ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఢాకా విమాన ప్రమాద విషాదంలో ప్రాణనష్టంపై ప్రధాని సంతాపం

प्रविष्टि तिथि: 21 JUL 2025 7:07PM by PIB Hyderabad

ఢాకా విమాన ప్రమాదంలో జరిగిన ప్రాణ నష్టంపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపం తెలిపారుఈ విషాదంలో మృత్యువాత పడిన వారిలో యువ విద్యార్థులు ఎక్కువగా ఉన్నారుబంగ్లాదేశ్‌కు భారత్ సంఘీభావంగా నిలుస్తుందనిసాధ్యమైన మేరకు అన్ని విధాలుగా సహాయ సహహకారాలు అందించేందుకు సిద్ధంగా ఉందని ఆయన హామీ ఇచ్చారు.

సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో శ్రీ మోదీ ఇలా పేర్కొన్నారు:

ఢాకాలో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో అనేక మంది ప్రాణాలు కోల్పోవడం దిగ్ర్భాంతిని కలిగించిందిమనసును కలచివేసిన దుర్ఘటనచనిపోయిన వారిలో యువ విద్యార్థులే ఎక్కువగా ఉండడం విషాదకరందుఃఖంలో ఉన్న కుటుంబాలకు నా సానుభూతిని వ్యక్తం చేస్తున్నానుగాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాంబంగ్లాదేశ్‌కు భారత్... సంఘీభావం ప్రకటిస్తోందిఅన్నివిధాలుగా సహాయ సహకారాలను అందించేందుకు భారత్ సిద్ధంగా ఉంది.

 

***


(रिलीज़ आईडी: 2146637) आगंतुक पटल : 8
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Assamese , Bengali , Manipuri , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam