వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav g20-india-2023

సిడ్నీలో భారత వాణిజ్య ప్రోత్సాహక కార్యాలయం ఏర్పాటు: శ్రీ పీయూష్ గోయల్


ఘనవిజయాన్ని సొంతం చేసుకున్న పథకం- మేక్ ఇన్ ఇండియా: శ్రీ గోయల్

‘ఎక్టా’, ‘సెసా’ వంటి సమగ్ర ఆర్ధిక సహకార కార్యక్రమాల

పరిపుష్టం కోసం శ్రమిస్తున్న భారత్ ఆస్ట్రేలియా దేశాలు: శ్రీ గోయల్

Posted On: 25 SEP 2024 12:36PM by PIB Hyderabad

ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరంలో భారత వాణిజ్య ప్రోత్సాహక కార్యాలయాన్ని ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్ వెల్లడించారుకార్యాలయంలో ఇన్వెస్ట్ ఇండియాఎన్ఐసీడీసీఈసీజీసీ సహా వాణిజ్యపర్యాటక అధికారులుసీఐఐ ప్రతినిధులు ఇందులో ఉంటారని వివరించారుఆస్ట్రేలియా వాణిజ్యపర్యాటక శాఖల మంత్రి శ్రీ డాన్ ఫారెల్ తో కలిసిఅడిలైడ్ లో నిన్న నిర్వహించిన ఉమ్మడి విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ ప్రతినిధులు ఇరుదేశాల మదుపర్లువాణిజ్యవేత్తలకి వారధిగా పనిచేస్తారని పేర్కొన్నారువాణిజ్యంపెట్టుబడిపర్యాటకంసాంకేతిక రంగాల్లో భాగస్వామ్యాన్ని పెంపొందించడంపై దృష్టి సారిస్తున్నామన్నారు.

పదేళ్ల నుంచి అమలవుతున్న ‘మేక్ ఇన్ ఇండియా’ పథకం నేడు భారతదేశంలో విజయోత్సవాల్ని జరుపుకుంటోందన్న మంత్రి.. ఉత్పాదన రంగంలో గల సవాళ్ళను ‘సంపూర్ణ దృక్పథం’ ద్వారా పరిష్కరించే మార్గాన్ని ఈ పథకం చూపిందని అన్నారుమౌలిక వసతులుఅనుమతులకు ఏకగవాక్ష విధానంనిబంధనల భారాన్ని తగ్గించడంకొన్ని నిబంధనలను నేర రహిత పరిధిలోకి తేవడంనూతన రంగాల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు ప్రోత్సాహంఅంకుర సంస్థలకు ప్రోద్బలం వంటి ‘ప్లగ్ అండ్ ప్లే’ విధానాలను అనుసరించే అవకాశాన్ని ‘మేక్ ఇన్ ఇండియా’ అందించిందని శ్రీ గోయల్ వెల్లడించారు.   

సాంకేతికతలుఅవకాశాలను ఇచ్చిపుచ్చుకునే వీలును ‘మేక్ ఇన్ ఇండియా’ మేక్ ఇన్ ఆస్ట్రేలియా పథకాలు కల్పిస్తున్నాయన్న మంత్రి... ఇరుదేశాల మధ్య వాణిజ్యావకాశాలు పెరిగేందుకు ఈ పథకాలు ఇతోధికంగా సాయపడుతున్నాయన్నారు.  హరిత విధానాలకు ప్రోత్సాహంవిద్యారంగంనైపుణ్యాల అభివృద్ధిపెట్టుబడులుపర్యాటకంకీలక ఖనిజాలువంటి రంగాల్లో సహకారభాగస్వామ్యాలు పెరిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని శ్రీ పీయూష్ గోయల్ అన్నారు.  

తన ఆస్ట్రేలియా పర్యటన గురించి ప్రస్తావిస్తూ... తొలిసారి సీఐఐఫిక్కీ (ఎఫ్ఐసిసిఐనాయకత్వ ప్రతినిధులు ఆస్ట్రేలియా వాణిజ్య సమావేశాల్లో పాలుపంచుకోవడాన్ని చూస్తుంటేఇరుదేశాల భాగస్వామ్యం విలువకు ఉన్న ప్రాముఖ్యత అర్థం అవుతున్నదని అన్నారు. 2022 మే నుంచి ఇరుదేశాల అధినేతలు సార్లు ప్రత్యక్షంగా సమావేశం కావడంఇరువురి మధ్య నెలకొన్న మైత్రీ బంధాన్ని తేటతెల్లం చేస్తూవాణిజ్యంరెండు దేశాల ప్రజల మధ్య కల స్నేహ సంబంధాలకు అదనపు విలువను జోడిస్తోందన్నారు.

ఆర్ధిక సహకార వాణిజ్య ఒప్పందం – ‘ఎకనామిక్ కోపరేషన్ అండ్ ట్రేడ్ అగ్రీమెంట్ (ఎక్టా)’,  సమగ్ర ఆర్ధిక సహకార ఒప్పందాల ‘కాంప్రిహెన్సివ్ ఎకనామిక్ కోపరేషన్ (సెసా)’ బలోపేతం దిశగా భారత్ ఆస్ట్రేలియా కృషి చేస్తున్నాయని, ‘ఎక్టా’ ఒప్పందం వల్ల ఇరుదేశాల మార్కెట్లు ఒకరికొకరికి అందుబాటులోకి వచ్చాయనిదాంతో వాణిజ్యంలో చెప్పుకోదగ్గ అభివృద్ధి కనిపించిందని చెప్పారు.

వాణిజ్యంసాంకేతికతల మార్పిడిస్థిరమైన అభివృద్ధి లక్ష్యాలుఅత్యాధునిక సాంకేతికత సేవలుపెట్టుబడుల రంగాలలో ఆస్ట్రేలియా అందించిన సహకారం వల్ల ఆయా రంగాల్లో భారత్ మరింత ప్రభావశీల పాత్ర పోషించే అవకాశం కలిగిందని శ్రీ గోయల్ అన్నారు. “ప్రజాస్వామ్యంజనాభా సంఖ్యడిమాండ్శ్రీ నరేంద్ర మోదీ నేతృత్వంలో గట్టి నాయకత్వంఅనే నాలుగు ‘డి’లతో కూడిన అనుకూల అంశాలు భారత్ దేశాన్నిసంస్కరణపరివర్తనఉత్తమ ప్రదర్శన వైపుగా నడిపేందుకు సిద్ధంగా ఉన్నాయి’’ అని పేర్కొన్నారు.

 

***



(Release ID: 2059282) Visitor Counter : 5