రాష్ట్రప‌తి స‌చివాల‌యం
azadi ka amrit mahotsav

రాయ్ పూర్ ఎయిమ్స్ స్నాతకోత్సవానికి హాజరైన రాష్ట్రపతి

నాడు పోస్టు చేయడమైనది: 25 OCT 2024 2:35PM by PIB Hyderabad

రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఈరోజు (అక్టోబర్ 25) రాయ్ పూర్ అఖిల భారత వైద్యవిజ్ఞాన సంస్థ (ఎయిమ్స్రెండో స్నాతకోత్సవానికి హాజరయ్యారుఈ సందర్భంగా ప్రసంగించిన ముర్ముతక్కువ ఖర్చులో వైద్య విద్యనాణ్యమైన ఆరోగ్య సేవలను అందించడంలో ఎయిమ్స్ సంస్థలు ముందున్నాయని ప్రశంసించారుప్రజల విశ్వాసాన్ని చూరగొన్న ఈ సంస్థల్లో వైద్యం నిమిత్తం దేశం నలుమూలల నుంచీ ప్రజలు వస్తారని రాష్ట్రపతి తెలియచేశారుసంస్థ ప్రారంభించిన కొద్ది కాలంలోనే రాయ్ పూర్ ఎయిమ్స్ మంచి పేరు తెచ్చుకుందని ఆనందం వ్యక్తం చేశారుప్రజారోగ్యంప్రజాసంక్షేమం కోసం అనేక చర్యలు తీసుకుంటున్న సంస్థరానున్న రోజుల్లో సంక్షేమ కార్యకలాపాలను విస్తరించగలదన్న విశ్వాసాన్ని వెలిబుచ్చారు.

ఉన్నత వర్గాలకు అనేక అవకాశాలు ఉండొచ్చు.. అయితేదిగువ వర్గాల ఆశలు మాత్రం ఉన్నత వర్గాలపైన ఉంటాయని చెప్పారుప్రజలందరికీ సేవ చేసే బాధ్యత గల వైద్యులుబీదసాదల పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపాలని వైద్యులకు సూచించారు.

వైద్య రంగానికి చెందిన వారి పని ఎంతో బాధ్యతాయుతమైనదనీవారు తీసుకునే నిర్ణయాలు ప్రాణాలను కాపాడతాయనీ చెప్పారువిధుల్లో భాగంగా వైద్యులు సహజంగా అనేక సవాళ్ళను ఎదుర్కొంటారనీఅందువల్ల భావోద్వేగాలను నియంత్రించుకునేందుకు ప్రయత్నించాలనీ సూచించారు.

విద్యార్థి దశ నుంచీ ఉద్యోగులయ్యే దశ కీలకమైనదనీఅయితే వృత్తి ప్రారంభించిన అనంతరం కూడా జ్ఞానాన్ని పెంచుకునే ప్రయత్నాలు కొనసాగించాలనీనిరంతర జ్ఞాన దాహం ఎంతో లబ్ధి చేకూర్చగలదని వైద్య విద్యార్థులకు రాష్ట్రపతి సూచించారు.

రాష్ట్రపతి ప్రసంగ పాఠం:

Please click here to see the President's Speech - 

 

****


(రిలీజ్ ఐడి: 2068301) సందర్శకుల సూచీ సంఖ్య : : 80
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Marathi , Bengali , Punjabi , Gujarati , Tamil , Kannada , Malayalam