ప్రధాన మంత్రి కార్యాలయం
మహారాష్ట్రలోని పుణేలో జరిగిన ప్రమాదంలో మృతులకు ప్రధానమంత్రి సంతాపం
ప్రధానమంత్రి సహాయ నిధి నుంచి నష్టపరిహారం
Posted On:
11 AUG 2025 4:35PM by PIB Hyderabad
మహారాష్ట్రలోని పుణేలో జరిగిన ప్రమాదంలో ప్రాణ నష్టం పట్ల ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని శ్రీ మోదీ ఆకాంక్షించారు.
మరణించిన వారి కుటుంబానికి ప్రధానమంత్రి సహాయ నిధి నుంచి రూ. 2 లక్షలు చొప్పున, గాయపడిన వారికి రూ. 50,000 చొప్పున నష్టపరిహారాన్ని ప్రధాని ప్రకటించారు.
సామాజిక మాధ్యమం ఎక్స్లో ప్రధానమంత్రి కార్యాలయం ఇలా పేర్కొంది:
‘‘మహారాష్ట్రలోని పుణేలో జరిగిన ప్రమాదంలో జరిగిన ప్రాణ నష్టం దిగ్భ్రాంతి కలిగించింది. ఈ ఘటనలో తమ కుటుంబ సభ్యులను కోల్పోయిన వారికి నా సానుభూతి తెలియజేస్తున్నాను. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను.
పీఎంఎన్ఆర్ఎఫ్ నుంచి మరణించిన వారి కుటుంబ సభ్యులకు రూ. 2 లక్షల చొప్పున, గాయపడిన వారికి రూ.50,000 చొప్పున నష్టపరిహారం అందుతుంది: పీఎం: @narendramodi”
***
(Release ID: 2155108)
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam