జల శక్తి మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

పార్లమెంటులో ప్రశ్న: జలజీవన్ మిషన్ ప్రగతి – తాజా వివరాలు

प्रविष्टि तिथि: 24 MAR 2025 12:13PM by PIB Hyderabad

దేశంలోని ప్రతి గ్రామీణ కుటుంబానికీ తాగునీరు అందించాలన్న సంకల్పంతో భారత ప్రభుత్వం 2019 ఆగస్టు నుంచీ జల జీవన్ మిషన్ (జేజేఎం)- హర్ ఘర్ జల్ పేరిటరాష్ట్రాల సహకారంతో ఒక వినూత్న పథకాన్ని మొదలుపెట్టిందిప్రతి ఇంటికీ రోజుకి 55 లీటర్ల మేరనిర్దేశిత నాణ్యతతో కూడిన (బీఐఎస్:10500) తాగు నీటిని నల్లా కనెక్షన్ల ద్వారా అందించాలన్నది ఈ దీర్ఘకాలిక పథకం లక్ష్యం.

పథకం ప్రారంభం నాటికి దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో కేవలం 3.23 కోట్ల (16.7%) ఇళ్ళకే కుళాయి కనెక్షన్లు ఉన్నట్లు వెల్లడైందిజేజేఎం ద్వారా మరో 12.30 కోట్ల గృహాలకి తాగునీటి సౌకర్యం కల్పించినట్లు రాష్ట్రాలుకేంద్రపాలిత ప్రాంతాల నుంచీ అందిన నివేదికలు వెల్లడిస్తున్నాయి. 17.03.2025 నాటికి దేశంలోని మొత్తం 19.36 కోట్ల గ్రామీణ గృహాల్లో దాదాపు 15.53 కోట్ల ఇళ్ళలో (80.20 శాతం), గృహావసారాలు సహా ఇతర అవసరాలకు కూడా నీటి సౌకర్యం లభిస్తుంది.

మిగతా 3.83 కోట్ల కుటుంబాలకి ఆయా రాష్ట్రాలకేంద్రపాలిత ప్రాంతాల కోటాను అనుసరించినీటి కనెక్షన్లు అందించే పనులు కొనసాగుతున్నాయి – ఈ పనులు వివిధ దశల్లో ఉన్నాయి.

పథకానికి సంబంధించి తొలి అంచనా వ్యయం రూ. 3.60 లక్షల కోట్లు కాగా కేంద్ర ప్రభుత్వ వాటా రూ. 2.08 లక్షల కోట్లుకేంద్ర మంత్రివర్గం ఆమోదించిన కేంద్ర నిధులను దాదాపు సంపూర్ణంగా వినియోగించారుకేంద్ర ఆర్థిక మంత్రి 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి చేసిన బడ్జెట్ ప్రసంగంలో జల జీవన్ మిషన్ పథకాన్ని 2028 వరకూ  పొడిగిస్తున్నట్లు,  తదనుగుణంగా కేటాయింపులు పెంచుతున్నట్లు ప్రకటించారు.  

తాగునీరు రాష్ట్రాల జాబితాలోనిది కావడంతో రాష్ట్రాలుకేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వాలు తాగునీటి పథకాల రూపకల్పన, వాటికి ఆమోదాలు, అమలు, నిర్వహణ తదితరాలను చేపట్టే అధికారం కలిగి ఉంటాయినల్లా కనెక్షన్లు సక్రమంగా పనిచేస్తున్నట్లుఅందించే నీరు జేజేఎం నాణ్యతా ప్రమాణాలకు(బీఐఎస్:10500) అనుగుణమైందని ధృవీకరించాలనిరాష్ట్రాలుకేంద్రపాలిత ప్రాంతాలకు వివిధ సమీక్షా సమావేశాలుఫీల్డ్ విజిట్ల ద్వారా తెలియచేశారు.

రాష్ట్రాలుకేంద్ర పాలిత ప్రాంతాలకు చేసే కేటాయింపుల్లో శాతాన్ని  వివిష పరీక్షా ప్రక్రియలుసాధనాల కోసం ప్రత్యేకించారునీటి నాణ్యత పర్యవేక్షణనిఘా (డబ్ల్యూక్యూఎం అండ్ ఎస్కార్యకలాపాలు వివిధ స్థాయుల్లో నీటి నాణ్యత ప్రయోగశాలలను ఏర్పాటు చేయడంఇప్పటికే ఉన్న వాటిని ఆధునీకరించడంప్రయోగశాలలకు రసాయనాలువినియోగ వస్తువులను అందించడంపరికరాలుసాధనాలురీయేజెంట్లు,  రసాయనాలుఎఫ్టీకేల సేకరణరసాయనాలుక్లోరైడ్‌ సహా క్షేత్రస్థాయిలో బ్యాక్టీరియలాజికల్ నీటి నాణ్యత పర్యవేక్షణ కోసం హెచ్2ఎస్ నాళికలు,  ఎన్ఏబీఎల్ అక్రిడిటేషన్ప్రయోగశాలల గుర్తింపు మొదలైన వాటి కోసం ఈ నిధులను వినియోగిస్తారు.

ఎఫ్‌టికెలు/బ్యాక్టీరియాలజికల్ పరీక్షా నాళికలను ఉపయోగించి ప్రత్యేకమైన స్థానిక అవసరాలకు తగినట్లు ఆర్సెనిక్ఫ్లోరైడ్‌ సహా సాధారణ ప్రమాణాల పరీక్షలను చేపట్టాలని రాష్ట్రాలకు సూచించారుపాఠశాలలుఅంగన్‌వాడీలుగ్రామ పంచాయితీ (జీపీస్థాయిలో నీటి నాణ్యతను పరీక్షించి కలుషిత నీటి ద్వారా ఉత్పన్నమయ్యే సమస్యలను గుర్తించాలని సూచించారుఆయా పరికరాల ద్వారా నీటిని పరీక్షించేందుకు రాష్ట్రాలు స్థానికంగా అయిదుగురు  మహిళలను గుర్తించి వారికి శిక్షణనిస్తాయి.

గృహాలకు అందించే నీరు తగిన నాణ్యతతో కూడినదని నిర్ధారించేందుకు ఎప్పటికప్పుడు పరీక్షలు నిర్వహించాలనిఅవసరాన్ని బట్టి తగిన శుద్ధి చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలుకేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్రం సూచించింది.

రాష్ట్రాలుకేంద్రపాలిత ప్రాంతాలు ప్రయోగశాలల్లోఫీల్డ్ టెస్ట్ కిట్ల ద్వారా చేపట్టిన తాగునీటి శాంపిళ్ళ పరీక్షల వివరాలుసంవత్సరాల వారీగా.. ఈ వివరాలు గత సంవత్సరం నుంచీ 17.03.2025 వరకు చేసిన పరీక్షలకు సంబంధించినవి.

Year

No. of samples tested

Total no. of Samples Tested

in labs

using FTKs

2023-24

75,00,041

1,08,54,196

1,83,54,237

2024-25

77,40,369

90,52,382

1,67,92,751

 

లోక్ సభకు ఈరోజు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో కేంద్ర జలశక్తి శాఖ సహాయ మంత్రి శ్రీ వీ సోమన్న ఈ వివరాలను వెల్లడించారు.

 

***


(रिलीज़ आईडी: 2114364) आगंतुक पटल : 52
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Manipuri , Bengali , Tamil