ఆర్థిక మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

నాలుగో దశలో 26 ఆర్ఆర్బీల విలీనం: ప్రకటించిన ఆర్థిక సేవల విభాగం

प्रविष्टि तिथि: 08 APR 2025 2:31PM by PIB Hyderabad

వన్ స్టేట్వన్ ఆర్ఆర్బీ” విధానం కింద 26 గ్రామీణ బ్యాంకులను (ఆర్ ఆర్ బీవిలీనం చేస్తున్నట్లు ఆర్థిక సేవల విభాగం (డీఎఫ్ఎస్ప్రకటన జారీ చేసిందిఆర్ఆర్బీల విలీనంలో ఇది నాలుగో దశ.

గత విలీనాల వల్ల పనితీరు మెరుగైనట్లు గుర్తించడంతో 2024 నవంబరులో తాజా విలీన ప్రణాళికను ప్రకటించిన ఆర్థిక మంత్రిత్వశాఖభాగస్వామ్య పక్షాలతో సంప్రదింపులను ఏర్పాటు చేసిందిసంప్రదింపుల అనంతరం పది రాష్ట్రాలుఒక కేంద్రపాలిత ప్రాంతంలోని 26 ఆర్ఆర్బీల విలీన ప్రక్రియను పూర్తి చేశారుసామర్థ్య పెంపుఖర్చు హేతుబద్ధీకరణ ఈ విలీనాల ప్రధాన లక్ష్యం.

ప్రస్తుతం 26 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల్లో 43 ఆర్ఆర్బీలు కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయివిలీన ప్రక్రియ తుది దశ పూర్తయితే 26 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల్లోని 700 జిల్లాల్లో 22,000 శాఖలతో మొత్తం 28 ఆర్ఆర్బీలు పనిచేస్తాయిప్రాథమికంగా గ్రామీణ ప్రాంతాల్లో సేవలందించే ఈ బ్యాంకులుగ్రామీణపట్టణ శివారు ప్రాంతాల్లో 92 శాతం శాఖలను కలిగి ఉన్నాయి.   

ప్రస్తుతం చేపట్టిన విలీనాలు నాలుగో దశకి చెందినవితొలి దశలో (2006-2010 ఆర్థిక సంవత్సరాల కాలంఆర్ఆర్బీల సంఖ్య 196 నుంచు 82కుమలి దశలో (2013-2015 ఆర్థిక సంవత్సరాల కాలం) 82 నుంచి 56కుమూడో దశలో (2019-2021 ఆర్థిక సంవత్సరాల కాలం) 56 నుంచి 43కు వీటి సంఖ్యను కుదించారు.

గెజెట్ ప్రకటన ఇక్కడ.

***


(रिलीज़ आईडी: 2120053) आगंतुक पटल : 99
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Bengali , English , Urdu , Marathi , हिन्दी , Tamil