రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌
azadi ka amrit mahotsav

మొరాకోలోని ప్రవాస భారతీయులతో ముచ్చటించిన రక్షణమంత్రి ఆపరేషన్ సింధూర్ సమయంలో దేశ సంయమనం, దృఢ సంకల్పంపై ప్రస్తావన

प्रविष्टि तिथि: 22 SEP 2025 12:03PM by PIB Hyderabad

మొరాకోలోని రాబాత్ లో సెప్టెంబర్ 21, 2025న ప్రవాస భారతీయులతో రక్షణమంత్రి శ్రీ రాజ్ నాథ్ సింగ్ సమావేశమయ్యారుఈ సందర్భంగా అక్కడి ప్రవాస భారతీయులుఆపరేషన్ సింధూర్ సమయంలో భారత ఆర్మీ తీసుకున్న నిర్ణయాత్మక చర్యలను ప్రశంసించిందిపహల్గామ్ లో అమాయక ప్రజలపై జరిగిన హింస తర్వాతసాయుధ దళాలు పూర్తి సన్నద్ధతతో ఉన్నాయనిప్రతిస్పందనకు పూర్తి స్వేచ్ఛను ఇచ్చినట్లు రక్షణమంత్రి తెలిపారు.

ఉద్రిక్తతలు పెంచకుండా భారత్ సంయమనంతో వ్యవహరించిందన్నారు. భారత్ నియంత్రణ వైఖరిని తెలిపేందుకు రామచరితమానస్ లోని ఒక సూక్తిని ఉదహరిస్తూ, "మేం ధర్మం చూసి కాదు, కర్మను అనుసరించి దాడి చేశాంఅని పేర్కొన్నారు.

ప్రవాస భారతీయులతో ముచ్చటిస్తూ... ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో గత పదేళ్లలో భారత్ సమగ్రాభివృద్ధిని సాధించినట్లు శ్రీ రాజ్ నాథ్ సింగ్ తెలిపారుప్రపంచభౌగోళిక రాజకీయ సవాళ్లున్నప్పటికీవేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా భారత్ ఎదిగిందనిప్రపంచ దేశాల్లో 11 నుంచి 4వ స్థానానికి చేరుకుందనిత్వరలో మూడో స్థానానికి చేరే అవకాశం ఉందన్నారుభారతదేశంలో డిజిటల్ మార్పులునైపుణ్య ఆధారిత ఆర్థిక వ్యవస్థలో పురోగతిగత దశాబ్దంలో 18గా ఉన్న యూనికార్న్ స్టార్టప్స్ ప్రస్తుతం 118కి పెరిగాయన్నారుదేశ రక్షణ రంగం గణనీయంగా వృద్ధి చెందిందనిరూ.1.5 లక్షల కోట్ల విలువైన వృద్ధిని సాధించిందనిరూ.23,000 కోట్లకు పైగా రక్షణ ఉత్పత్తులను 100కు పైగా దేశాలకు ఎగుమతి చేస్తుందని వెల్లడించారు.

శ్రమ, అంకితభావంనిజాయితీకి ప్రవాస భారతీయులు ప్రతీక అనినిజానికి భారతీయుల వ్యక్తిత్వం అలానే ఉంటుందని శ్రీ రాజ్ నాథ్ సింగ్ ప్రశంసించారుఅంతర్జాతీయ సర్వమత సమ్మేళనంలో స్వామి వివేకానంద మాటలను ఆయన గుర్తు చేసుకుంటూ... భారత సంస్కృతిలో ఒక వ్యక్తిని నిర్వచించేది వ్యక్తిత్వమేనన్నారుబలమైన ఆర్థిక పునాదులుపెరుగుతున్న సైనిక బలం కారణంగా ప్రపంచస్థాయిలో భారత్ ప్రతిష్ఠ పెరుగుతుందని ప్రవాస భారతీయులు భావిస్తున్నారు.

 

***


(रिलीज़ आईडी: 2169669) आगंतुक पटल : 20
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Gujarati , Tamil , Malayalam