ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

మావోవాదమనే భూతాన్ని అంతమొందించడానికి బలగాలు చేస్తున్న ప్రయత్నాలు హర్షణీయం: ప్రధాని

Posted On: 21 MAY 2025 5:07PM by PIB Hyderabad

మావోవాదమనే భూతాన్ని అంతమొందించడంతో పాటు మన దేశ ప్రజలకు శాంతియుత జీవనాన్నీపురోగతినీ అందించాలన్న ప్రభుత్వ నిబద్ధతను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు. ఈ దిశగా బలగాలు చేస్తున్న ప్రయత్నాలను ఆయన హర్షించారు.

కేంద్ర మంత్రి శ్రీ అమిత్ షా ఎక్స్‌లో పొందుపరిచిన ఒక సందేశానికి శ్రీ మోదీ ప్రతిస్పందిస్తూ:

‘‘ఈ అసాధారణ విజయాన్ని సాధించిన మన బలగాలను చూస్తే గర్వంగా ఉంది. మావోవాదమనే భూతాన్ని అంతం చేయడానికి, మన దేశ ప్రజలకు శాంతియుత జీవనంప్రగతి.. ఈ రెంటినీ అందించడానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది.’’ అని పేర్కొన్నారు.‌


(Release ID: 2130391)