ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav g20-india-2023

మహారాష్ట్రలోని వాషిమ్‌లో రూ.23,300 కోట్ల విలువైన వ్యవసాయ-పశుసంవర్ధక రంగ కార్యక్రమాలకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శ్రీకారం


‘పిఎం-కిసాన్’ సమ్మాన్ నిధి 18వ విడత కింద 9.4 కోట్ల మంది రైతులకు దాదాపు రూ.20,000 కోట్లు పంపిణీ;

సుమారు రూ. 2,000 కోట్లతో ‘నమో షేత్కారీ మహాసన్మాన్ నిధి యోజన’ 5వ విడత ప్రారంభం;

వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధి (ఎఐఎఫ్) కింద రూ.1,920 కోట్ల విలువైన 7,500కుపైగా ప్రాజెక్టులు దేశానికి అంకితం;

సుమారు రూ.1,300 కోట్ల సమష్టి టర్నోవర్‌గల 9,200 రైతు ఉత్పత్తిదారు సంస్థలు (ఎఫ్‌పిఒ) జాతికి అంకితం;

పశుగణాభివృద్ధి దిశగా ఏకీకృత జీనోమిక్ చిప్‌తోపాటు జాతి-లింగ ఎంపికపై దేశీయ పశువీర్య సాంకేతిక పరిజ్ఞానం ప్రారంభం;

మహారాష్ట్రలో ‘ముఖ్యమంత్రి సౌర కృషి వాహిని యోజన 2.0’ కింద 19 మెగావాట్ల ఉత్పాదక సామర్థ్యంగల అయిదు సౌర పార్కులు జాతికి అంకితం;

బంజారా విరాసత్ ప్రదర్శనశాలకు ప్రారంభోత్సవం;

దేశ సామాజిక జీవనంలో... భారత ప్రగతి పయనంలో మన బంజారా సమాజం కీలక పాత్ర పోషించింది: ప్రధానమంత్రి;

భారత ఆధ్యాత్మిక చైతన్యానికి అపారమైన శక్తిని జోడించిన అనేకమంది సాధువులను మనకు అందించింది బంజారా సమాజమే: ప్రధానమంత్రి

Posted On: 05 OCT 2024 2:38PM by PIB Hyderabad

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ మహారాష్ట్రలోని వాషిమ్‌లో రూ.23,300 కోట్ల విలువైన వ్యవసాయ-పశుసంవర్ధక రంగ కార్యక్రమాలను ప్రధానమంత్రి ప్రారంభించారుఇందులో భాగంగా ‘పిఎం-కిసాన్ నిధి’ 18వ విడత నిధుల పంపిణీతోపాటు నమో షేత్కారీ మహాసన్మాన్ నిధి యోజన’ 5వ విడతకు శ్రీకారం చుట్టారుఅలాగే వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధి (ఎఐఎఫ్కింద 7,500కుపైగా ప్రాజెక్టులను, 9,200 రైతు ఉత్పత్తిదారు సంస్థలు సహా మహారాష్ట్రలో 19 మెగావాట్ల ఉత్పాదక సామర్థ్యంగల అయిదు సౌర పార్కులను దేశానికి అంకితం చేశారుఅంతేకాకుండా పశుగణాభివృద్ధి దిశగా ఏకీకృత జీనోమిక్ చిప్‌తోపాటు జాతి-లింగ ఎంపికపై దేశీయ పశువీర్య సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రధాని ప్రారంభించారు.

ఈ సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ మోదీతొలుత పవిత్ర వాషిమ్ గడ్డ మీది నుంచి పోహ‌రాదేవి మాత‌కు నమస్కరించిప్రసంగం ప్రారంభించారుఈ తెల్లవారుజామున జగదాంబ ఆలయంలో మాత దర్శనం-పూజలు చేసినట్లు తెలిపారుఅలాగే సంత్ సేవాలాల్ మహారాజ్సంత్ రామ్‌రావ్ మహారాజ్ సమాధుల వద్ద శ్రద్ధాంజలి ఘటించడం ద్వారా గౌరవిస్తూవారి ఆశీస్సులు పొందానని పేర్కొన్నారుఅసాధారణ గోండ్వానా యోధురాలు రాణి దుర్గావతి జన్మతిథిని స్మరించుకుంటూ గత సంవత్సరం దేశం ఆమె 500వ జయంతి వేడుకలు నిర్వహించుకున్నదని గుర్తుచేశారు.

హర్యానాలో ఇవాళ శాసనసభ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో రాష్ట్ర ప్రజలంతా పెద్ద సంఖ్యలో ఓటు హక్కు వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారుహర్యానాను సరికొత్త శిఖరాలకు చేర్చగల శక్తి వారి ఓటుకు ఉందని వ్యాఖ్యానించారు.

పిఎం-కిసాన్’ సమ్మాన్ నిధి కింద దాదాపు 9.5 కోట్ల మంది రైతులకు 18వ విడతగా  సుమారు రూ.20,000 కోట్లు పంపిణీ చేయడాన్ని ఆయన ప్రముఖంగా ప్రస్తావించారురాష్ట్రంలోని రైతులకు రెట్టింపు ప్రయోజనాలు కల్పించేందుకు ఇక్కడి ప్రభుత్వం కృషి చేస్తుందని ప్రధానమంత్రి అన్నారుఅలాగే రాష్ట్రంలోని దాదాపు 90 లక్షల మంది రైతులకు రూ.1900 కోట్ల మేర ఆర్థిక సహాయం అందించిన ‘నమో షెత్కారీ మహాసన్మాన్ నిధి యోజన’ గురించి కూడా ఆయన ప్రస్తావించారురైతు ఉత్పత్తిదారు సంస్థ (ఎఫ్‌పిఒ)లకు సంబంధించి రూ.వందల కోట్ల విలువైన పలు ప్రాజెక్టులను జాతికి అంకితమివ్వడాన్ని గుర్తుచేశారుమరోవైపు ‘లడ్కీ బహిన్ యోజన’ లబ్ధిదారులకు సహాయం పంపిణీని ప్రస్తావిస్తూఈ పథకం నారీలోకం శక్తి సామర్థ్యాలను బలోపేతం చేస్తోందని ప్రధానమంత్రి స్పష్టం చేశారునేడు ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడంజాతికి అంకితం చేయడంపై మహారాష్ట్రతోపాటు దేశ ప్రజలందరికీ శ్రీ మోదీ అభినందనలు తెలిపారు.

పోహరాదేవిలో ఇవాళ ‘బంజారా విరాసత్ మ్యూజియం’ ప్రారంభోత్సవాన్ని ప్రస్తావిస్తూ-  బంజారా సమాజం ప్రాచీన సంస్కృతిసుసంపన్న వారసత్వాన్ని ఈ ప్రదర్శనశాల భవిష్యత్తరానికి పరిచయం చేయగలదని ఆశాభావం వ్యక్తం చేశారుఇక్కడి బంజారా సమాజంతో తన సంభాషణను గుర్తు చేసుకుంటూ ఈ మ్యూజియం ప్రారంభంతో తమ వారసత్వానికి లభించిన గుర్తింపుపై వారి వదనాల్లో సంతృప్తిగర్వం తొణికిసలాడటం తాను గమనించానని పేర్కొన్నారుబంజారా వారసత్వ మ్యూజియం ప్రారంభంపై ఆ సామాజికవర్గ సభ్యులకు శ్రీ మోదీ అభినందనలు తెలిపారు.

దేశానికి బంజారా సమాజం అందించిన సేవలను కొనియాడుతూ- ‘‘భారత సామాజిక జీవనంలోనే కాకుండా దేశ ప్రగతి ప్రయాణంలో కూడా మన బంజారా సమాజం కీలక పాత్ర పోషించింది’’ అని గుర్తుచేశారుకళసంస్కృతిఅధ్యాత్మికతవాణిజ్యం సహా విభిన్న రంగాల్లో దేశం ప్రగతి సాధించడంలో ఆ సమాజం చూపిన పునరుత్థాన సామర్థ్యాన్నిదాని అమూల్య పాత్రను ఆయన ప్రశంసించారుబంజారా సమాజంలో ప్రసిద్ధుడైన రాజా లఖి షా బంజారా వంటి పలువురు చారిత్రక నాయకులకు శ్రీ మోదీ నివాళి అర్పించారుపరాయి పాలనలో అంతులేని కష్టానష్టాలకు గురైనప్పటికీ సమాజ సేవకే వారు జీవితాన్ని అంకితం చేశారన్నారుఅలాగే దేశ అధ్యాత్మిక చైతన్యానికి అపరిమిత శక్తిని జోడించిన సంత్ సేవాలాల్ మహారాజ్స్వామి హథీరామ్ జీసంత్ ఈశ్వరసింగ్ బాపూజీసంత్ లక్ష్మణ్ చైత్యన్ బాపూజీ వంటి ఇతర అధ్యాత్మిక నాయకులను కూడా ఆయన స్మరించుకున్నారుఈ సందర్భంగా- ‘‘భారత ఆధ్యాత్మిక చైతన్యానికి అపారమైన శక్తిని జోడించిన అనేకమంది సాధువులను మనకు అందించింది బంజారా సమాజమే’’ అని ప్రధాని వ్యాఖ్యానించారుశతాబ్దాలుగా దేశ సాంస్కృతిక వారసత్వాన్ని ఇనుమడింపజేయడంతోపాటు పరిరక్షించడంలో వారి అవిరళ కృషిని కొనియాడారుదేశ స్వాతంత్ర్య పోరాటం సందర్భంగా బంజారా సమాజం మొత్తాన్నీ  బ్రిటిష్ పాలకులు నేరస్థులుగా ముద్ర వేయడం ఓ చారిత్రక అన్యాయమని విచారం వ్యక్తం చేశారు.

ప్ర‌స్తుత ప్ర‌భుత్వ కృషి నేపథ్యంలో మునుపటి ప్ర‌భుత్వాల వైఖరిని ప్రధానమంత్రి ప్ర‌జ‌ల‌కు గుర్తుచేశారుఈ మేరకు శ్రీ దేవేంద్ర ఫడణవీస్ ముఖ్యమంత్రిగా ఉన్నపుడు పోహరాదేవి ఆలయ అభివృద్ధి పనులు మొదలుకాగామహా అఘాడి ప్రభుత్వం నిలిపివేసిందని తెలిపారుఅయితేఇప్పుడు శ్రీ ఏక్‌నాథ్‌ షిండే నేతృత్వంలోని ప్రభుత్వం ఆ పనులను మళ్లీ ప్రారంభించిందని చెప్పారుఈ ప్రాజెక్టు కింద రూ.700 కోట్లు వెచ్చిస్తున్నట్లు తెలిపారుఈ ప్రాజెక్టు కింద చేపట్టిన పనుల ద్వారా ఈ పుణ్యక్షేత్రం అభివృద్ధితోపాటు యాత్రికులకు ప్రయాణ సౌలభ్యం కలుగుతుందన్నారుఅంతేగాక పరిసర ప్రాంతాల సత్వర ప్రగతికి కూడా ఇవి  దోహదం చేస్తాయని శ్రీ మోదీ వివరించారు.

దేశాభివృద్ధికిపురోగమనానికి ఎదురయ్యే ముప్పుల గురించి ప్రధానమంత్రి ప్రజలను అప్రమత్తం చేశారుఈ మేరకు ‘‘ప్రజల మధ్య ఐక్యత మాత్రమే అటువంటి సవాళ్ల నుంచి దేశాన్ని రక్షించగలదు’’ అని స్పష్టం చేశారుమాదకద్రవ్య వ్యసనందాని ప్రమాదకర పర్యవసానాలపై హెచ్చరిస్తూదీనిపై విజయం దిశగా సమష్టి పోరుకు కలసిరావాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

   ‘‘మా ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయంఅమలు చేసే ప్రతి విధానం వికసిత భారత్‌ స్వప్న సాకారానికి లోబడి ఉంటాయిఈ దార్శనికతకు మన రైతులే కీలక పునాది’’ అని ప్రధాని మోదీ అన్నారుకర్షకలోకానికి మరింత చేయూత అందించే దిశగా అమలు చేస్తున్న ప్రధాన కార్యక్రమాలను ఆయన వివరించారువ్యవసాయ ఉత్పత్తుల నిల్వశుద్ధినిర్వహణ సామర్థ్యాలను పెంచడంలో 9,200 రైతు ఉత్పత్తిదారు సంస్థల (ఎఫ్‌పిఒఅంకిత భావాన్ని ప్రస్తావించారుఅలాగే అనేక కీలక వ్యవసాయ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకూ ఇందులో భాగముందని చెప్పారువీటన్నిటి వల్ల రైతుల ఆదాయం పెరిగిందని పేర్కొన్నారు. ‘‘మహారాష్ట్రలో ప్రస్తుత ప్రభుత్వ పాలన ద్వారా రైతులు రెట్టింపు ప్రయోజనం పొందుతున్నారు’’ అని చెబుతూముఖ్యమంత్రి శ్రీ ఏక్‌నాథ్‌ షిండే ప్రభుత్వం రైతుల కోసం ‘జీరో విద్యుత్ బిల్లు’ విధానం అమలు చేయడాన్ని ప్రధాని ప్రశంసించారు.

   మహారాష్ట్రలోని విదర్భ ప్రాంత రైతులు దశాబ్దాలుగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ప్రధాని విచారం వెలిబుచ్చారుగత ప్రభుత్వాల నిర్వాకంతో రైతులు దుర్భర పేదరికంలో కూరుకుపోయారని వ్యాఖ్యానించారుమహాకూటమి ప్రభుత్వం రాష్ట్రంలో అధికారం చలాయించినంత కాలం రైతు సంబంధిత ప్రాజెక్టులు నిలిపేడయంఆ పనులలో అవినీతికి పాల్పడటం అనే రెండు కార్యక్రమాలే ధ్యేయంగా పెట్టుకున్నదని ఆరోపించారుకేంద్రం నుంచి అందే నిధులు లబ్ధిదారులకు చేరకుండా పక్కదోవ పట్టించారని శ్రీ మోదీ వ్యాఖ్యానించారుఇటువంటి దుస్థితిని ఎదుర్కొన్న రైతులకు ప్రస్తుత మహాయుతి ప్రభుత్వం నేడు కిసాన్ సమ్మాన్ నిధితోపాటు ప్రత్యేకంగా ఆర్థిక చేయూతనిస్తున్నదని పేర్కొన్నారుఇదే తరహాలో కర్ణాటకలో ‘బిజెపి’ ప్రభుత్వం ఉన్నపుడు కూడా ఇచ్చేదని చెప్పారుకానీప్రస్తుత కొత్త ప్రభుత్వం ఆ కార్యక్రమానికి స్వస్తి చెప్పిందని ప్రధాని అన్నారుమరోవైపు రుణమాఫీ చేస్తామన్న ఎన్నికల హామీ నెరవేర్చకపోవడంపై తెలంగాణ రైతులు రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారని శ్రీ మోదీ అన్నారు.

   గత ప్రభుత్వ పాలనలో నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణంలో జాప్యాన్ని ప్రధానమంత్రి  ప్రజలకు గుర్తుచేశారుప్రస్తుత ప్రభుత్వం వచ్చిన తర్వాతే పనులు శరవేగంగా సాగుతున్నాయని తెలిపారుఈ మేరకు అమరావతియావత్మల్అకోలాబుల్దానావాషిమ్నాగ్‌పూర్వార్ధాలలో నీటి కొరతను తీర్చేందుకు దాదాపు రూ.90,000 కోట్లతో వైనగంగ-నల్‌గంగ నదుల అనుసంధాన ప్రాజెక్టును ఆమోదించిందని పేర్కొన్నారుపత్తిసోయాబీన్‌ సాగుచేసే రైతులకు రాష్ట్ర ప్రభుత్వం రూ.10 వేల వంతున ఆర్థిక సాయం అందజేయడాన్ని ఆయన గుర్తు చేశారుమరోవైపు ఇటీవలే అమరావతిలో టెక్స్‌ టైల్ పార్కుకు శంకుస్థాపన చేశారనిదీనివల్ల పత్తి రైతులకు ఎంతో మేలు కలుగుతుందని చెప్పారు.

   దేశ ఆర్థిక ప్రగతికి నాయకత్వం వహించగల అపార శక్తిసామర్థ్యాలు మహారాష్ట్రకు ఉన్నాయని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారుదేశంలోని పేదలురైతులుకార్మికులుదళితులుఅణగారిన వర్గాల సాధికారత దిశగా బలమైన కృషి ద్వారానే అది నెరవేరగలదని చెప్పారుచివరగా, ‘వికసిత మహారాష్ట్రతోపాటు వికసిత భారత్ స్వప్నం సాకారం కాగలదని దృఢ విశ్వాసాన్ని వ్యక్తం చేస్తూ ఆయన తన ప్రసంగం ముగించారు.

   ఈ కార్యక్రమంలో మహారాష్ట్ర గవర్నర్ శ్రీ సి.పి.రాధాకృష్ణన్ముఖ్యమంత్రి శ్రీ ఏక్‌నాథ్‌ షిండేఉప ముఖ్యమంత్రులు శ్రీ దేవేంద్ర ఫడణవీస్శ్రీ అజిత్ పవార్కేంద్ర వ్యవసాయ-రైతు సంక్షేమమత్స్యపశుసంవర్ధక-పాడి పరిశ్రమాభివృద్ధి శాఖల మంత్రులు శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్శ్రీ రాజీవ్ రంజన్ తదితరులు పాల్గొన్నారు.

నేపథ్యం

రైతులకు సాధికారత కల్పనపై తన నిబద్ధతకు అనుగుణంగా ప్రధానమంత్రి పిఎం-కిసాన్’ సమ్మాన్ నిధి 18వ విడత కింద 9.4 కోట్లమంది రైతులకు దాదాపు రూ.20,000 కోట్లు పంపిణీ చేశారుదీంతో ఈ పథకం కింద ఇప్పటిదాకా పంపిణీ చేసిన నిధులు రూ.3.45 లక్షల కోట్లకు చేరాయిమరోవైపు సుమారు రూ.2,000 కోట్లతో ‘నమో షేత్కారీ మహాసన్మాన్ నిధి యోజన’ 5వ విడతను ప్రారంభించారు.

అలాగే వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధి (ఎఐఎఫ్కింద రూ.1,920 కోట్ల విలువైన 7,500కుపైగా ప్రాజెక్టులను ప్రధానమంత్రి జాతికి అంకితం చేశారువీటిలో ‘‘నిర్దిష్ట పరికరాలు అద్దెకిచ్చే కేంద్రాలుప్రాథమిక ప్రాసెసింగ్ యూనిట్లుగిడ్డంగులువేరుపరచి-వర్గీకరించే యూనిట్లుశీతల గిడ్డంగులుపంట అనంతర నిర్వహణ ప్రాజెక్టులు వంటి కీలక ప్రాజెక్టులున్నాయిఇక సుమారు రూ.1,300 కోట్ల సమష్టి టర్నోవర్‌గల 9,200 రైతు ఉత్పత్తిదారు సంస్థల (ఎఫ్‌పిఒ)ను కూడా ప్రధాని జాతికి అంకితం చేశారు.

మహారాష్ట్రలో పశుగణాభివృద్ధి దిశగా ఏకీకృత జీనోమిక్ చిప్‌తోపాటు జాతి-లింగ ఎంపికపై దేశీయ పశువీర్య సాంకేతిక పరిజ్ఞానాన్ని ఆయన ప్రారంభించారుదీనివల్ల పశుపోషణ చేసే రైతులకు సరసమైన ధరలతో లింగ క్రమబద్ధీకృత పశువీర్య లభ్యత పెరుగుతుందిఒక్కో మోతాదుపై దాదాపు రూ.200 దాకా ఖర్చు తగ్గించాలన్నది ఈ కార్యక్రమ లక్ష్యంఇందులో భాగంగా జన్యుక్రమ నిర్ధారణ సేవలతోపాటు దేశీయ పశువుల కోసం ‘గౌచిప్’గేదెల కోసం ‘మహిష్‌’ చిప్‌ల‌ను రూపొందించారుజన్యు క్రమ నిర్ధారణ ద్వారా అధిక-నాణ్యతగల ఎద్దులను దూడల దశలోనే గుర్తించే వీలుంటుంది.

ఈ కార్యక్రమాలన్నిటితోపాటు మహారాష్ట్రలో ముఖ్యమంత్రి సౌర కృషి వాహిని యోజన 2.0’ కింద 19 మెగావాట్ల ఉత్పాదక సామర్థ్యంగల అయిదు సౌర పార్కులను కూడా ప్రధానమంత్రి జాతికి అంకితం చేశారుఈ సందర్భంగా ‘ముఖ్యమంత్రి మాఝీ లడ్కీ బహిన్ యోజన’ లబ్ధిదారులను ఆయన సత్కరించారు.

 

***

MJPS/SR/TS



(Release ID: 2062514) Visitor Counter : 6