ప్రధాన మంత్రి కార్యాలయం
ఇజ్రాయెల్ ప్రధానితో తాజా పరిస్థితిపై చర్చించిన పీఎం
Posted On:
13 JUN 2025 7:42PM by PIB Hyderabad
ఇజ్రాయెల్ ప్రధానమంత్రి గౌరవ బెంజమిన్ నెతన్యాహూతో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల గురించి ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ చర్చించారు.
ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల గురించి ప్రధానమంత్రి నెతన్యాహూ శ్రీ మోదీకి వివరించారు. అదేవిధంగా ఈ అంశంలో భారత్ ఆందోళనలను ప్రధాని మోదీ తెలియజేశారు. ఈ ప్రాంతంలో త్వరగా శాంతి సుస్థిరతలను పునరుద్ధరించాల్సిన అవసరాన్ని శ్రీ మోదీ స్పష్టం చేశారు. ప్రపంచ శాంతి ప్రయత్నాల పట్ల భారత్ అంకితభావాన్ని పునరుద్ఘాటించారు.
ఎక్స్లో ప్రధాని పోస్టు:
‘‘ఇజ్రాయెల్ పీఎం @netanyahu నుంచి నాకు ఫోన్ వచ్చింది. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల గురించి ఆయన నాకు వివరించారు. ఈ అంశంలో భారత్ ఆందోళనలను, ఈ ప్రాంతంలో శాంతి సుస్థిరత్వాలను పునరుద్ధరించాల్సిన అవసరాన్ని నేను పంచుకున్నాను.’’
***
(Release ID: 2136287)
Read this release in:
Assamese
,
Odia
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam