ప్రధాన మంత్రి కార్యాలయం
మహావీర్ జయంతి సందర్భంగా భగవాన్ మహావీర్కు ప్రధానమంత్రి నివాళులు
Posted On:
10 APR 2025 8:44AM by PIB Hyderabad
మహావీర్ జయంతి ఈ రోజు. ఈ సందర్భంగా భగవాన్ మహావీర్కు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నివాళులర్పించారు. భగవాన్ మహావీర్ సదా అహింసకూ, సత్యానికీ, కరుణకూ ప్రాధాన్యాన్నిచ్చారనీ, ఆయన ఆదర్శాలు ప్రపంచవ్యాప్తంగా ఎందరో ప్రజలకు శక్తిని ప్రసాదిస్తున్నాయనీ శ్రీ మోదీ అన్నారు. ప్రాకృత భాషకు ప్రభుత్వం కిందటేడాది ప్రాచీన భాష హోదాను ఇచ్చిందనీ, ఈ నిర్ణయానికి ప్రశంసలు లభించాయనీ ఆయన అన్నారు.
‘‘ఎక్స్’’లో ప్రధాని ఒక సందేశాన్ని పొందుపరుస్తూ ఇలా పేర్కొన్నారు:
‘‘మనమందరం భగవాన్ మహావీర్కు ప్రణామం చేద్దాం. అహింస, సత్యం, కరుణ ముఖ్యమని ఆయన చెప్పేవారు. ఆయన ఆదర్శాలు ప్రపంచమంతటా అసంఖ్యాక మంది ప్రజలకు శక్తినిస్తున్నాయి. ఆయన బోధనలను జైన సముదాయం చక్కగా సంరక్షించడంతోపాటు బహుళ ప్రజాదరణకు పాత్రమయ్యేటట్లు శ్రద్ధ వహించింది. వారు భగవాన్ మహావీర్ నుంచి ప్రేరణను పొంది, జీవనంలోని విభిన్న రంగాల్లో రాణించడమే కాకుండా సామాజిక శ్రేయానికి తమ వంతు తోడ్పాటును కూడా అందించారు.
భగవాన్ మహావీర్ కన్న కలలను నిజం చేయడానికి మా ప్రభుత్వం సదా కృషి చేస్తూ ఉంటుంది. కిందటి సంవత్సరం, మేం ప్రాకృత భాషకు ప్రాచీన హోదాను ఇచ్చాం... ఈ నిర్ణయానికి సర్వత్రా ప్రశంసలు లభించాయి.’’
***
(Release ID: 2120754)
Visitor Counter : 17
Read this release in:
Assamese
,
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam