భారత ఎన్నికల సంఘం
azadi ka amrit mahotsav

గుజరాత్, కేరళ, పంజాబ్‌తోపాటు పశ్చిమ బెంగాల్ శాసనసభ నియోజకవర్గాలకు ఉప ఎన్నికల షెడ్యూలు

Posted On: 25 MAY 2025 12:12PM by PIB Hyderabad

గుజరాత్, కేరళపంజాబ్‌లతో పాటు పశ్చిమ బెంగాల్‌లో ఈ కింద ప్రస్తావించిన అయిదు శాసనసభ నియోజకవర్గాల్లో ఖాళీ అయిన స్థానాలను భర్తీ చేయడానికి ఉపఎన్నికలు నిర్వహించాలని ఎన్నిక సంఘం నిర్ణయించింది:

 

క్రమ సంఖ్య

రాష్ట్రంకేంద్రపాలిత ప్రాంతం పేరు

అసెంబ్లీ నియోజక వర్గం సంఖ్యపేరు

ఖాళీ అవడానికి కారణం ఇదీ..

  1.  


 

గుజరాత్


 

గుజరాత్

24-కడీ (ఎస్‌సీ)

 

శ్రీ కర్సన్‌భాయి పుంజాభాయి సోలంకీ మరణించారు.

  1.  

87-విసావదర్ 

శ్రీ భయానీ భూపేంద్రభాయి గాందుభాయి రాజీనామా చేశారు.

  1.  

కేరళ

35-నీలాంబుర్

శ్రీ పి.విఅన్వర్ రాజీనామా చేశారు.

  1.  

పంజాబ్

64-లుధియానా పశ్చిమ

శ్రీ గుర్‌ప్రీత్ బస్సీ గోగీ మరణించారు.

  1.  

పశ్చిమ

బెంగాల్

80-కాలీగంజ్

శ్రీ నసీరుద్దీన్ అహమద్ మరణించారు.

 

ఉప ఎన్నికకు సంబంధించిన ప్రక్రియ ఈ కింద పేర్కొన్న విధంగా ఉంటుంది.

  1. ఓటర్ల జాబితా

స్వేచ్ఛాయుతపక్షపాత రహితనమ్మకమైన ఎన్నికలకు పునాదిగా నిలిచేది శుద్ధఅత్యంత తాజాపరిచిన ఓటర్ల జాబితాలే అని ఎన్నిక సంఘం భావిస్తోందిఈ కారణంగాఓటర్ల జాబితా నాణ్యతనుస్థితినివిశ్వసనీయతను మెరుగుపరచడానికి శ్రద్ధ వహిస్తున్నారుఎన్నికల (సవరణచట్టం-2021 ద్వారా ప్రజా ప్రాతినిధ్య చట్టం-1950 లోని 14వ సెక్షనులో సవరణ చేసిన అనంతరంఓటరుగా నమోదు కావడానికి ఏడాదిలో నాలుగు తేదీల వెసులుబాటు లభించిందిదీనికి అనుగుణంగాఎన్నికల సంఘం ఈ సంవత్సరం ఏప్రిల్ 1ని అర్హత తేదీగా పేర్కొంటూ ఓటర్ల జాబితాలో ప్రత్యేక సంక్షిప్త తప్పుల సవరణను నిర్వహించిందిదీనిలో ఈ ఏడాది ఏప్రిల్ 1ని అర్హత తేదీలా పరిగణిస్తూ ఓటర్ల జాబితాలో నమోదును కోరుతున్న యోగ్యత కలిగిన పౌరుల నుంచి దరఖాస్తులను ఆహ్వానించారుఓటర్ల జాబితాల ప్రత్యేక సంక్షిప్త తప్పుల సవరణ పనిని సమయబద్ధ ప్రాతిపదికన పూర్తి చేసిన తరువాత ఓటర్ల కడపటి జాబితాను ఈ నెల 5న ప్రచురించారు.

ఏమైనానామినేషన్ల దాఖలుకు చివరి తేదీ కన్నా 10 రోజుల మందు వరకు అందిన దరఖాస్తులకు సంబంధించిసమీప అర్హత తేదీ విషయంలోఓటర్ల జాబితాను అంతదాకా మార్పుచేర్పులు చేస్తూ సరికొత్తవిగా తీర్చిదిద్దే ప్రక్రియ.. నామినేషన్ల దాఖలుకు చివరి రోజు దాకా.. కొనసాగనుంది.

  1. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు (ఈవీఎం), వీవీపీఏటీలు

ఉపఎన్నిక జరిగే పోలింగ్ కేంద్రాలన్నిటిలో ఈవీఎంలనువీవీపీఏటీలను ఉపయోగించాలని ఎన్నికల సంఘం నిర్ణయించిందిచాలినన్ని ఈవీఎంలనువీవీపీఏటీలను అందుబాటులో ఉంచారుఈ యంత్రాల సాయంతో ఓటింగు సాఫీగా జరిగేటట్లు చూడడానికి వీలుగా అన్ని చర్యలను తీసుకున్నారు.

  1. ఓటర్ల గుర్తింపు

ఓటరు ఫోటో ఐడెంటిటీ కార్డు (ఈపీఐసీయే ఓటర్ల గుర్తింపునకు ముఖ్య దస్తావేజుగా ఉంటుందిఈ కింద పేర్కొన్న గుర్తింపు దస్తావేజుల్లో ఏ ఒక్కదానిని అయినా సరే పోలింగ్ కేంద్రంలో చూపించవచ్చును :

  1. ఆధార్ కార్డు,

  2. ఎంజీఎన్ఆర్ఈజీఏ జాబ్ కార్డు,

  3. బ్యాంకుతపాలా కార్యాలయం జారీ చేసిన ఫోటోతో కూడిన పాస్‌బుక్‌లు,

  4. కార్మిక మంత్రిత్వ శాఖ పథకంలో భాగంగా జారీ చేసే ఆరోగ్య బీమా స్మార్ట్ కార్డు,

  5.  డ్రయివింగ్ లైసెన్సు,

  6. పాన్ కార్డు,

  7. ఎన్‌పీఆర్‌లో భాగంగా ఆర్‌జీఐ జారీ చేసిన స్మార్ట్ కార్డు,

  8. భారతీయ పాస్‌పోర్టు,

  9. ఫోటోతో కూడిన పింఛన్ దస్తావేజు,

  10. కేంద్రంరాష్ట్ర ప్రభుత్వంప్రభుత్వ రంగ సంస్థపబ్లిక్ లిమిటెడ్ కంపెనీలు ఉద్యోగులకు జారీ చేసే ఫోటోతో కూడిన సర్వీస్ ఐడెంటిటీ కార్డులతోపాటు,

  11. ఎంపీఎమ్మెల్ల్యేఎమ్మెల్సీ.. వీరికి జారీ చేసిన అధికారిక గుర్తింపు కార్డులు.

  12. కేంద్ర ప్రభుత్వ సామాజిక న్యాయం-సాధికారత మంత్రిత్వ శాఖ ఇచ్చే విశిష్ట దివ్యాంగత్వం గుర్తింపు పత్రం (యూడీఐడీకార్డు

 ఆదర్శ ప్రవర్తన నియమావళి

ఎన్నిక కోసం నిర్ధారించిన విధానసభ నియోజకవర్గం పూర్తిగా గాని లేదా ఏ కొంత భాగం అయినా గాని కలిసి ఉన్న అలాంటి జిల్లా (లేదా జిల్లాలు)లో తక్షణం ఆదర్శ ప్రవర్తన నియమావళి అమలులోకి వస్తుందిఅయితేఇది జనవరి 2వ తేదీ, 2024నాటి లేఖ సంఖ్య 437/6/1NST/ECI/FUNCT/MCC/2024/ (ఉపఎన్నికలు)లో భాగంగా ఉన్న ఆదేశాలకు లోబడి ఉంటుంది. (ఈ లేఖ ఎన్నికల సంఘం వెబ్‌సైట్ ‌లో అందుబాటులో ఉంది)

  1. నేర సంబంధ నేపథ్యం విషయమై సమాచారం

నేర సంబంధ నేపథ్యం కలిగి ఉన్న అభ్యర్థులకు ప్రచార కాలంలో మూడు సందర్భాల్లో వార్తాపత్రికలుటెలివిజన్ చానళ్ల ద్వారా ఈ విషయమై సమాచారాన్ని ప్రచురించాల్సిన అవసరం ఉంటుందినేర సంబంధ నేపథ్యం కలిగిన అభ్యర్థులకు టికెట్లు ఇచ్చే రాజకీయపక్షాలు కూడా తమ అభ్యర్థుల నేర సంబంధ నేపథ్యం గురించి సమాచారాన్ని తమ వెబ్‌సైట్‌లోనూవార్తాపత్రికల్లోనూటెలివిజన్ చానళ్లలోనూ మూడు సందర్భాల్లో తెలియజేయాల్సిన అవసరం ఉంటుంది.

ఎన్నికల సంఘం సెప్టెంబరు 16వ తేదీ, 2020తో కూడిన లేఖ సంఖ్య 3/4/2019/SDR/Vol. IV ద్వారా నిర్దిష్ట 

అవధిని ఈ కింద పేర్కొన్న పద్ధతుల్లో మూడు బ్లాకుల వారీగా ఖరారు చేస్తామంటూ ఆదేశాన్ని ఇచ్చిందిదీనివల్ల ఓటర్లకు తమ అభ్యర్థుల నేపథ్యాన్ని గురించి తెలుసుకోవడానికి తగినంత సమయం దొరుకుతుంది:

ఉపసంహరణ తాలూకు మొదటి నాలుగు రోజుల లోపు

బి.  తరువాతి 5- 6వ రోజుల మధ్య

సి.  9వ రోజు నుంచి ప్రచారంలో చివరి రోజు వరకు (ఓటింగు తేదీ కన్నా ముందు రెండో రోజు)

(ఉదాహరణఒకవేళ నామినేషన్ ఉపసంహరణ తేదీ నెలలోని పదో తారీఖు అయినప్పుడుఓటింగు నెలలోని 24వ తారీఖున ఉన్నప్పుడు... అలాంటప్పుడు ప్రకటనను ప్రచురించడానికి మొదటి బ్లాకు ప్రచురణ నెలలోని 11- 14తేదీల మధ్య జరుగుతుంది. రెండో బ్లాకు ప్రచురణ 15-18 తేదీల మధ్య మూడో బ్లాకును 19- 22వ తేదీల మధ్య ఉంటుంది.)

రాజకీయ పక్షాలు నేరపూర్వక నేపథ్యం కలిగి ఉన్న అభ్యర్థులను ఎంపిక చేసిన 48 గంటల లోపల వారిని ఎంపిక చేసినందుకు వివరాలనుకారణాలను వార్తాపత్రికలలోనూ తమ అధికారిక సామాజిక ప్రసార మాధ్యమ వేదికల్లోనూ ప్రచురించడంతోపాటు తమ వెబ్‌సైట్‌లో కూడా అప్‌లోడ్ చేయాలిఈ వివరాలు ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్న జనవరి 1వ తేదీ, 2022తో కూడిన లేఖ సంఖ్య 3/4/2021/SDR/Vol. III లో పేర్కొని ఉన్నాయి.

రిట్ పిటిషన్ (సీసంఖ్య 784/2015 (లోక్ ప్రహరీ వెర్సస్ ఇండియా యూనియన్ఇతరులు)తో పాటు రిట్  పిటిషన్ (సివిల్సంఖ్య 536/2011 (పబ్లిక్ ఇంటరెస్ట్ ఫౌండేషన్ఇతరులు వెర్సస్ ఇండియా యూనియన్,  ఇతరులు)లో గౌరవనీయ సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పు ప్రకారం దీనిని సమర్పించాల్సిన  అవసరం ఉంది.


 

ఉప ఎన్నికకు సంబంధించిన కార్యక్రమాలు

తేదీవారం

గెజిట్ నోటిఫికేషన్ జారీ తేదీ

మే 26, 2025

(సోమవారం)

నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ

జూన్ 2, 2025

(సోమవారం)

నామినేషన్ల పరిశీలన తేదీ

జూన్ 3, 2025

(మంగళవారం)

అభ్యర్థిత్వాల ఉపసంహరణకు చివరి తేదీ

జూన్ 5, 2025

(గురువారం)

 పోలింగ్ తేదీ

జూన్ 19, 2025

(గురువారం)

ఓట్లు లెక్కించే తేదీ

 

జూన్ 23, 2025

(సోమవారం)

ఎన్నిక పూర్తి అవ్వాల్సిన తేదీ

జూన్ 25, 2025

(బుధవారం)

 

ఈ సమాచారం మీ అభ్యర్థులను గురించి తెలుసుకోండి’ శీర్షికతో గల ఒక యాప్‌లో కూడా అందుబాటులో ఉంటుంది.

  1. బకాయిలు ఏవీ లేవు’ అంటూ ధ్రువీకరించే పత్రం

ఎవరైనా అభ్యర్థి ఎన్నికల నోటిఫికేషన్‌ను జారీ చేసిన తేదీ కన్నా ముందటి 10 సంవత్సరాల కాలంలో ప్రభుత్వం మంజూరు చేసిన ఏదైనా నివాస భవనంలో బస చేసి ఉంటే గనక... ఆ అభ్యర్థి సంప్రదించినట్లయితేసదరు అభ్యర్థి కి (అద్దె, (బివిద్యుత్తు చార్జీలు, (సినీళ్ల చార్జీలతో పాటు (డిటెలిఫోన్ చార్జీలకు సంబంధించిన ‘‘బకాయిలు ఏవీ లేవు అని పేర్కొనే ధ్రువపత్రాన్ని’’ సంపాదించుకోవడంలో సహకరించాల్సిందిగా ఆయా ఏజెన్సీలుప్రాధికార సంస్థలువిభాగాలకు ఎన్నికల సంఘం ఆదేశాలను ఇచ్చిందిఈ ఆదేశాలు ఎన్నికల సంఘం మే 2వ తేదీ, 2024తో కూడిన లేఖ సంఖ్య 3/ఈఆర్/2023/ఎస్‌డీఆర్/సంపుటి. IV లో పేర్కొని ఉన్నాయి... అంతేకాక ఈ ఆదేశాలు ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌లో కూడా అందుబాటులో ఉన్నాయి.


 

***

 


(Release ID: 2131398)