ఉప రాష్ట్రపతి సచివాలయం
జమ్మూలో 2025 ఫిబ్రవరి 15న ఉపరాష్ట్రపతి పర్యటన
శ్రీ మాతా వైష్ణో దేవి విశ్వవిద్యాలయం పదో స్నాతకోత్సవం ముఖ్య అతిథిగా ఉపరాష్ట్రపతి
నాడు పోస్టు చేయడమైనది:
13 FEB 2025 3:41PM by PIB Hyderabad
ఉపరాష్ట్రపతి శ్రీ జగ్దీప్ ధన్ఖడ్ 2025 ఫిబ్రవరి 15న జమ్మూ, కాశ్మీర్లోని జమ్మూను సందర్శించనున్నారు.
ఆయన ఒక రోజు పర్యటనలో భాగంగా శ్రీ మాతా వైష్ణో దేవి విశ్వవిద్యాలయం (ఎస్ఎంవీడీయూ) 10వ స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరై, ఆ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తారు. స్నాతకోత్సవాన్ని ఎస్ఎంవీడీయూ కేంపస్లోని మాతృక ఆడిటోరియంలో ఏర్పాటు చేశారు.
ఉపరాష్ట్రపతి మాతా వైష్ణో దేవి ఆలయాన్నీ, భైరోన్ జీ ఆలయాన్నీ సందర్శించనున్నారు.
(రిలీజ్ ఐడి: 2102821)
సందర్శకుల సూచీ సంఖ్య : : 64