ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

రైతులు దేశానికి వెన్నెముక: స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా మోదీ ప్రశంస

Posted On: 15 AUG 2025 12:02PM by PIB Hyderabad

79వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దేశ రైతులకు ప్రశంసలు అందించారుపరాధీనత నుంచి స్వావలంబన దిశగా జరిగిన జాతి ప్రయాణంలో వారు వెన్నెముకగా నిలిచారన్నారువలస పాలన దేశాన్ని పేదరికంలో ముంచిందనీఅయితేరైతుల అవిశ్రాంత కృషి వల్లే భారత ధాన్యాగారాలు నిండిదేశం పూర్తి స్వతంత్రతను సాధించిందన్నారురైతుల పట్ల కృతజ్ఞతా భావంభారత వ్యవసాయం భవిష్యత్తు దార్శనికత ఆయన ప్రసంగంలో ప్రధానంగా చోటు చేసుకున్నాయి.

రైతులు భారత ప్రగతికి వెన్నెముక

దేశ ఆర్థిక వ్యవస్థలో వృద్ధి రైతులుపశు పోషకులుమత్స్యకారులకు నేరుగా ప్రయోజనం చేకూరుస్తోందని ప్రధానమంత్రి మోదీ అన్నారువివిధ రంగాల్లో భారత్ స్థానం నేడు ఇలా ఉంది:

  • పాలుపప్పుధాన్యాలుజనపనార ఉత్పత్తిలో ప్రపంచంలో మొదటి స్థానం.

  • బియ్యం, గోధుమలుపత్తిపండ్లుకూరగాయల్లో రెండో స్థానం.

వ్యవసాయ ఎగుమతులు ఇప్పుడు రూ. 4 లక్షల కోట్లు దాటాయిప్రాంతీయంగా అంతరాలను మరింత తగ్గించడం కోసం ప్రధానమంత్రి ధన ధాన్య కృషి యోజనను ప్రభుత్వం ప్రకటించింది. 100 అత్యంత వెనుకబడిన వ్యవసాయ జిల్లాల అభివృద్ధి దీని లక్ష్యం.

రైతులుమత్స్యకారులుపశు పోషకులకు మోడీ ఎప్పుడూ రక్షణ కవచంగా ఉంటాను” అంటూ తన నిబద్ధతను పునరుద్ఘాటించారు.

సింధు జలాల ఒప్పందం దేశ ప్రయోజనాలే ప్రధానం

సింధూ జలాల ఒప్పందం న్యాయబద్ధంగా లేదన్న శ్రీ మోదీ.. ఇప్పుడున్న ఒప్పందం భారత రైతులకు కీడు చేసిందన్నారుభారత్ ఇకపై ఈ తరహా ఏకపక్ష ఒప్పందాన్ని అంగీకరించబోదనిసొంత వ్యవసాయ క్షేత్రాలుప్రజల కోసం తనకు హక్కుగా ఉన్న నీటి వాటాను తిరిగి పొందుతుందని ఆయన ప్రకటించారు.

వ్యవసాయ స్వావలంబన – ఎరువులు, ఉత్పాదకాలు

ఆహార భద్రత కోసం దిగుమతులపై ఆధారపడకూడదని ప్రధానమంత్రి మోదీ స్పష్టం చేశారుభారత రైతులు సాధికారత సాధించేలాదేశంలో వ్యవసాయం స్వతంత్ర అభివృద్ధికి భరోసానిస్తూ... ఎరువులుకీలక ఉత్పాదకాలను దేశీయంగా ఉత్పత్తి చేయాల్సిన అవసరం ఉందన్నారుఇది రైతుల సంక్షేమానికే కాకుండా దేశ ఆర్థిక సార్వభౌమత్వాన్ని బలోపేతం చేయడానికి కూడా కీలకమని ఆయన అన్నారు.

మన పథకాలతో... మరింత నమ్మకంతో రైతులు:

చిన్న రైతులుపశు పెంపకందారులు లేదా మత్స్యకారులు.. వివిధ అభివృద్ధి పథకాల ద్వారా అందరూ ప్రయోజనం పొందుతున్నారన్నారురైతు శక్తియుక్తులను ప్రధానమంత్రి శ్రీ మోదీ ప్రశంసించారు.

ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి, వర్షపు నీటి సంరక్షణనీటిపారుదల ప్రాజెక్టులునాణ్యమైన విత్తనాల పంపిణీసకాలంలో ఎరువుల సరఫరా వంటి కార్యక్రమాలు దేశవ్యాప్తంగా రైతుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచాయి.

రైతులకు రక్షణ కవచం

భారత్‌లోని రైతులుపశు పోషకులుమత్స్యకారులకు కీడు చేసే ఏ విధానాలకు మోదీ అడ్డుగోడలా నిలుస్తాడుభారత్ రైతు ప్రయోజనాల విషయంలో రాజీపడదు” అంటూ శ్రీ నరేంద్ర మోదీ చేసిన ప్రతిజ్ఞ దేశవ్యాప్తంగా ప్రతిధ్వనించిందిఈ అంశానికి సంబంధించిన ప్రసంగాన్ని ఆయన ఇక్కడితో ముగించారు.

 

***


(Release ID: 2156798)