రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌
azadi ka amrit mahotsav

ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన ఎన్‌సీసీ బృందానికి రక్షణ మంత్రి అభినందనలు: ఈ బృందంలో అయిదుగురు అమ్మాయిలు, అయిదుగురు అబ్బాయిలు


ఈ సాహసానికి ప్రశంసగా రూ. 10 లక్షల చెక్ బహుమతి

Posted On: 12 JUN 2025 1:29PM by PIB Hyderabad

నేషనల్ క్యాడెట్ కోర్ (ఎన్‌సీసీపర్వతారోహణ బృందాన్ని రక్షణ మంత్రి శ్రీ రాజ్‌నాథ్ సింగ్ ఈ రోజు (2025, జూన్ 12) సత్కరించారుఈ బృందంలో అయిదుగురు అమ్మాయిలుఅయిదుగురు అబ్బాయిలు ఉన్నారువారి సరాసరి వయసు 19 ఏళ్లువీరంతా ఎవరెస్ట్ శిఖరాన్ని 2025 మే 18న అధిరోహించారుకల్నల్ అమిత్ బిష్త్ నాయకత్వంలోని ఈ బృందం ప్రదర్శించిన ధైర్యంసాహసందేశభక్తిని రక్షణ మంత్రి ప్రశంసించారుకఠినమైన వాతావరణ పరిస్థితుల్లోనూ ఎలాంటి గాయాలకు గురవకుండా ఈ సాహసాన్ని పూర్తి చేసుకున్న ఈ బృందానికి రూ. 10 లక్షల చెక్కు బహుకరించారు.

న్యూఢిల్లీలోని సౌత్ బ్లాక్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో అధిరోహణకు సంబంధించిన అనుభవాలనుకఠినమైన శిక్షణపటిష్ఠమైన ప్రణాళికఎదుర్కొన్న సవాళ్లను క్యాడెట్లు వివరించారుధైర్యంక్రమశిక్షణనిలకడసంకల్పంతో ఈ విజయం సాధించిన బృందాన్ని రక్షణ మంత్రి అభినందించారు.

ఈ క్యాడెట్లు యువతరానికి స్ఫూర్తిగా నిలుస్తున్నారనిప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన శిఖరాన్ని అధిరోహించడం ద్వారా ఈ దేశ యువత సామర్థ్యాన్ని సాహస క్యాడెట్లు నిరూపించారని శ్రీ రాజ్‌నాథ్ సింగ్ పేర్కొన్నారుఎవరెస్టును అధిరోహించినప్పుడు వారు ప్రదర్శించిన ధైర్యంసంకల్పంతో భవిష్యత్తులో ఎదురయ్యే ఇబ్బందులను అధిగమిస్తారనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.

క్యాడెట్లలో జాతీయ భావాన్ని నింపడంవారిని శారీరకంగామానసికంగాభావోద్వేగపరంగా సన్నద్ధం చేయడంసామాజిక నైపుణ్యాలను పెంపొందించడంలో ఎన్‌సీసీ చేపడుతున్న ప్రయత్నాలను రక్షణ మంత్రి మెచ్చుకున్నారుఈ విజయాన్ని సాధించడంలో క్యాడెట్లకు అండగా నిలిచిన వారి కుటుంబ సభ్యులను సైతం ప్రశంసించారుఎన్‌సీసీ డీజీ లెఫ్టినెంట్ జనరల్ గుర్‌బీర్ పాల్ సింగ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఎవరెస్టును ఎన్‌సీసీ అధిరోహించడం ఇది మూడోసారిగతంలో 2013, 2016లో ఈ పర్వతాన్ని ఎన్‌సీసీ అధిరోహించిందిఈ పర్వాతారోహణ బృందంలో 10 మంది క్యాడెట్లుఅధికారులుజూనియర్ కమిషన్డ్ అధికారులుశిక్షకులునాన్ కమిషన్డ్ అధికారులు ఉన్నారుభారత సైన్యానికి చెందిన సుబేదార్ మేజర్ బల్కర్ సింగ్ కూడా ఈ బృందంలో సభ్యునిగా ఉన్నారుఆయన సైన్యంలో ఎవరెస్టును అధిరోహించిన మొట్టమొదటి సుబేదార్ మేజర్‌గా నిలిచారు. 16 ఏళ్లున్న క్యాడెట్ ఈ బృందంలో అతి పిన్న వయస్కుడు.

2025, ఏప్రిల్ 3న రక్షణ మంత్రి ఈ అధిరోహణను అధికారికంగా ప్రారంభించారుఈ పర్వతారోహణ సమయంలో ప్రతి దశలోనూ సభ్యులు క్షేమంగా ఉండేందుకు భద్రతా నియమాలుమార్గదర్శకాలకు లోబడి కార్యక్రమాన్ని పూర్తి చేశారు.

 

***


(Release ID: 2136055)