ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఇజ్రాయెల్ ప్రధానితో తాజా పరిస్థితిపై చర్చించిన పీఎం

Posted On: 13 JUN 2025 7:42PM by PIB Hyderabad

ఇజ్రాయెల్ ప్రధానమంత్రి గౌరవ బెంజమిన్ నెతన్యాహూతో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల గురించి ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ చర్చించారు.

ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల గురించి ప్రధానమంత్రి నెతన్యాహూ శ్రీ మోదీకి వివరించారుఅదేవిధంగా ఈ అంశంలో భారత్ ఆందోళనలను ప్రధాని మోదీ తెలియజేశారుఈ ప్రాంతంలో త్వరగా శాంతి సుస్థిరతలను పునరుద్ధరించాల్సిన అవసరాన్ని శ్రీ మోదీ స్పష్టం చేశారుప్రపంచ శాంతి ప్రయత్నాల పట్ల భారత్ అంకితభావాన్ని పునరుద్ఘాటించారు.

ఎక్స్‌లో ప్రధాని పోస్టు:

‘‘ఇజ్రాయెల్ పీఎం @netanyahu నుంచి నాకు ఫోన్ వచ్చిందిప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల గురించి ఆయన నాకు వివరించారుఈ అంశంలో భారత్ ఆందోళనలనుఈ ప్రాంతంలో శాంతి సుస్థిరత్వాలను పునరుద్ధరించాల్సిన అవసరాన్ని నేను పంచుకున్నాను.’’

 

***


(Release ID: 2136287)