ప్రధాన మంత్రి కార్యాలయం
దేశవ్యాప్తంగా దివ్యాంగ సోదరసోదరీమణుల మర్యాద, ఆత్మగౌరవ రక్షణకు మా ప్రభుత్వం కట్టుబడి ఉంది: ప్రధానమంత్రి
Posted On:
03 DEC 2024 7:09PM by PIB Hyderabad
అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా స్వయంగా తాను రాసిన కథనాన్ని ప్రధానమంత్రి పంచుకున్నారు.
అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం సందర్భంగా తానే స్వయంగా రాసిన కథనాన్ని పంచుకున్న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దేశవ్యాప్తంగా ఉన్న దివ్యాంగ సోదరసోదరీమణుల మర్యాద, ఆత్మగౌరవాన్ని రక్షించేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని హామీ ఇచ్చారు.
ఎక్స్లో పంచుకున్న పోస్టు : ‘‘దేశవ్యాప్తంగా ఉన్న దివ్యాంగ సోదరసోదరీమణుల మర్యాద, ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. గత పదేళ్లలో వారి సంక్షేమానికి అనుసరిస్తున్న విధానాలు, నిర్ణయాలే దీనికి ప్రత్యక్ష నిదర్శనం. ఈ రోజు అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా నా ఈ కొన్ని మాటలు వారికి అంకితం ’’
***
MJPS/SR
(Release ID: 2080441)