ప్రధాన మంత్రి కార్యాలయం
విద్యుత్ వాహన వ్యవస్థ, పర్యావరణ హిత సాంకేతికత, తయారీలో స్వావలంబన దిశగా ప్రత్యేక శ్రద్ధతో పారిశ్రామిక రంగాన్ని భారత్ తీర్చిదిద్దుతున్న తీరును తెలిపే కథనాన్ని ప్రజలతో పంచుకున్న ప్రధాని
Posted On:
02 AUG 2025 2:05PM by PIB Hyderabad
విద్యుత్తు వాహన వ్యవస్థ, పర్యావరణ హిత సాంకేతికత, తయారీలో స్వావలంబన దిశగా ప్రత్యేకంగా దృష్టి సారిస్తూ పారిశ్రామిక రంగాన్ని భారత్ తీర్చిదిద్దుతున్న తీరును వివరించే కథనాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు ప్రజలతో పంచుకున్నారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో కేంద్ర మంత్రి శ్రీ హెచ్.డి. కుమారస్వామి చేసిన ఓ పోస్టుపై స్పందిస్తూ ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు:
“విద్యుత్ ఆధారిత రవాణా వ్యవస్థ, పర్యావరణ అనుకూల సాంకేతికత, తయారీలో స్వావలంబనపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తూ.. పారిశ్రామిక రంగాన్ని భారత్ తీర్చిదిద్దుకుంటున్న విధానాన్ని కేంద్ర మంత్రి శ్రీ @hd_kumaraswamy వివరించారు. నిర్దేశిత పథకాలు, ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యాలు ఈ పురోగతిని ముందుకు తీసుకెళ్తున్నాయి.”
***
(Release ID: 2151770)
Read this release in:
Odia
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam