ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

జమ్మూ కాశ్మీర్‌లో జూన్ 6న ప్రధానమంత్రి పర్యటన


• అతి ఎత్తయిన రైల్వే ఆర్చ్ వంతెన... ‘చినాబ్’ని ప్రారంభించనున్న ప్రధాని

• భారత్‌లో మొదటి కేబుల్ ఆధారిత రైల్ వంతెన ‘అంజీ’ని కూడా ప్రారంభించనున్న ప్రధానమంత్రి

• రూ.46,000 కోట్లకు పైగా ఖర్చయ్యే అనేక అభివృద్ధి ప్రాజెక్టులకు కట్‌రా‌లో శంకుస్థాపన, ప్రారంభోత్సవాలతోపాటు కొన్నింటిని జాతికి అంకితమివ్వనున్న ప్రధాని‌

Posted On: 04 JUN 2025 12:37PM by PIB Hyderabad

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుక్రవారం (జూన్ 6జమ్మూ కాశ్మీర్‌లో పర్యటించనున్నారుఆ ప్రాంతంలో రైల్వే మౌలిక సదుపాయాల కల్పనతో పాటు సంధానానికి పెద్ద పీట వేయాలన్న తన నిబద్ధతకు అనుగుణంగాప్రధాని చినాబ్ వంతెనను ఉదయం 11 గంటలకు ప్రారంభించడమే కాకుండా వంతెనను చూడబోతున్నారుఆ తరువాతఆయన అంజీ బ్రిడ్జిని సందర్శించడంతో పాటు ఆ వంతెనను కూడా ప్రారంభిస్తారుమధ్యాహ్నం సుమారు 12 గంటలకు ఆయన వందే భారత్ రైళ్లను ప్రారంభిస్తారుఅనంతరంరూ. 46,000 కోట్లకు పైగా ఖర్చయ్యే అనేక అభివృద్ధి ప్రాజెక్టులకు కట్‌రాలో ఆయన శంకుస్థాపనప్రారంభోత్సవం చేయడంతో పాటు వాటిని జాతికి అంకితమిస్తారు.

చినాబ్అంజీ రైలు వంతెనలు

చినాబ్ రైలు వంతెన నిర్మాణ కళా కౌశలం పరంగా ఒక అద్భుతంనది నుంచి 359 మీటర్ల ఎగువన ఈ వంతెన ఉందిప్రపంచంలో అన్నింటి కంటే ఎత్తయిన రైల్వే ఆర్చి వంతెన ఇదే. 1,315 మీటర్ల పొడవుతో ఉన్న విల్లు ఆకారంలోని ఉండే ఉక్కు వంతెనభూకంపాలనుగాలులను తట్టుకుని నిలిచేలా తీర్చి దిద్దారుజమ్మూ శ్రీనగర్‌ నడుమ అనుసంధానాన్ని పెంచడం కూడా ఈ వంతెన ముఖ్య ఉద్దేశంఈ వంతెన మీది నుంచి రాక పోకలు జరిపే వందే భారత్ రైలుకు కట్‌రాశ్రీనగర్‌ల మధ్య ప్రయాణించడానికి కేవలం గంటలు పడుతుందిదీనితో ప్రస్తుత ప్రయాణ సమయం 2-3 గంటలు తగ్గనుంది.

అంజీ బ్రిడ్జి భారత్‌లో మొట్టమొదటి కేబుల్-ఆధారిత రైల్ బ్రిడ్జిఇది సవాళ్లను విసిరే భూభాగంలో దేశ ప్రజలకు తన సేవలను అందించనుంది.

సంధాన ప్రాజెక్టులుఇతర అభివృద్ధి కార్యక్రమాలు

ఉధంపుర్-శ్రీనగర్-బారాముల్లా రైల్ లింక్ (యూఎస్‌బీఆర్ఎల్ప్రాజెక్టును కూడా ప్రధాని జాతికి అంకితం చేయనున్నారుఈ ప్రాజెక్టు పొడవు 272 కి.మీదీనిని 119 కి.మీమేర విస్తరించిన 36 సొరంగాలతోను, 943 వంతెనలతోను నిర్మించారుఈ ప్రాజెక్టు కాశ్మీర్ లోయకుదేశంలో ఇతర ప్రాంతాలకు నడుమ విస్తృతమైననిరంతరాయమైన రైలు సంధానాన్ని ఏర్పరుస్తుందిప్రాంతీయ రాకపోకల రూపురేఖలను మార్చడంతో పాటుగా సామాజికఆర్థిక ఏకీకరణకు ప్రోత్సాహాన్ని అందించడం ఈ ప్రాజెక్టు ఉద్దేశం.

శ్రీ మాతా వైష్ణో దేవి కట్‌రా నుంచి శ్రీనగర్‌కు వెళ్లితిరిగి శ్రీ మాతా వైష్ణో దేవి కట్‌రా కు వచ్చే వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు రెండింటిని కూడా ప్రధాని ప్రారంభించనున్నారుఈ రైళ్లు స్థానికులుపర్యాటకులుతీర్థయాత్రికులతో పాటు ఇతరులకు వేగవంతమైనఉల్లాసాన్నీ కలిగించే నమ్మకమైన ప్రయాణ సౌకర్యాన్ని అందించనున్నాయి.

ఆఖరు స్టేషన్ వరకు సంధానాన్ని ప్రత్యేకించి సరిహద్దు ప్రాంతాల్లో సంధాన సదుపాయాలకు ఒక ప్రధాన ఊతాన్నివ్వడంలో భాగంగాప్రధానమంత్రి వివిధ రహదారి పథకాలకు శంకుస్థాపన చేయడంతో పాటుగా ఆ పథకాలను ప్రారంభించనున్నారువీటిలో రూ.1,952 కోట్లకు పైగా ఖర్చుతో చేపట్టే జాతీయ రహదారి-701లో రాఫియాబాద్ నుంచి కుప్‌వాడా వరకు రోడ్డు విస్తరణ ప్రాజెక్టుకూజాతీయ రహదారి-444లో శోపియా బైపాస్ రోడ్డు నిర్మాణానికీ ఆయన శంకుస్థాపన చేస్తారుజాతీయ రహదారి-44లో రెండు ఫ్లయ్‌ఓవర్ ప్రాజెక్టులను కూడా ఆయన ప్రారంభిస్తారువీటిని శ్రీనగర్‌లో గల జాతీయ రహదారి-1లోని సంగ్రామ జంక్షన్‌లోనూజాతీయ రహదారి-44లో బెమినా జంక్షన్‌లోనూ నిర్మించారుఈ ప్రాజెక్టులు వాహనాల రాకపోకల రద్దీని తగ్గించడమే కాక నిత్యం ప్రయాణికుల రాకపోకలు సాఫీగా సాగించడంలో తోడ్పడనున్నాయి.

రూ.350 కోట్లకు పైగా ఖర్చుతో కట్‌రాలో నిర్మించబోయే శ్రీ మాతా వైష్ణో దేవి మీడియా ఎక్స్‌లెన్స్ ఇనిస్టిట్యూట్‌కు కూడా ప్రధాని శంకుస్థాపన చేయనున్నారుఇది రియాసీ జిల్లాలో ఏర్పాటు చేస్తున్న మొట్టమొదటి వైద్య కళాశాలదీనిద్వారా ఆరోగ్య సంరక్షణ సంబంధిత మౌలిక సదుపాయాల వ్యవస్థను చెప్పుకోదగిన స్థాయిలో మెరుగుపరచనుంది.‌

 

***


(Release ID: 2133997)