ప్రధాన మంత్రి కార్యాలయం
మాత అంబ ఆరాధనకు ప్రసిద్ధిగన్న నవరాత్రి పవిత్రత్వాన్ని మననం చేసుకొన్న ప్రధానమంత్రి
Posted On:
02 APR 2025 10:06AM by PIB Hyderabad
మాతా జగదాంబ ఆరాధనకు ప్రసిద్ధిగన్న నవరాత్రుల పవిత్రత్వాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు స్మరించుకొన్నారు. దేవీ మాత విభిన్న రూపాలకు అంకితం చేసిన ఒక ప్రార్థనగీతాన్ని ఆయన పంచుకొంటూ, ప్రతి ఒక్కరూ ఈ గీతాన్ని వినవలసిందిగా విజ్ఞప్తి చేశారు.
సామాజిక మాధ్యమం ఎక్స్లో ప్రధాని ఒక సందేశాన్ని పొందుపరుస్తూ:
‘‘నవరాత్రులలో మాత అంబను ఉపాసించడం భక్తజనులందరినీ భక్తిభావంలో ముంచెత్తుతుంది. దేవీ మాత స్వరూపాలకు అంకితం చేసిన ఈ స్తుతి గీతం ఒక అలౌకిక అనుభూతిని ప్రసాదిస్తోంది. మీరూ వినండి..’’ అని ఆ సందేశంలో పేర్కొన్నారు.
***
MJPS/SR
(Release ID: 2117637)
Read this release in:
Assamese
,
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam