ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఉత్తరప్రదేశ్‌లోని గోండాలో జరిగిన ప్రమాదంలో ప్రాణనష్టం సంభవించటం పట్ల విచారం వ్యక్తం చేసిన ప్రధాని


పీఎంఎన్‌ఆర్‌ఎఫ్ కింద పరిహారం ప్రకటించిన ప్రధాని

Posted On: 03 AUG 2025 1:36PM by PIB Hyderabad

ఉత్తరప్రదేశ్‌లోని గోండాలో జరిగిన ప్రమాదంలో ప్రాణనష్టం పట్ల ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ విచారం వ్యక్తం చేశారు. పీఎంఎన్‌ఆర్‌ఎఫ్ కింద మృతులకు రూ. 2 లక్షలు, గాయపడిన వారికి రూ. 50,000 చొప్పున పరిహారం ఇవ్వనున్నట్లు ప్రకటించారు. 

సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధానమంత్రి కార్యాలయం ఈ విధంగా వ్యాఖ్యానించింది:

“ఉత్తరప్రదేశ్‌లోని గోండాలో జరిగిన ప్రమాదంలో ప్రాణనష్టం సంభవించటం చాలా బాధాకరం. ఈ ప్రమాదంలో తమ వాళ్లను కోల్పోయిన వారికి సానుభూతి తెలియజేస్తున్నాను. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నాను.

పీఎంఎన్‍ఆర్‌ఎఫ్ నుంచి మరణించిన వారికి రూ. 2 లక్షలు, గాయపడిన వారికి రూ. రూ. 50,000 చొప్పున పరిహారం అందిస్తాం.

- నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి”

 

 

***

MJPS/SR


(Release ID: 2151960)