ప్రధాన మంత్రి కార్యాలయం
జీ20 సదస్సు, భారత్ అధ్యక్షతపై శ్రీ అమితాబ్ కాంత్ పుస్తకం: ప్రధాని ప్రశంస
Posted On:
21 JAN 2025 3:44PM by PIB Hyderabad
2023లో జరిగిన జీ 20 సదస్సు, దానికి భారత్ అధ్యక్షత వహించడం గురించి పుస్తకం రాసేందుకు శ్రీ అమితాబ్ కాంత్ చేసిన కృషిని ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ ప్రశంసించారు. మానవాళికి ఈ భూమండలం మరింత ప్రయోజనాన్ని చేకూర్చేలన్న ఉద్దేశంతో భారత్ చేస్తున్న ప్రయత్నాలను ఈ పుస్తకంలో స్పష్టంగా తెలియజేశారని శ్రీ అమితాబ్ కాంత్ ను ప్రధాని కొనియాడారు.
శ్రీ అమితాబ్ కాంత్ ఎక్స్ లో చేసిన పోస్టుపై శ్రీ మోదీ స్పందిస్తూ:
‘‘2023లో జరిగిన జీ20 శిఖరాగ్ర సమావేశం, దానికి భారత్ అధ్యక్షత వహించడం గురించి రాసేందుకు మీరు చేసిన కృషి అభినందనీయం, ఈ భూమండలం వల్ల మానవాళి మరింత ప్రయోజనం పొందేలా భారత్ చేస్తున్న యత్నాలను ఈ పుస్తకంలో స్పష్టంగా తెలియజేశారు @amitabhk87’’
***
MJPS/SR
(Release ID: 2095856)
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam