WAVES BANNER 2025
సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ

సృజనతో చేరిన ఏఐ: వేవ్స్ 2025 వేదికగా భవిష్యత్తు డిజిటల్ వ్యక్తీకరణలో భారత్ పాత్రను వివరించిన పరిశ్రమ ప్రముఖులు


“ఏఐ ఉద్యోగాలకు ముప్పు కాదు.... లక్ష్యసాధనకు మార్గం” – రిచర్డ్ కెర్రీస్, ఎన్విడియా

“సృజనాత్మకతతో ప్రతి రంగంలో మార్పు వచ్చింది.” – శంతను నారాయణ్, అడోబ్

 Posted On: 01 MAY 2025 8:52PM |   Location: PIB Hyderabad

కృత్రిమ మేధస్సు చర్చల కేంద్రంగాఆవిష్కరణసృజనాత్మకతఅత్యాధునిక సాంకేతికతల కలయికకు వేవ్స్ 2025 వేదికగా నిలిచిందిముంబయిలో ఈరోజు సమ్మిట్ ప్రారంభ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా గల పరిశ్రమ ప్రముఖుల నేతృత్వంలో జరిగిన మూడు సమావేశాలుమీడియాకథలు చెప్పడండిజిటల్ ప్రొడక్షన్‌ రంగాలతో ఏఐకి గల అనుబంధాన్ని వివరించాయి.. ఈ సృజనాత్మక-సాంకేతిక పరిణామంలో పెరుగుతున్న భారత స్థాయిని పునరుద్ఘాటించాయి.

 సృజనాత్మకతతో ప్రతి రంగంలో మార్పు వచ్చింది.” – శంతను నారాయణ్అడోబ్

"ఏఐ యుగంలో డిజైన్మీడియాసృజనాత్మకతఅనే అంశంపై కీలకోపన్యాసం చేసిన అడోబ్ ఛైర్మన్సీఈఓ శంతను నారాయణ్ మాట్లాడుతూఅభివృద్ధి చెందుతున్న సృజనాధారిత ఆర్థిక వ్యవస్థపై విశ్లేషణ అందించారుఇంటర్నెట్ నుంచి మొబైల్‌కు అలాగే ఇప్పుడు కృత్రిమ మేధస్సుకు పురోగమిస్తున్న డిజిటల్ ప్రయాణాన్ని వివరిస్తూ50 కోట్ల మందికి పైగా భారతీయులు ఆన్‌లైన్ కంటెంట్‌ను వినియోగిస్తున్నారనిప్రాంతీయ భాషల దిశగా గణనీయమైన మార్పు వచ్చిందని నారాయణ్ వెల్లడించారు.

ఏఐ సృజనాత్మకతను నాశనం చేయడంలేదనీదానిని విస్తృతం చేస్తోందని ఆయన స్పష్టం చెప్పారు. "భారత సృజనకారులు సంప్రదాయిక మాధ్యమాలను మించి ముందుకు సాగేందుకు జనరేటివ్ ఏఐ వీలు కల్పిస్తోందిఅని ఆయన అన్నారు. ఇమేజింగ్వీడియోడిజైన్‌ రంగాల్లో విభిన్నంగా కథలు చెప్పడానికి ఇది ఎలా మద్దతు ఇస్తుందో వివరించారుసినిమా నుంచి రియల్-టైమ్ మొబైల్ స్టోరీ టెల్లింగ్ వరకుసృజనాత్మక సామర్థ్యం విస్తరిస్తోందన్నారు.

అప్లికేషన్ల నుండి డేటా మౌలిక సదుపాయాల వరకు ఏఐ-ఆధారిత విధానాల రూపకల్పనలో భారత ప్రత్యేక స్థానాన్ని స్పష్టం చేసిన నారాయణ్... సృజనాత్మకతనుఉత్పాదకతను క్రియాశీలం చేయడంవ్యాపార నమూనాలను ఆవిష్కరించడంఏఐనైపుణ్యాలు గల సిబ్బందితో ముందుకుసాగడంవ్యవస్థాపకతను ప్రోత్సహించడం వంటి నాలుగు అంచెల వ్యూహాన్ని వివరించారువేవ్స్ వంటి దార్శనిక వేదికను రూపొందించిన భారత ప్రభుత్వంకేంద్ర సమాచారప్రసార మంత్రిత్వ శాఖకు కృతజ్ఞతలు తెలుపుతూ ఆయన తన ప్రసంగాన్ని ముగించారు.

ఏఐ ఉద్యోగాలకు ముప్పు కాదు... లక్ష్యసాధనకు మార్గం” – రిచర్డ్ కెర్రీస్ఎన్విడియా

"ఏఐ బియాండ్ వర్క్శీర్షికతో ఆలోచింపజేసేఆసక్తికరమైన సంభాషణల ద్వారాఎన్విడియా వైస్ ప్రెసిడెంట్ రిచర్డ్ కెర్రిస్ఎన్విడియా ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ విశాల్ ధూపర్వ్యక్తిగత కంప్యూటింగ్సృజనాత్మక ఉత్పాదకతను ఏఐ ఎలా పునర్నిర్వచిస్తుందో వివరించారు.

పీసీ యుగ పరిణామాన్ని వివరిస్తూధూపర్ ఇలా వ్యాఖ్యానించారు, "ఆఫీసు పనివేళల తర్వాత పీసీలు విశ్రాంతి తీసుకునేవి. కానీ మానవులకు విశ్రాంతి లేకపోయేది." పీసీలను సృజనాత్మక సహచరులుగా భావించడమనే ఎన్విడియా ప్రాథమిక భావనను వివరించిన ఆయన... నేటి ఏఐ ఆధారిత ప్రపంచంలో దాని ప్రభావాన్ని వివరించారు.

గతంలో 3డీ యానిమేషన్‌ను నేర్చుకోవడంలో ఉన్న సంక్లిష్టతలను గుర్తు చేసుకుంటూ కెర్రిస్ ఒక చారిత్రక దృక్పథాన్ని వివరించారు. "ఇప్పుడుజనరేటివ్ ఏఐతో మన ఆలోచన నుంచి సృజన వరకు చాలా వేగంగా వెళ్ళవచ్చుఅన్నారుఅయినప్పటికీప్రాథమిక అంశాలతో సంబంధాన్ని కోల్పోకూడదని హెచ్చరించిన ఆయన, "మనందరికీ మన ఫోన్‌లో కెమెరా ఉండడం మనందరినీ గొప్ప ఫోటోగ్రాఫర్లుగా చేయదు." అనే వాస్తవాన్ని ఉటంకించారు.

ఏఐ మానవ సృజనాత్మకతను భర్తీ చేయడానికి బదులుగా దానిని మరింత మెరుగుపరుస్తుందని వక్తలు అభిప్రాయపడ్డారు. "ఏఐ మీ చేతుల్లో సాధనాలను ఉంచుతుంది... ఎలా పని చేయాలో తెలియడంఇతర ప్రాథమిక అంశాలను తెలుసుకోవడం ఇప్పటికీ అవసరమేఅని కెర్రిస్ స్పష్టం చేశారు. "సృజనాత్మకత గల వ్యక్తులు ప్రాణం పెట్టి పని చేస్తారుఏఐ దానిని భర్తీ చేయలేదుఅది ఆ పనిలో సహాయం మాత్రమే చేస్తుంది." అంటూ ధుపర్ తన ప్రసంగాన్ని ముగించారు.

జనరల్ ఏఐతో కథలకు జీవం పోయడం” — అనీష్ ముఖర్జీఎన్విడియా

మూడో సమావేశంలో నిర్వహించిన మాస్టర్‌క్లాస్‌లో... ఎన్విడియాలో సొల్యూషన్స్ ఆర్కిటెక్ట్‌గా ఉన్న అనీష్ ముఖర్జీ మాట్లాడుతూ మీడియాలో జనరేటివ్ ఏఐ ఆచరణాత్మక అనువర్తనాల గురించి అద్భుతంగా వివరించారు. “జనరేటివ్ ఏఐతో కథలకు ప్రాణం పోయడం” అనే శీర్షికతో సాగిన ఈ సమావేశం... హార్డ్‌వేర్‌ను మించి పరివర్తన సాధనాల దిశగా సాగే ఎన్విడియా ప్లాట్‌ఫామ్ విధానంపై ప్రధానంగా దృష్టి సారించింది.

స్టాటిక్ చిత్రాలను డిజిటల్ మానవులుగా మలచడంబహుభాషా వాయిస్-ఓవర్‌లుఆడియో-ఆధారిత క్యారెక్టర్ యానిమేషన్ వంటి ఏఐ-ఆధారిత పరిష్కారాలను ముఖర్జీ వివరించారు. ఎన్విడియా ఫుగాటో మోడల్‌ను ఉపయోగించి...  ఏఐ ద్వారా సంగీతండబ్బింగ్ ప్రక్రియలో వాస్తవిక లిప్-సింకింగ్‌ను ఆయన ప్రదర్శన ద్వారా చూపించారుఓమ్నివెర్స్ ప్లాట్‌ఫామ్ ద్వారా వీడియో జనరేషన్సిమ్యులేషన్-ఆధారిత శిక్షణ కోసం ప్రాథమిక నమూనాల సూట్ అయిన కాస్మోస్‌ను కూడా ముఖర్జీ పరిచయం చేశారు.

ఏఐ యానిమేషన్డిఎల్ఎస్ఎస్‌లతో అతిపెద్ద భాషా నమూనాలను మిళితం చేసే ప్రక్రియను ప్రస్తావిస్తూముఖ్యంగా గేమ్ రూపకల్పనలో లీనమయ్యేలా కథను చెప్పే అనుభవాలను సృష్టించడంలో వాటి పాత్రను ఆయన వివరించారు. "ఆటగాళ్ల కోసం తెలివిగా స్పందించే ఏఐఆధారిత పాత్రలు లీనమయ్యే విధంగా కథను చెప్పే విధానాన్ని పునర్నిర్వచించాయిఅని ఆయన పేర్కొన్నారు.

కంప్యూటర్ సామర్థ్యంసమృద్ధిగా సమాచారం గల డేటాసెట్‌లుఅల్గారిథమ్‌ల శక్తిని ఉపయోగించి జనరేటివ్ ఏఐ పూర్తి సామర్థ్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిస్తూ ముఖర్జీ తన ప్రసంగాన్ని ముగించారుఅవసరానికి అనుగుణంగా మోడళ్లను రూపొందించడంలో సృజనకారులకు సాధికారత కల్పించే నెమోస్టాక్ సహా ఎన్విడియా ఓపెన్-సోర్స్ వ్యవస్థ ఈ రంగంలో ఆవిష్కరణలను మరింత ముందుకు తీసుకువెళుతుంది.

వేవ్స్ 2025: ఏఐ నేతృత్వంలో విప్లవాత్మకమైన సృజనాత్మక మార్పులకు వేదికను సిద్ధం చేయడం

ఈ సమావేశాల్లో కొనసాగిన చర్చలు ఏఐ ప్రత్యామ్నాయం కాదు... సాధికారతకు ఒక సాధనం అనే ఒక ఏకీకృత సందేశాన్ని అందించాయిడిజైన్సినిమాయానిమేషన్కథ చెప్పడం వంటి రంగాల్లో ప్రాథమిక అంశాలను అర్థం చేసుకుని, సరికొత్త సాధనాలను బాధ్యతాయుతంగా ఉపయోగించుకుంటూవిలువలుసృజనాత్మకతసమ్మిళితత్వంతో ముడిపడిన వ్యవస్థలను నిర్మించే వారిదే భవిష్యత్తుఅందుకే ప్రపంచ సృజనాత్మకసాంకేతిక రంగాల్లో భారత్ పోషించే కీలక పాత్రకు వేవ్స్ -2025  నిదర్శనంగా నిలుస్తుంది.

 

***


Release ID: (Release ID: 2126309)   |   Visitor Counter: 13