WAVES BANNER 2025
సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ

అంతర్జాతీయ మంత్రుల స్థాయి భాగస్వామ్యంతో వేవ్స్ 2025కు కేంద్ర బిందువు కానున్న ప్రపంచ మీడియా చర్చా వేదిక


వేవ్స్ 2025లో 60 దేశాల ప్రతినిధులతో పాటు మీడియా చర్చల్లో చేరనున్న యూకే, జపాన్, రష్యా

గ్లోబల్ మీడియా డైలాగ్ లో భాగంగా వేవ్స్ డిక్లరేషన్

 Posted On: 01 MAY 2025 7:02PM |   Location: PIB Hyderabad

ముంబయిలో జరుగుతున్న వేవ్స్ సదస్సులో భాగంగా రేపు ప్రపంచ మీడియా చర్చా వేదికను (జిఎండి)ను భారత్ మొదటిసారిగా నిర్వహిస్తోందిఇది ప్రపంచ మీడియావినోద రంగాలతో భారత్ అనుసంధానం కావడంలో ఒక ముఖ్యమైన అధ్యాయాన్ని సూచిస్తుందిఈ చర్చా వేదికను విదేశాంగ మంత్రిత్వ శాఖ సహకారంతో సమాచారప్రసార మంత్రిత్వ శాఖ నిర్వహిస్తోంది

ఆసియాయూరప్ఆఫ్రికాఅమెరికా నుంచి  ప్రతినిధులతో పాటు 60కి పైగా దేశాలు ఈ సదస్సులో పాల్గొనే అవకాశం ఉందిరష్యాజపాన్యూకేఈజిప్ట్సౌదీ అరేబియా సహా పలు దేశాల మంత్రిత్వ స్థాయిసీనియర్ అధికార స్థాయి ప్రతినిధులు ఇందులో పాల్గొంటారుఅంతర్జాతీయ సహకారాన్ని ప్రోత్సహించడంఉత్తమ విధానాలను పంచుకోవడంప్రపంచ మీడియా రంగంలో విధాన సమన్వయంప్రతిభ మార్పిడిసామర్థ్యవృద్ధికి అవకాశాలను అన్వేషించడం ఈ చర్చా వేదిక లక్ష్యం

ఈ చర్చా వేదిక ఫలితంగా ‘ వేవ్స్ డిక్లరేషన్’ రూపుదిద్దుకోనుందిఇందులో పాల్గొంటున్న దేశాలు మీడియావినోద రంగాలలో అంతర్జాతీయ సహకారం ప్రాముఖ్యతను పునరుద్ఘాటించడంతో పాటుభవిష్యత్ సహకారాలు,  భాగస్వామ్యాలకు పునాది వేయనున్నాయిచైతన్యవంతమైన మీడియా వ్యవస్థవేగంగా అభివృద్ధి చెందుతున్న వినోద పరిశ్రమతోభారతదేశం ఇలాంటి ఒక అంతర్జాతీయ సదస్సుకు ఆతిథ్యమివ్వడానికి ప్రత్యేక అర్హత కలిగిన దేశంగా నిలిచిందిఈ ప్రపంచ మీడియా సదస్సు ప్రపంచాన్ని విలువలతో మలచడంలో మీడియా పాత్రపై జరుగుతున్న అంతర్జాతీయ చర్చలకు భారతదేశాన్ని కేంద్ర బిందువుగా నిలబెట్టే ఒక కీలక క్షణాన్ని సూచిస్తోంది.

సమాజాలుఆర్థిక వ్యవస్థలు అంతర్జాతీయ సహకారాన్ని రూపొందించడంలో పెరుగుతున్న మీడియావినోద రంగాల పాత్ర గురించి చర్చించడానికి గ్లోబల్ మీడియా డైలాగ్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రధాన వాటాదారులను ఏకతాటిపైకి తెస్తుందిఇది మీడియావినోద రంగాలలో వేగంగా మారుతున్న దృశ్యాలను గురించి స్వేచ్ఛాయుత చర్చలకు వేదికగా నిలవనుందివేగంగా అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానంకంటెంట్ ధోరణులలో మార్పుపెరుగుతున్న అంతర్జాతీయ అనుసంధానత నేపథ్యంలోఈ చర్చల ద్వారా సమాజాలను తీర్చిదిద్దడంలో ఆవిష్కరణకు ప్రేరణనివ్వడంఅంతర్జాతీయ సహకారాన్ని ప్రోత్సహించడంఅనుభవాలుఅభిప్రాయాలుదృక్పథాలను పరస్పరం పంచుకునే అవకాశాన్ని కల్పించడంలో మీడియా పాత్రపై చర్చిస్తారు

ఇందులో భాగంగా బ్రిటన్రష్యాఇండోనేషియాకెన్యాభూటాన్ఈజిప్ట్ సహా 10 దేశాలతో పాటు ప్రపంచ మేధో సంపత్తి సంస్థ (డబ్ల్యూఐపీవోవంటి అంతర్జాతీయ సంస్థలతో భారత్ ద్వైపాక్షిక సమావేశాలు కూడా నిర్వహిస్తోందిప్రపంచ సహకారాన్ని బలోపేతం చేయడంపరస్పర ప్రయోజనాలకు సంబంధించిన కీలక రంగాల్లో భాగస్వామ్యాన్ని పెంపొందించడంలో భారత్ నిబద్ధతను ఈ కార్యకలాపాలు ప్రతిబింబిస్తాయి.

ఈ కార్యక్రమానికి గౌరవ విదేశీ వ్యవహారాల మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్,  గౌరవ రైల్వేసమాచార,  ప్రసారఎలక్ట్రానిక్స్ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి శ్రీ అశ్వనీ వైష్ణవ్,  సమాచారప్రసారపార్లమెంటరీ వ్యవహారాల సహాయ మంత్రి డాక్టర్ ఎల్మురుగన్ సహా సీనియర్ భారతీయ నాయకులు హాజరవుతారుఉన్నత స్థాయి ప్రముఖులు పాల్గొననుండడం బలమైనసమ్మిళితముందుచూపు కలిగిన ప్రపంచ మీడియా వాతావరణాన్ని పెంపొందించడానికి భారత్ నిబద్ధతను తెలియచేస్తోంది

 

***


Release ID: (Release ID: 2126016)   |   Visitor Counter: 20