సూక్ష్మ‌, లఘు, మధ్య త‌ర‌హా సంస్థల మంత్రిత్వ శాఖష్
azadi ka amrit mahotsav

జాతీయ పురస్కారం- 2024 కోసం ఎంఎస్ఎంఈల నుంచి దరఖాస్తులను ఆహ్వానించిన సూక్ష్మ, చిన్న, మధ్యతహా పరిశ్రమల మంత్రిత్వ శాఖ

Posted On: 15 MAY 2025 4:38PM by PIB Hyderabad

 అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన ఔత్సాహిక ఎంఎస్ఎంఈ పారిశ్రామికవేత్తల కృషిని గుర్తించిన ఎంఎస్ఎంఈ మంత్రిత్వ శాఖ.. జాతీయ స్థాయిలో పురస్కారాలను అందించడం ద్వారా వారిలో ప్రేరణ కలిగించిప్రోత్సహిస్తోందిప్రస్తుతం వివిధ విభాగాల్లో ఎంఎస్ఎంఈలకు 35 జాతీయ పురస్కారాలు అందిస్తున్నారుమహిళలుఎస్సీ/ఎస్టీఈశాన్య ప్రాంతానికి చెందిన ఔత్సాహిక పారిశ్రామిక వేత్తల నేతృత్వంలోని ఎంఎస్ఎంఈలకు ప్రత్యేక పురస్కారాలు ఉంటాయిఈ పథకం కింద పురస్కారం పొందిన ఎంఎస్ఎంఈలకు ట్రోఫీధ్రువీకరణ పత్రంతోపాటు నగదు బహుమతులను (మొదటి స్థానంరూ. 3 లక్షలురెండో స్థానంరూ. 2 లక్షలుమూడో స్థానంరూ. 1 లక్షఅందిస్తారు.

2024 సంవత్సరానికి జాతీయ పురస్కారం కోసం వివిధ విభాగాల్లోని ఎంఎస్ఎంఈల నుంచి ఏప్రిల్ నుంచి మే 20 వరకు జాతీయ అవార్డు పోర్టల్ (https://dashboard.msme.gov.in/na/Ent_NA_Admin/Ent_index.aspxద్వారా దరఖాస్తులను ఆహ్వానించారుఆసక్తిగల ఎంఎస్ఎంఈలు హోం మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని రాష్ట్రీయ పురస్కార్ పోర్టల్ (https://awards.gov.in/ద్వారా కూడా దరఖాస్తులను సమర్పించవచ్చువివరాలు www.dcmsme.gov.in లో అందుబాటులో ఉన్నాయిఏదైనా వివరణ కోసం సమీపంలోని ఎంఎస్ఎంఈ – అభివృద్ధిసహకార కార్యాలయం (ఎంఎస్ఎంఈడీఎఫ్‌వో)లో లేదా 011-23063342 నంబరుకు ఫోన్ చేసి సంప్రదించవచ్చు.  

 

***


(Release ID: 2128955)