ప్రధాన మంత్రి కార్యాలయం
14 ఏళ్ల కిందట ప్రతినబూనిన శ్రీ రాంపాల్ కశ్యప్తో ముచ్చటించిన ప్రధానమంత్రి
Posted On:
14 APR 2025 7:03PM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు హర్యానాలోని యమునా నగర్ పరిధిలోగల కైతాల్లో శ్రీ రాంపాల్ కశ్యప్ను కలుసుకున్నారు. తాను ప్రధాని కావాలని, ఆ తర్వాత తనను కలిసేదాకా పాదరక్షలు ధరించబోనని కశ్యప్ 14 ఏళ్ల కిందట ప్రతిజ్ఞ చేసిన సంగతి తెలుసుకుని శ్రీ మోదీ గౌరవ పూర్వకంగా స్పందించారు. సామాజిక సేవ, దేశ ప్రగతి సంబంధిత అర్థవంతమైన కార్యకలాపాలపై పౌరులు తమ శక్తిసామర్థ్యాలను కేంద్రీకరించాలని సూచించారు.
దీనిపై సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ ద్వారా పంపిన మరో సందేశంలో:
“యమునానగర్లో నేటి బహిరంగ సభ సందర్భంగా కైతాల్ వాస్తవ్యులు శ్రీ రాంపాల్ కశ్యప్ గారిని నేను కలిశాను. నేను ప్రధానమంత్రి కావాలని, అటుపైన నన్ను కలిసేదాకా పాదరక్షలు ధరించబోనంటూ ఆయన 14 ఏళ్ల కిందట శపథం చేశారట!
రాంపాల్ జీ వంటివారికి నా సవినయ వందనాలు. నాపై వారి ఆప్యాయతానురాగాలను స్వాగతిస్తున్నాను. అయితే, ఇటువంటి ప్రతినలు చేసే ప్రతి ఒక్కరికీ ఇదే నా అభ్యర్థన- మీ ప్రేమాభిమానాలకు హృదయపూర్వక కృతజ్ఞతలు. దయచేసి సామాజిక సేవ, దేశ ప్రగతితో ముడిపడిన అర్థవంతమైన కార్యకలాపాల కోసం మీ శక్తిసామర్థ్యాలను కేంద్రీకరించండి!” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
(Release ID: 2121689)
Visitor Counter : 18