ప్రధాన మంత్రి కార్యాలయం
చినాబ్ రైలు వంతెన నిర్మాణంలో పాలుపంచుకున్న వారితో ప్రధానమంత్రి సంభాషణ
• దేశం కోసం ఆధునిక మౌలిక సదుపాయాలను అందించడంలో తిరుగులేని నిబద్ధతకు ప్రశంసలు
Posted On:
06 JUN 2025 3:01PM by PIB Hyderabad
చినాబ్ రైలు వంతెన నిర్మాణంలో పాలుపంచుకున్న వారిలో కొందరితో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు భేటీ అయ్యారు. దేశ ప్రజలకు ఆధునిక మౌలిక సదుపాయాలను నిర్మించడంలో తిరుగులేని నిబద్ధతను కనబరిచారంటూ వారిపై శ్రీ మోదీ ప్రశంసలు కురిపించారు.
ప్రధానమంత్రి ఎక్స్లో ఒక సందేశాన్ని ఇలా పోస్టు చేశారు:
‘‘చినాబ్ రైలు వంతెన నిర్మాణంలో పాలుపంచుకున్న వారిలో కొందరిని ఈ రోజు కలుసుకొని, వారితో మాట్లాడాను. వారు భారత్లో వివిధ ప్రాంతాలకు చెందినవారు. తోటి భారతీయుల కోసం ఆధునిక మౌలిక సదుపాయాలను సమకూర్చడంతో తిరుగులేని తమ సంకల్ప బలాన్ని వారు చాటారు. తమకు ఎదురైన అనుభూతులను వివరించారు.. ఎన్నో సవాళ్లను కూడా వారు ఎదుర్కొన్నారు. పూర్తి చేసిన పనిని చూసి కుటుంబసభ్యులు ఎంతగా గర్వపడుతున్నదీ వారు నాతో పంచుకున్నారు.’’
***
(Release ID: 2134713)
Visitor Counter : 2
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam