గనుల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

కార్యక్షేత్రాల నుంచి వారసత్వ స్థలాల వరకు అంతటా ఆరోగ్య సంరక్షణ:


2025 అంతర్జాతీయ యోగా దినోత్సవం కోసం 50 దేశవ్యాప్త కార్యక్రమాలతో జియలాజికల్ సర్వే సంస్థ సన్నద్ధం

Posted On: 19 JUN 2025 2:22PM by PIB Hyderabad

గనుల మంత్రిత్వశాఖలోని జియలాజికల్ సర్వే సంస్థ (జీఎస్ఐజూన్ 21న జరిగే 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం (ఐడీవై)లో పాల్గొనేందుకు సన్నద్ధమవుతోంది. ‘ఒకే ధరణిఒకే ఆరోగ్యం కోసం యోగా’ అన్న ఈ యేటి ఇతివృత్తానికి అనువైన 50 కార్యక్రమాలను దేశంలోని 46 ప్రాంతాల్లో నిర్వహించాలని... తద్వారా సిబ్బందిసాధారణ ప్రజల్లో సమగ్ర ఆరోగ్యంఆరోగ్యకర జీవనశైలి పట్ల అవగాహన పెంచాలని జీఎస్ఐ భావిస్తోంది.

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆశయానికి అనుగుణంగా వివిధ ప్రాంతాల్లో శిక్షణ పొందిన వారి నేతృత్వంలో జీఎస్ఐ కార్యక్రమాలను నిర్వహిస్తుందికోల్ కతా లోని కేంద్రీయ కార్యాలయంప్రాంతీయరాష్ట్ర కార్యాలయాలు, 12 వారసత్వ ప్రదేశాలు, 6 డ్రిల్లింగ్ కార్యక్షేత్రాలు, 3 శిక్షణ కేంద్రాల్లో ఈ యోగా సెషన్లు ఏర్పాటవుతున్నాయిజీఎస్ఐ సిబ్బందిపాఠశాల విద్యార్థులుస్థానికులు సహా సుమారు 3,000 మంది ఈ కార్యక్రమంలో పాల్గొనగలరని భావిస్తున్నారు.

జూన్ 20న కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి శ్రీ జీకిషన్ రెడ్డి నేతృత్వంలో హైదరాబాద్ వేదికగా ఏర్పాటైన ప్రత్యక్ష కౌంట్ డౌన్ ఈవెంట్ లో కూడా జీఎస్ఐ పాల్గొంటుంది.  

సాధారణ ప్రజలువైజ్ఞానిక సమాజాల్లో యోగ విజ్ఞానంసూత్రాల పట్ల అవగాహన పెంపుయోగాభ్యాసాల ఆచరణకు ప్రోత్సాహం కల్పించాలన్న లక్ష్యంతో జీఎస్ఐ ప్రత్యేక కార్యక్రమాలని రూపొందించింది – తద్వారా ప్రజారోగ్యంసంక్షేమం పట్ల నిబద్ధతను పునరుద్ఘాటిస్తోంది.

 

****


(Release ID: 2137720)