ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

పుట్టినరోజు సందర్భంగా ప్రధానమంత్రికి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలిపిన రష్యా అధ్యక్షుడు పుతిన్


ఉక్రెయిన్‌తో సంక్షోభానికి శాంతియుత పరిష్కారంలో

భారత్ సంపూర్ణ మద్దతును పునరుద్ఘాటించిన ప్రధానమంత్రి

ఈ ఏడాది చివర్లో అధ్యక్షుడు పుతిన్‌ను భారత్‌కు

స్వాగతించడానికి ఎదురు చూస్తున్నానన్న ప్రధానమంత్రి

నాడు పోస్టు చేయడమైనది: 17 SEP 2025 7:20PM by PIB Hyderabad

రష్యన్ ఫెడరేషన్ అధ్యక్షుడు శ్రీ వ్లాదిమిర్ పుతిన్ ఈ రోజు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీకి ఫోన్ చేసి మాట్లాడారు.

75వ పుట్టినరోజు సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీకి రష్యా అధ్యక్షుడు పుతిన్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారుఆయన శుభాకాంక్షలకీశాశ్వత స్నేహానికీ ప్రధానమంత్రి కృతజ్ఞతలు తెలిపారు.

23వ భారత్-రష్యా వార్షిక శిఖరాగ్ర సమావేశానికి ముందు ద్వైపాక్షిక ఎజెండాలోని వివిధ అంశాలను ఇరువురు నాయకులు సమీక్షించారుఈ ఏడాది చివర్లో అధ్యక్షులు పుతిన్‌ను భారత్‌కు స్వాగతించడానికి తాను ఎదురుచూస్తున్నానని ప్రధానమంత్రి తెలియజేశారు.

ఉక్రెయిన్‌తో ఘర్షణలకు శాంతియుత పరిష్కారాన్ని సాధించే విషయంలో భారత్ సంపూర్ణ మద్దతును అందిస్తుందని ప్రధానమంత్రి పునరుద్ఘాటించారు.

సంప్రదింపులను కొనసాగించేందుకు ఇరువురు నేతలు అంగీకరించారు.

 

***


(రిలీజ్ ఐడి: 2167862) సందర్శకుల సూచీ సంఖ్య : : 16