హోం మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఆంధ్రప్రదేశ్‌లో మూడు కొత్త క్రిమినల్ చట్టాల అమలుపై ముఖ్యమంత్రి శ్రీ ఎన్. చంద్రబాబు నాయుడుతో న్యూఢిల్లీలో సమీక్షా సమావేశం నిర్వహించిన కేంద్ర హోం, సహకార శాఖా మంత్రి శ్రీ అమిత్ షా


ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో తీసుకువచ్చిన మూడు కొత్త క్రిమినల్ చట్టాలు భారత రాజ్యాంగ స్ఫూర్తిని ప్రతిబింబిస్తూ.. వాటిని సాకారం కోసం ఉద్దేశించినవి

కొత్త క్రిమినల్ చట్టాల రూపకల్పనతోనే పౌరుల హక్కులను బలోపేతం చేయలేం

పౌరులు వారి హక్కులను పొందేందుకు ఈ చట్టాలను క్షేత్ర స్థాయిలో అమలు చేయడం అవసరం

అభియోగ పత్రం దాఖలు, అభియోగాల నమోదులో కాలపరిమితిని పాటించడంపై ప్రధానంగా దృష్టి సారించాలి
కొత్త క్రిమినల్ చట్టాల పూర్తిస్థాయి అమలు కోసం సాంకేతిక పరిజ్ఞాన వినియోగం, నిరంతర పర్యవేక్షణ అత్యంత అవసరం

కొత్త క్రిమినల్ చట్టాల పూర్తిస్థాయి అమలును ఆంధ్రప్రదేశ్ సమీక్షించాలి... తద్వారా రాష్ట్రంలో కొత్త చట్టాల అమలు వేగవంతం

Posted On: 23 MAY 2025 7:14PM by PIB Hyderabad

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మూడు కొత్త క్రిమినల్ చట్టాల అమలుపై ముఖ్యమంత్రి శ్రీ ఎన్చంద్రబాబు నాయుడుతో కేంద్ర హోంసహకార శాఖా మంత్రి శ్రీ అమిత్ షా ఈరోజు న్యూఢిల్లీలో సమీక్షా సమావేశం నిర్వహించారుఈ సమావేశంలో పోలీసులుజైళ్లున్యాయస్థానాలుప్రాసిక్యూషన్ఫోరెన్సిక్‌లకు సంబంధించిన పలు కొత్త నిబంధనల అమలుప్రస్తుత స్థితిని సమీక్షించారుకేంద్ర హోంశాఖ కార్యదర్శిఆంధ్రప్రదేశ్ ప్రధాన కార్యదర్శిడైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్డైరెక్టర్ జనరల్బీపీఆర్ అండ్ డీఎన్‌సీఆర్‌బీ డైరెక్టర్ సహా హోం మంత్రిత్వ శాఖ.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సీనియర్ అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కేంద్ర హోంసహకార శాఖా మంత్రి శ్రీ అమిత్ షా మాట్లాడుతూ... ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో తీసుకువచ్చిన మూడు కొత్త క్రిమినల్ చట్టాలు భారత రాజ్యాంగ స్ఫూర్తిని ప్రతిబింబిస్తూవాటిని సాకారం చేసేందుకు ఉద్దేశించినవని తెలిపారుకొత్త క్రిమినల్ చట్టాల రూపకల్పనతోనే పౌరుల హక్కులు బలోపేతం కావనీపౌరులకు హక్కులు కల్పించేందుకు ఈ చట్టాలను క్షేత్రస్థాయిలో పూర్తిగా అమలు చేయడం అవసరమని ఆయన అబిప్రాయపడ్డారుకొత్త క్రిమినల్ చట్టాలను పూర్తిస్థాయిలో అమలు చేయడం ద్వారా మాత్రమే పౌరులు తమ హక్కులను పొందగలరన్న కేంద్ర హోంమంత్రిదీనికి సాంకేతికతను ఉపయోగించడంతో పాటునిరంతర పర్యవేక్షణ కూడా అవసరమన్నారు.

 

***


(Release ID: 2131068)