ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

పశ్చిమ బెంగాల్‌లోని అలీపుర్‌దువార్‌లో నగర గ్యాస్ సరఫరా ప్రాజెక్టు శంకుస్థాపన సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

Posted On: 29 MAY 2025 2:51PM by PIB Hyderabad

కేంద్ర మంత్రివర్గ సహచరులు సుకాంతో మజుందార్ గారుపశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ప్రతిపక్ష నాయకులు సువేందు అధికారి గారుఅలీపుర్‌దువార్ ఎంపీసోదరులు మనోజ్ టిగ్గా గారుఇతర ఎంపీలుఎమ్మెల్యేలుబెంగాల్‌లోని నా సోదర సోదరీమణులారా!

ఈ చారిత్రాత్మక అలీపుర్‌దువార్ గడ్డ నుంచి బెంగాల్ ప్రజలందరికీ నా శుభాకాంక్షలు తెలుపుతున్నాను!

ఈ అలీపుర్‌దువార్ సరిహద్దులతోనే కాకుండా గొప్ప సంస్కృతులతో కూడా అనుసంధానమై ఉందిఒక వైపు భూటాన్ సరిహద్దుమరోవైపు అస్సాం అభివాదంఒక వైపు జల్పైగురి సౌందర్యంమరోవైపు కూచ్ బెహార్ గర్వంఇలాంటి పుణ్యభూమిలో మీ అందరినీ కలిసే అదృష్టం ఈ రోజు నాకు లభించింది.

మిత్రులారా,

నేడుభారత్ అభివృద్ధి చెందిన దేశంగా మారే దిశగా పయనిస్తున్న తరుణంలోబెంగాల్ భాగస్వామ్యం ఆశించదగినదిఅత్యంత ముఖ్యమైనదిఈ కారణంగానేకేంద్ర ప్రభుత్వం ఇక్కడ మౌలిక సదుపాయాలుఆవిష్కరణలుపెట్టుబడులకు నిరంతరం కొత్త ఊపునిస్తోందిబెంగాల్ అభివృద్ధి దేశ భవిష్యత్తుకు పునాదిఆ పునాదికి మరో బలమైన ఇటుకను జోడించాల్సిన రోజు ఇదికొద్దిసేపటి క్రితంమేం ఈ వేదిక నుంచి అలీపుర్‌దువార్కూచ్ బీహార్‌లలో నగర గ్యాస్ సరఫరా ప్రాజెక్ట్‌ను ప్రారంభించాంఈ ప్రాజెక్ట్ ద్వారా 2.5 లక్షలకు పైగా గృహాలకు పైప్‌లైన్ ద్వారా శుభ్రమైనసురక్షితమైన వంటగ్యాస్ చౌకగా సరఫరా జరుగుతుందిఇది వంటగది కోసం సిలిండర్ కొనాలనే ఆందోళనను తొలగించడమే కాకుండాకుటుంబాలకు సురక్షితమైన గ్యాస్ సరఫరాను అందిస్తుందిదీంతో పాటుసీఎన్‌జీ స్టేషన్ల నిర్మాణం హరిత ఇంధన సదుపాయాలను విస్తరిస్తుందిఇది డబ్బునుసమయాన్ని ఆదా చేస్తుందిఅలాగే పర్యావరణానికీ మేలు చేస్తుందిఈ కొత్త ప్రారంభం సందర్భంగా అలీపుర్‌దువార్కూచ్ బెహార్ ప్రజలకు అభినందనలుఈ నగర గ్యాస్ సరఫరా ప్రాజెక్ట్ కేవలం పైప్‌లైన్ ప్రాజెక్ట్ మాత్రమే కాదు.. ఇది ప్రభుత్వ పథకాలు ఇంటింటికీ చేరుతున్నాయనే దానికి ఒక ఉదాహరణ కూడా.

మిత్రులారా,

గడిచిన కొన్నేళ్లలో ఇంధన రంగంలో భారత్ సాధించిన పురోగతి అపూర్వమైనదినేడు మన దేశం గ్యాస్ ఆధారిత ఆర్థిక వ్యవస్థ దిశగా వేగంగా ముందుకు సాగుతోంది. 2014కి ముందుదేశంలోని 66 జిల్లాల్లో మాత్రమే నగర గ్యాస్ సరఫరా కేంద్రాలు ఉండేవినేడునగర గ్యాస్ సరఫరా నెట్‌వర్క్ 550కి పైగా జిల్లాలకు చేరుకుందిఈ నెట్‌వర్క్ ఇప్పుడు మన గ్రామాలుచిన్న పట్టణాలకూ చేరుకుంటోందిలక్షలాది ఇళ్లకు పైపుల ద్వారా గ్యాస్ అందుతోందిసీఎన్‌జీ కారణంగా ప్రజా రవాణా కూడా మారిపోయిందిఇది కాలుష్యాన్ని తగ్గిస్తోందిఅంటేదేశవాసుల ఆరోగ్యం మెరుగుపడుతోంది.. వారి జేబులపై భారం కూడా తగ్గుతోంది.

మిత్రులారా,

ప్రధానమంత్రి ఉజ్వల యోజనతో ఈ మార్పు మరింత ఊపందుకుందిమా ప్రభుత్వం 2016లో ఈ పథకాన్ని ప్రారంభించిందిఈ పథకం కోట్లాది మంది పేద సోదరీమణుల జీవితాలను సులభతరం చేసిందిఇది మహిళలను పొగ నుంచి విముక్తి చేసిందివారి ఆరోగ్యాన్ని మెరుగుపరిచింది.. మరీ ముఖ్యంగాఇంటి వంటగదిలో గౌరవప్రదమైన వాతావరణం ఏర్పడింది. 2014 నాటికి మన దేశంలో 14 కోట్ల కంటే తక్కువ ఎల్‌పీజీ కనెక్షన్లు మాత్రమే ఉన్నాయినేడు వాటి సంఖ్య 31 కోట్లకు పైగా ఉందిఅంటే ప్రతి ఇంటికి గ్యాస్ అందించాలనే కల ఇప్పుడు సాకారం అవుతోందిదీని కోసంమా ప్రభుత్వం దేశంలోని ప్రతి మూలలో గ్యాస్ సరఫరా నెట్‌వర్క్‌ను బలోపేతం చేసిందిఅందువల్లదేశవ్యాప్తంగా ఎల్‌పీజీ పంపిణీదారుల సంఖ్య కూడా రెట్టింపు అయింది. 2014కి ముందుదేశంలో 14 వేలలోపు ఎల్‌పీజీ పంపిణీదారులు ఉండగాఇప్పుడు వారి సంఖ్య 25 వేలకు పెరిగిందిఇప్పుడు ప్రతి గ్రామంలో గ్యాస్ సిలిండర్లు సులభంగా అందుబాటులో ఉన్నాయి.

మిత్రులారా,

మీ అందరికీ ఉర్జా గంగా ప్రాజెక్ట్ గురించి కూడా తెలుసుఈ ప్రాజెక్ట్ గ్యాస్ ఆధారిత ఆర్థిక వ్యవస్థ దిశగా ఒక విప్లవాత్మక ముందడుగుఈ పథకం కిందతూర్పు భారత్‌లోని రాష్ట్రాలకు గ్యాస్ పైప్‌లైన్‌లను అనుసంధానించే పని జరుగుతోందిఇప్పుడు పశ్చిమ బెంగాల్‌ సహా తూర్పు భారత్‌లోని అనేక రాష్ట్రాలకు పైపుల ద్వారా గ్యాస్ అందుతోందిభారత ప్రభుత్వం చేసిన ఈ ప్రయత్నాలన్నీ నగరాల్లో.. గ్రామాల్లో కొత్త ఉపాధి అవకాశాలను సృష్టించాయిపైపులైన్లు వేయడం నుంచి గ్యాస్ సరఫరా వరకు ప్రతి స్థాయిలో ఉపాధి పెరిగిందిగ్యాస్ ఆధారిత పరిశ్రమలు కూడా దీని నుంచి ప్రోత్సాహాన్ని పొందాయిఇప్పుడు మనం సరసమైనశుభ్రమైనఅందరికీ అందుబాటులో ఉండే ఇంధనం గల భారత్ దిశగా అడుగులు వేస్తున్నాం.

మిత్రులారా,

భారతీయ సంస్కృతిజ్ఞానంశాస్త్రాలకు పశ్చిమ బెంగాల్ ప్రధాన కేంద్రంగా ఉందిఅభివృద్ధి చెందిన భారత్ కల బెంగాల్ అభివృద్ధి లేకుండా నెరవేరదుదీనిని దృష్టిలో ఉంచుకునికేంద్ర ప్రభుత్వం గత 10 ఏళ్లలో ఇక్కడ వేల కోట్ల విలువైన అభివృద్ధి పనులు ప్రారంభించిందిపూర్వ ఎక్స్‌ప్రెస్‌వేదుర్గాపూర్ ఎక్స్‌ప్రెస్‌వేశ్యామా ప్రసాద్ ముఖర్జీ పోర్టు ఆధునీకరణకోల్‌కతా మెట్రో విస్తరణన్యూ జల్పైగురి స్టేషన్ పునరుద్ధరణదూవర్స్ మార్గంలో కొత్త రైళ్ల నిర్వహణ సహా బెంగాల్‌ అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం అన్ని ప్రయత్నాలూ చేసిందిఈ రోజు ప్రారంభించిన ప్రాజెక్ట్ కేవలం పైప్‌లైన్ కాదుఇది పురోగతికి జీవనాడిమీ జీవితాన్ని సులభతరం చేయడానికిమీ భవిష్యత్తును తేజోమయం చేయడానికి మేం చేస్తున్న ప్రయత్నంమన బెంగాల్ అభివృద్ధి దిశగా వేగంగా పయనించాలని ఆశిస్తూఈ అభివృద్ధి పనుల ప్రారంభం సందర్భంగా మీ అందరికీ మరోసారి నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నానుఇప్పుడు మరో నిమిషాల తర్వాతనేను ఇక్కడి నుంచి బహిరంగ వేదికకు వెళ్తున్నానుమీరు నా నుంచి చాలా విషయాలు వినాలనుకుంటున్నారుఆ వేదిక అందుకు మరింత అనుకూలంగా ఉంటుందికాబట్టి మిగిలిన విషయాలను నిమిషాల తర్వాత మీకు చెబుతానుఈ కార్యక్రమంలో ఇది చాలుమీరు ఈ అభివృద్ధి ప్రయాణాన్ని మరింత ఉత్సాహంతో ముందుకు తీసుకెళ్లాలి.

శుభాకాంక్షలు.. అందరికీ ధన్యవాదాలు.

గమనికప్రధానమంత్రి హిందీలో చేసిన ప్రసంగానికి తెలుగు అనువాదం.

 

***


(Release ID: 2132529)