ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

హర్యానాలోని కైతాల్‌ వద్ద రోడ్డు ప్రమాదంలో ప్రాణనష్టంపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపం

Posted On: 12 OCT 2024 1:48PM by PIB Hyderabad

   హర్యానాలోని కైతాల్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణ నష్టంపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రగాఢ సంతాపం తెలిపారు.

దీనిపై ప్రధానమంత్రి కార్యాలయం సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ ద్వారా పంపిన సందేశంలో:

   ‘‘హర్యానాలోని కైతాల్‌లో రోడ్డు ప్రమాదం జరగడం హృదయ విదారకం. ఈ దుర్ఘటనలో ఆత్మీయులను కోల్పోయిన కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ఆ దైవం వారికి ఆవేదనను తట్టుకునే శక్తినివ్వాలని ప్రార్థిస్తున్నాను. ఈ సంఘటనపై రాష్ట్ర ప్రభుత్వ పర్యవేక్షణలో స్థానిక పాలన యంత్రాంగం తక్షణం రక్షణ-సహాయ చర్యలు చేపట్టింది.’’ అని ప్రధాని ప్రకటించినట్లు పేర్కొంది.

*****

MJPS/TS



(Release ID: 2064595) Visitor Counter : 14