తో సహా).. భూగర్భ జలాల అన్వేషణ (ప్రాజెక్ట్ అభివృద్ధి, హైడ్రోజియోలాజికల్ అధ్యయనాలు, భూగర్భజల వనరుల నిర్వహణతో సహా).. గనుల తవ్వకం- పట్టణ, పారిశ్రామిక, తీర, ఎడారి ప్రాంతాల నిర్వహణ.. పూర్వ వాతావరణ శాస్త్రం (పాలియోక్లైమేట్), పూర్వ పర్యావరణం (పాలియో ఎన్విరాన్మెంట్), వైద్యపరమైన భూగర్భ శాస్త్రం, వాతావరణ మార్పు, పర్యావరణ వ్యవస్థపై ప్రభావ అధ్యయనాలకు సంబంధించిన భౌగోళిక వాతరవర పరిశోధనలు (1 అవార్డు)
ప్రొఫెసర్ గులాం జీలానీ, ప్రొఫెసర్, భూవిజ్ఞాన శాస్త్ర విభాగం - డీన్, స్కూల్ ఆఫ్ ఎర్త్ - ఎన్విరాన్మెంటల్ సైన్సెస్, కాశ్మీర్ విశ్వవిద్యాలయం
|
వ్యక్తిగత
అవార్డు
|
ఉప విభాగం (vii): భూభౌతిక శాస్త్రం, అనువర్తిత భూభౌతిక శాస్త్రం: భూ భౌతిక అన్వేషణలో కొత్త సాంకేతికలు, భూ భౌతిక పద్ధతుల వినియోగం, భూ ఆయస్కాతత్వం, భూభౌతిక సర్వే పద్ధతులు, పరికరాల అభివృద్ధి. (1 అవార్డు)
ప్రొ. సంజిత్ కుమార్ పాల్, అధిపతి, అనువర్తిత భూభౌతిక శాస్త్ర విభాగం, ఐఐటీ (ఐఎస్ఎం), ధన్బాద్.
|
వ్యక్తిగత
అవార్డు
|
ఉప విభాగం (viii): భూకంపాలు, కొండచరియలు విరిగిపడటం, వరదలు- సునామీలు వంటి సహజ ప్రమాదాలకు సంబంధించిన శాస్త్రీయ అధ్యయనాలతో సహా సహజ విపత్తులకు సంబంధించిన పరిశోధన. (1 అవార్డు)
ప్రొఫెసర్ ముకత్ లాల్ శర్మ , భూకంప ఇంజనీరింగ్- అధిపతి, ఇంటర్నేషనల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ డ్యామ్స్, ఐఐటీ రూర్కీ.
|
వ్యక్తిగత
అవార్డు
|
జాతీయ యువ భూ శాస్త్రవేత్త అవార్డు 2024 (ఒక అవార్డు)
|
శ్రీ సుశోభన్ నియోగి, సీనియర్ భూగర్భ శాస్త్రవేత్త, జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా
|
***
(Release ID: 2171102)
|