సాంస్కృతిక మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఏప్రిల్ 18న ఐజీఎన్సీఏలో సంస్కృతిపై ప్రధాని ప్రసంగాల సంకలనం ‘సంస్కృతీ కా పాంచవ అధ్యాయ్’ ఆవిష్కరణ

Posted On: 16 APR 2025 5:01PM by PIB Hyderabad

సంస్కృతిపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ భావాలుఆయన ప్రసంగాల సంకలనం సంస్కృతీ కా పాంచవ అధ్యాయ్’ ఇప్పుడు పుస్తక రూపంలో పాఠకుల ముందుకు రాబోతోందిఏప్రిల్ 18 శుక్రవారం సాయంత్రం గంటలకు న్యూఢిల్లీలోని జనపథ్‌లో ఉన్న ఇందిరా గాంధీ జాతీయ కళా కేంద్రం (ఐజీఎన్సీఏ)లోని సంవేత్ ఆడిటోరియంలో ఈ పుస్తకాన్ని అధికారికంగా ఆవిష్కరించనున్నారు.

జునా అఖారా అధిపతి ఆచార్య మహామండలేశ్వర పూజ్యస్వామి అవధేశానంద గిరి మహారాజ్ ఈ పుస్తకాన్ని లాంఛనంగా ఆవిష్కరిస్తారుఈ కార్యక్రమానికి రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ శ్రీ హరివంశ్ అధ్యక్షత వహిస్తారుఐజీఎన్సీఏ చైర్మన్ శ్రీ రామ్ బహదూర్ రాయ్ గౌరవ అతిథిగా హాజరవుతారు.

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ భారతీయ సంస్కృతీ సంప్రదాయాలుఆధ్యాత్మిక విలువలుసాంస్కృతిక వారసత్వాన్ని చాటేలా వివిధ సందర్భాలలో చేసిన ప్రసంగాల సంకలనం సంస్కృతీ కా పాంచవ అధ్యాయ్ఈ పుస్తకానికి శ్రీ రామ్ బహదూర్ రాయ్ ముందుమాట రాయగాడాక్టర్ ప్రభాత్ ఓజా సంకలనం చేశారుప్రభాత్ ప్రకాశన్ ఈ పుస్తకాన్ని ప్రచురించింది.  

 

***


(Release ID: 2122272)