ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav g20-india-2023

గుజరాత్‌లోని గాంధీనగర్‌లో ప్రపంచ 4వ పునరుత్పాదక ఇంధన పెట్టుబడిదారుల సదస్సు-ప్రదర్శన (రీ-ఇన్వెస్ట్)కు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రారంభోత్సవం


‘‘మా తొలి వంద రోజుల ప్రాధాన్యాలు సుస్పష్టం... మా వేగం/భారీతనానికి ఇది నిదర్శనం’’

‘‘యావత్ ప్రపంచానికీ వర్తించే భారతీయ పరిష్కారాలు’’

‘‘ప్రస్తుత 21వ శతాబ్దానికి అత్యుత్తమ ఎంపిక భారత్’’

‘‘హరిత భవిత... నికర-శూన్య ఉద్గారాలకు భారత్ హామీ ఇస్తోంది’’

‘‘పారిస్‌ సదస్సు నిర్దేశిత వాతావరణ లక్ష్యాలను గడువుకు తొమ్మిదేళ్లు ముందే సాధించిన జి-20 కూటమి తొలి దేశం
భారత్’’

‘‘ప్రధానమంత్రి సూర్య గృహ ఉచిత విద్యుత్ పథకం’తో దేశంలో ప్రతి ఇల్లూ విద్యుదుత్పాదనకు సిద్ధమైంది’’

‘‘భూగోళ హిత జనజీవనం’ సూత్రావళికి ప్రభుత్వం కట్టుబడి ఉంది’’

Posted On: 16 SEP 2024 1:05PM by PIB Hyderabad

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ గుజరాత్‌లోని గాంధీనగర్‌లోగల మహాత్మా మందిర్‌లో ‘ప్రపంచ 4వ పునరుత్పాదక ఇంధన పెట్టుబడిదారుల సదస్సు-ప్రదర్శన’ (రీ-ఇన్వెస్ట్)ను ప్రారంభించారుమన దేశం 200 గిగావాట్ల శిలాజేతర ఇంధన స్ధాపిత సామర్థ్యం సాధించడంలో సహకరించిన కీలక భాగస్వాములను ఈ మూడు రోజుల శిఖరాగ్ర సదస్సులో భారత్ సత్కరిస్తుందిఈ కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ-ప్రైవేట్ రంగ కంపెనీలుఅంకుర సంస్థలుప్రధాన పారిశ్రామిక సంస్థలలో అత్యాధునిక ఆవిష్కరణలతో సదస్సు ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రదర్శనను శ్రీ మోదీ తిలకించారు.

   అనంతరం సభనుద్దేశించి ప్రసంగిస్తూ తొలుత ‘4వ రీ-ఇన్వెస్ట్ (RE-INVESTశిఖరాగ్ర సదస్సు’కు హాజరైన ప్రముఖులందరికీ స్వాగతం పలికారుమూడు రోజులపాటు సాగే ఈ కార్యక్రమంలో భవిష్యత్ ‘ఇంధనసాంకేతిక పరిజ్ఞానవిధాన’ సంబంధిత అంశాలపై లోతైన చర్చలు సాగుతాయని విశ్వసిస్తున్నట్లు చెప్పారుఅలాగే చర్చలుతద్వారా లభించే ఫలితాల యావత్ మానవాళికి మేలు చేస్తాయని శ్రీ మోదీ అభిప్రాయపడ్డారుతదనుగుణంగా చర్చల ఫలవంతం కావాలంటూ శుభాకాంక్షలు తెలిపారు.

   దేశంలో ఆరు దశాబ్దాల తర్వాత ఒక ప్రభుత్వాన్ని రికార్డు స్థాయిలో వరుసగా మూడోసారి ఎన్నుకుంటూ ప్రజలిచ్చిన తీర్పును ప్రధాని గుర్తుచేశారు. ‘‘ఈ ప్రభుత్వం వరుసగా మూడోసారి ఎన్నిక కావడానికి కారణం భారతీయుల ఆకాంక్షలే’’ అని ఆయన వ్యాఖ్యానించారుఈ మేరకు మూడో దఫా ఎన్నికైన ప్రభుత్వం తమ ఆకాంక్షలకు కొత్త రెక్కలు తొడుగుతుందనే నమ్మకంవిశ్వాసాన్ని 140 కోట్ల మంది పౌరులు... ముఖ్యంగా యువతరంమహిళలు వెలిబుచ్చినట్లు పేర్కొన్నారుఅలాగే తమ గౌరవప్రద జీవనానికి ఈ ప్రభుత్వం హామీ ఇవ్వగలదని పేదలుదళితులుఅణగారిన వర్గాల ప్రజలు విశ్వసిస్తున్నారని ప్రధాని చెప్పారుఈ నేపథ్యంలో భారత్‌ను ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దే సంకల్పంతో 140 కోట్ల మంది పౌరులు శ్రమిస్తున్నారని పేర్కొన్నారునేటి కార్య‌క్ర‌మం ఏదో ఒక ప్రయోజనానికి పరిమితం కాదనిదేశాన్ని 2047 నాటికి ‘వికసిత భారత్’గా రూపుదిద్దే మహా సంకల్పంఉద్యమంకార్యాచరణ ప్ర‌ణాళిక‌లో భాగ‌మ‌ని ప్ర‌ధానమంత్రి ఉద్ఘాటించారుఈ దిశగా ప్ర‌భుత్వం పాలన బాధ్యతలు చేపట్టాక తొలి 100 రోజుల‌లో తీసుకున్న నిర్ణ‌యాలను శ్రీ మోదీ ప్రముఖంగా వివరించారు.

   ఈ మేరకు ‘‘మా ప్రభుత్వ తొలి వంద రోజుల కార్యక్రమాలు మా ప్రాధాన్యాలనే కాకుండా వాటి అమలు వేగంభారీతనాన్ని కూడా ప్రతిబింబిస్తాయి’’ అని ప్రధాని వ్యాఖ్యానించారుభారత్ శరవేగంగా పురోగమించడంలో అన్ని రంగాలకూగల ప్రాధాన్యాన్ని ఇవి స్పష్టం చేశాయన్నారుగడచిన 100 రోజుల్లో దేశవ్యాప్తంగా భౌతిక-సామాజిక మౌలిక సదుపాయాల విస్తరణకు అనేక నిర్ణయాలు తీసుకున్నామని తెలిపారుఅలాగే తమ తొలిమలిదఫా ప్రభుత్వాల హయాంలో కోట్ల ఇళ్లను ప్రజలకు అందజేయగాఈసారి కోట్ల ఇళ్ల నిర్మాణం దిశగా ముందడుగు వేస్తున్నామన్నారుఒకవిధంగా అనేక దేశాల జనాభాకన్నా ఈ ఇళ్ల సంఖ్యే అధికమని అభివర్ణించారుదీంతోపాటు 12 కొత్త పారిశ్రామిక నగరాల నిర్మాణం, 8 హైస్పీడ్ రోడ్ కారిడార్ ప్రాజెక్టులకు ఆమోదం తెలిపామన్నారుఅంతేగాక 15కుపైగా ‘వందే భారత్’ సెమీ హైస్పీడ్ రైళ్లు ప్రారంభించామనిపరిశోధనలకు ప్రోత్సాహమిస్తూ రూ.1 ట్రిలియన్ విలువైన పరిశోధన నిధి ఏర్పాటు చేశామని చెప్పారువిద్యుత్-రవాణా రంగం ప్రగతికి వివిధ కార్యక్రమాల ప్రకటనఅధిక-సామర్థ్యంగల ‘బయో మాన్యుఫ్యాక్చరింగ్‌’ రంగానికి ప్రోత్సాహం సహా ‘బయో ఇ3’ విధానానికి ఆమోదం తెలిపామని ప్రధానమంత్రి వెల్లడించారు.

   హరిత ఇంధన రంగంలో గత 100 రోజుల పరిణామాలను ప్రస్తావిస్తూరూ.7000 కోట్లకుపైగా విలువైన సముద్ర తీర పవన విద్యుత్ ప్రాజెక్టుల ఏర్పాటుకు మద్దతుగా ‘నష్టభయ నివారణ నిధి’ (వయబిలిటీ గ్యాప్ ఫండింగ్-విజిఎఫ్పథకం ప్రారంభించామని ఆయన తెలిపారుఅలాగే రూ.12 వేల కోట్ల వ్యయంతో 31 వేల మెగావాట్ల జలవిద్యుదుత్పాదనకు భారత్ కృషి చేస్తున్నదని చెప్పారు.

   అద్వితీయ వైవిధ్యంస్థాయిశక్తిసామర్థ్యందక్షత’లు భారత్ సొంతమనియావత్ ప్రపంచానికీ వర్తించే భారతీయ పరిష్కారాలకు ఇవి బాటలు వేస్తామని ప్రధానమంత్రి ఆత్మవిశ్వాసం ప్రకటించారుఈ మేరకు ‘‘ఇది భారత్ ఆత్మవిశ్వాసం మాత్రమే కాదు... ప్రస్తుత 21వ శతాబ్దానికి అత్యుత్తమ ఎంపిక భారతదేశమేనని ప్రపంచం మొత్తం నమ్ముతోంది’’ అని ఉద్ఘాటించారుగత నెలలో భారత్ నిర్వహించిన అంతర్జాతీయ కార్యక్రమాలను వివరిస్తూఈ నెలారంభంలో ‘గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్ట్’ నిర్వహించామని గుర్తుచేశారుఅలాగే ప్రపంచ తొలి సౌర ఉత్సవంతోపాటు సెమీకండక్టర్ శిఖరాగ్ర సదస్సులో ప్రపంచవ్యాప్త ప్రజానీకం పాలుపంచుకున్నదని శ్రీ మోదీ అన్నారుఅంతేగాక పసిఫిక్ పౌర విమానయాన మంత్రిత్వశాఖల స్థాయి సదస్సు నిర్వహించగాప్రస్తుతం ‘హరిత ఇంధన’ శిఖరాగ్ర సదస్సును నిర్వహిస్తున్నదని వివరించారు.

   శ్వేతమధుర (తేనె), సౌర విప్లవాలకు నాంది పలికిన గుజరాత్నేడు ప్రపంచ 4వ పునరుత్పాదక ఇంధన పెట్టుబడిదారుల సదస్సు-ప్రదర్శన (రీ-ఇన్వెస్ట్)ను నిర్వహించడం యాదృచ్ఛికమే అయినాహర్షణీయమని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు. ‘‘దేశంలో సొంత సౌరశక్తి విధానంగల తొలి రాష్ట్రం గుజరాత్’’ అని గుర్తుచేస్తూఆ తర్వాతే జాతీయ స్థాయిలో సౌరశక్తి విధానాలు రూపుదిద్దుకున్నాయని ఆయన తెలిపారుఅంతేగాక ప్రపంచంలో తొలిసారి వాతావరణ మార్పు సంబంధిత మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన రాష్ట్రాల జాబితాలోనూ గుజరాత్ ముందు వరుసలో ఉందని శ్రీ మోదీ సగర్వంగా చెప్పారుసౌరశక్తి గురించి ప్రపంచం ఆలోచించే నాటికే సౌరవిద్యుత్ ప్లాంట్లను గుజరాత్ ప్రారంభించిందని ఆయన గుర్తుచేశారు.

   ఈ సదస్సు వేదిక ‘మహాత్మా మందిర్‌’ను ప్రస్తావిస్తూవాతావరణ సవాళ్ల మాట ఊహకైనా అందని రోజుల్లో దానిపై ప్రపంచాన్ని అప్రమత్తం చేసిన మార్గదర్శకుడు మహాత్మా గాంధీ పేరిట దీనికి నామకరణం చేశామని పేర్కొన్నారుఅలాగే- ‘‘మన అవసరాలన్నీ తీర్చగల వనరులు ఈ భూగోళంమీద ఉన్నా.. మన అత్యాశను తీర్చడానికి అవి చాలవు’’ అన్న మహాత్మా గాంధీ ప్రబోధాన్ని ఉటంకించారుఈ దార్శనికత సుసంపన్న భారతీయ సంస్కతి నుంచి పుట్టిందని ప్రధాని అన్నారు. ‘హరిత భవితనికర-శూన్య ఉద్గారాలు’ వంటివి అందమైన పదాలకు పరిమితం కాదనిఅవి దేశంలోని కేంద్ర/రాష్ట్ర ప్రభుత్వాల అవసరాలు-కట్టుబాట్లని శ్రీ మోదీ స్పష్టం చేశారు.

   వర్ధమాన ఆర్థిక వ్యవస్థ కాబట్టి భారత్ వీటికి కట్టుబడటం తప్పనిసరి కానప్పటికీనైతిక నిబద్ధతతో ఆ మార్గాన్ని ఎంచుకోలేదని ప్రధానమంత్రి స్పష్టం చేశారుఅలాగే ‘‘నేటి భారతం వర్తమానానికే కాకుండా రాబోయే వెయ్యేళ్లకు అవసరమైన పునాదిని సిద్ధం చేస్తోంది’’ అన్నారుశిఖరాగ్రానికి చేరడం మాత్రమే భారత్ లక్ష్యం కాదు... ఆ స్థానంలో సుస్థిరంగా నిలిచేలా స్వీయ సంసిద్ధత అవశ్యమని శ్రీ మోదీ ఉద్బోధించారుదేశాన్ని 2047 నాటికి ‘వికసిత భారత్’గా తీర్చిదిద్దే దిశగా ఇంధన అవసరాలువిధానాలు ఎలా ఉండాలో తమకు బాగా తెలుసునన్నారుచమురు-వాయు నిల్వల కొరత నేపథ్యంలో సౌరపవనఅణుజల విద్యుత్తు వంటి పునరుత్పాదక ఇంధన శక్తి ప్రాతిపదికగా భవిష్యత్తుకు రూపమివ్వాలన్నది భారత్ సంకల్పమని శ్రీ మోదీ గుర్తుచేశారు.

   జి-20 కూటమి దేశాల్లో పారిస్‌ సదస్సు నిర్దేశిత వాతావరణ లక్ష్యాలను గడువుకన్నా.. అదీ  తొమ్మిదేళ్లు ముందుగా సాధించింది భారతదేశమేనని ప్రధానమంత్రి పేర్కొన్నారుఇదే ఊపులో 2030 నాటికి 500 గిగావాట్ల స్థాపిత పునరుత్పాదక ఇంధన సామర్థ్యం సాధనకు లక్ష్య నిర్దేశం చేసుకున్నదని తెలిపారుఇందులో భాగంగా హరిత ఇంధన రూపాంతరీకరణను ప్రభుత్వం ప్రజా ఉద్యమంగా మార్చిందన్నారుఇళ్ల పైకప్పులపై సౌర విద్యుదుత్పాదనకు భారత్ ప్రవేశపెట్టిన ‘ప్రధానమంత్రి సూర్యగృహ ఉచిత విద్యుత్ పథకం’ (PMSGFES)పై అధ్యయనం చేయాలని అతిథులకు ఆయన సూచించారుఈ పథకం కింద సౌరశక్తి ఉత్పాదన కోసం ఆర్థిక సహాయంతోపాటు ఉపకరణాల ఏర్పాటుకు చేయూతనిస్తుందని చెప్పారుతద్వారా దేశంలోని ప్ర‌తి ఇల్లు విద్యుదుత్పాదన యూనిట్‌గా మారుతుంద‌న్నారుఈ పథకం కింద నమోదు చేసుకున్న 1.30 కోట్లకుపైగా కుటుంబాలకుగాను ఇప్పటిదాకా 3.25 లక్షల ఇళ్లపై ఉపకరణాల ఏర్పాటు పూర్తయిందని ఆయన వెల్లడించారు.

   ఈ పథకంతో ఒనగూడే ఫలితాలను ప్రస్తావిస్తూనెలకు 205 యూనిట్ల విద్యుత్తును ఉపయోగించే ఓ చిన్న కుటుంబం 100 యూనిట్లను ఉత్పత్తి చేసిగ్రిడ్‌కు విక్రయిస్తే ఏటా రూ.25 వేలదాకా ఆదా కాగలదని ప్రధాని వివరించారు. ‘‘పొదుపు-ఆర్జనతో సమానం కాబట్టి,  కరెంటు చార్జీల భారం తప్పడంతోపాటు రూ.25 వేల మేర ప్రజలకు ప్రయోజనం కలుగుతుంది’’ అన్నారుఈ సొమ్మును 20 ఏళ్లపాటు ‘ప్రజా భవిష్య నిధి’ (పిపిఎఫ్)లో పెట్టుబడి పెడితేరూ.10 లక్షలకుపైగా పోగుపడి పిల్లల చదువులుపెళ్లిళ్లకు ఉపయోగపడుతుందని తెలిపారు.

   అంతేకాకుండా ఉపాధి కల్పనపర్యావరణ పరిరక్షణకు ఈ పథకం ఒక మాధ్యమంగా మారుతున్నదనిదీనిద్వారా దాదాపు 20 లక్షల ఉద్యోగాల సృష్టికి అవకాశం ఉందని శ్రీ మోదీ అన్నారుమరోవైపు ఈ పథకం కింద లక్షల మంది యువతను నిపుణ మానవశక్తిగా రూపొందించాలని లక్ష్య నిర్దేశం చేసుకున్నామన్నారువీరిలో లక్షమంది సౌర విద్యుత్ ఘటాల సాంకేతిక నిపుణులుగా పనిచేస్తారని తెలిపారు. ‘‘ఇళ్ల పైకప్పులమీద ప్రతి కిలోవాట్ల సౌర విద్యుదుత్పాదనతో 50 నుంచి 60 టన్నుల కర్బన ఉద్గారాల తగ్గింపు సాధ్యమవుతుంది’’ అని ప్రధాని చెప్పారుఈ విధంగా వాతావరణ మార్పు సవాళ్లపై పోరులో ప్రతి కుటుంబ సహకారం కూడా ఉంటుందన్నారు.

   ‘‘ఈ 21వ శతాబ్దపు చరిత్రలో భారత సౌర విప్లవం సువర్ణాక్షరాలతో లిఖించబడుతుంది’’ అని శ్రీ మోదీ ఉద్ఘాటించారుశతాబ్దాలనాటి సూర్య దేవాలయంగల ‘మోధేరా’ దేశంలో తొలి సౌరశక్తి గ్రామంగా రూపొందడాన్ని ప్రస్తావిస్తూనేడు అక్కడి ప్రజల విద్యుత్ అవసరాలన్నిటినీ సౌరశక్తి తీరుస్తున్నదని తెలిపారుఈ క్రమంలో దేశంలోని అనేక గ్రామాలను సౌరశక్తియుతంగా మార్చే కార్యక్రమం కొనసాగుతున్నదని చెప్పారు.

   అయోధ్య సూర్యవంశజుడైన శ్రీరాముని జన్మస్థలమనిఆ స్ఫూర్తితో దీన్ని ‘ఆదర్శ సౌరశక్తి నగరం’గా తీర్చిదిద్దాలని ప్రభుత్వం సంకల్పించిందని ప్రధాని తెలిపారుఇందులో భాగంగా నగరంలోని ప్రతి ఇల్లుకార్యాలయంసేవాప్రదానం వగైరాలను సౌర శక్తియుతం చేస్తున్నామని తెలిపారుఈ మేరకు ఇప్పటికే నగరంలోని అనేక ప్రభుత్వ భవనాలతోపాటుగృహాలు సౌరశక్తిని వినియోగిస్తున్నట్లు పేర్కొన్నారునగరమంతటా పెద్ద సంఖ్యలో సౌర వీధిదీపాలురహదారి కూడళ్లు కాంతులు వెదజల్లుతున్నాయన్నారుఅంతేగాక సౌరశక్తితో బోట్లుజల ఏటీఎంలుభవనాలు ఎన్నో కనిపిస్తాయంటూ శ్రీ మోదీ హర్షం వెలిబుచ్చారు.

   ఇదే తరహాలో దేశవ్యాప్తంగా 17 నగరాలను సౌరశక్తియుతం చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు ప్రధాని తెలిపారుదీంతోపాటు పంటపొలాలువ్యవసాయ క్షేత్రాలను సౌరశక్తి ఉత్పాదక మాధ్యమంగా మార్చే ప్రణాళికలు రూపొందించినట్లు చెప్పారుపొలాలకు  నీటిపారుదల కోసం సౌర పంపులుస్వల్పస్థాయి ప్లాంట్ల ఏర్పాటు కోసం రైతులకు సహాయం చేస్తున్నట్లు తెలిపారు.

   పునరుత్పాదక ఇంధన సంబంధిత రంగాలన్నిటా భారత్ ఎంతో వేగంతోపాటు భారీస్థాయిలో ముందంజ వేస్తున్నదని శ్రీ మోదీ స్పష్టీకరించారుఈ మేరకు మునుపటి దశాబ్దంతో పోలిస్తే గత పదేళ్లలో అణుశక్తి ఉత్పాదన 35 శాతం పెరిగిందని తెలిపారుఅలాగే హరిత ఉదజని రంగంలో ప్రపంచ అగ్రగామిగా ఎదగడానికి శక్తివంచన లేకుండా కృష్టి చేస్తున్నామని చెప్పారుఈ దిశగా దాదాపు రూ.20 వేల కోట్లతో హరిత ఉదజని కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని వెల్లడించారుఇవేకాకుండ ‘వ్యర్థం నుంచి ఇంధనం’ (వేస్ట్ టు ఎనర్జీపేరిట భారీ కార్యక్రమం అమలు చేస్తున్నామన్నారుకీలక ఖనిజ సంబంధిత సమస్యల పరిష్కారానికి తీసుకుంటున్న చర్యలను శ్రీ మోదీ వివరించారుపునరుపయోగం (రీయూజ్), పునరావృత్తి (రీసైక్లింగ్‌సంబంధిత మెరుగైన పరిజ్ఞానాల రూపకల్పన కోసం అంకుర సంస్థలకు రుణమద్దతు సహా ప్రభుత్వం ఒక వర్తుల విధానాన్ని ప్రోత్సహిస్తున్నదని వెల్లడించారు.

   ‘మిషన్ లైఫ్పర్యావరణ పరిరక్షణ జీవనశైలి’పై భారత్ దృక్కోణాన్ని వివరిస్తూ ‘‘భూగోళ హిత జనజీవనం’ సూత్రావళికి ప్రభుత్వం కట్టుబడి ఉంది’’ అని ప్రధాని మోదీ అన్నారుఅలాగే  ‘అంతర్జాతీయ సౌర కూటమి’ ఏర్పాటుజి-20 అధ్యక్షత సమయంలో ‘హరిత ఇంధన రూపాంతరీకరణ’పై దృష్టి సారించడంశిఖరాగ్ర సదస్సు సందర్భంగా ‘ప్రపంచ జీవ-ఇంధన కూటమి’కి శ్రీకారం వంటి కార్యక్రమాలతో భారత్ ముందడుగు వేసిందని గుర్తుచేశారుఈ నేపథ్యంలో ‘‘ఈ దశాబ్దం చివరికల్లా రైల్వే రంగాన్ని నికర-శూన్య ఉద్గార స్థాయికి తేవాలని లక్ష్య నిర్దేశం చేసుకున్నాం’’ అని తెలిపారుఅంతేగాక 2025 నాటికి పెట్రోల్‌లో 20 శాతం ఇథనాల్ మిశ్రమం లక్ష్యాన్ని సాధించాలని సంకల్పించినట్లు తెలిపారుప్రతి గ్రామంలో జల సంరక్షణ దిశగా దేశమంతటా వేలాది ‘అమృత సరోవరాలు’ (చెరువులునిర్మించడాన్ని కూడా ఆయన ప్రస్తావించారుమరోవైపు ‘అమ్మ పేరిట ఓ మొక్క’ కార్యక్రమం గురించి చెబుతూదీనికింద ప్రతి ఒక్కరూ కనీసం ఒక మొక్క నాటాలని ప్రధాని పిలుపునిచ్చారు.

   దేశంలో పునరుత్పాదక ఇంధనానికి పెరుగుతున్న డిమాండ్‌ను ప్రస్తావిస్తూఈ అవసరాలను తీర్చేందుకు ప్రభుత్వం కొత్త విధానాలకు రూపకల్పన చేస్తున్నదని ప్రధాని తెలిపారుఅంతేకాకుండా వీటి అమలు దిశగా అన్నివిధాలా అండదండలు కూడా అందిస్తున్నట్లు చెప్పారుచివరగాఒక్క ఇంధన రంగంలోనేగాక తయారీ రంగంలోనూ భారత్ అపారఅద్భుత అవకాశాలు కల్పిస్తున్నదని ఆయన ప్రకటించారు. ‘‘పూర్తిస్థాయిలో ‘భారత్ తయారీ’ (మేడ్ ఇన్ ఇండియాపరిష్కారాల దిశగా కృషిలో భాగంగా అనేక అవకాశాలను సృష్టిస్తున్నాంఅందువల్ల వాస్తవ విస్తరణ-మెరుగైన రాబడికి భారత్ హామీ ఇస్తోంది’’ అని పేర్కొన్నారుభార‌త్‌లో పెట్టుబడుల ద్వారా దేశ హరిత ఇంధన రూపాంతరీకరణలో భాగస్వాములు కావాల్సిందిగా పెట్టుబడిదారులను ఆహ్వానిస్తూ శ్రీ మోదీ తన ప్రసంగం ముగించారు.

   ఈ కార్యక్రమంలో గుజరాత్ గవర్నర్ ఆచార్య దేవవ్రత్ముఖ్యమంత్రి శ్రీ భూపేంద్ర పటేల్కేంద్ర నవ్య-పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి శ్రీ ప్రహ్లాద్ జోషిసహా ఆంధ్రప్రదేశ్రాజస్థాన్మధ్యప్రదేశ్ఛత్తీస్‌గఢ్గోవా ముఖ్యమంత్రులతోపాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.

నేపథ్యం

ప్రపంచ 4వ పునరుత్పాదక ఇంధన పెట్టుబడిదారుల సదస్సు-ప్రదర్శన’ (రీ-ఇన్వెస్ట్ద్వారా పునరుత్పాదక ఇంధన ఉత్పాదనవిస్తరణలో భారత్ అద్భుత పురోగమనం ప్రపంచానికి ప్రత్యక్షంగా వెల్లడవుతుందిరెండున్నర రోజులపాటు సాగే ఈ కార్యక్రమంలో ప్రపంచం నలుమూలల నుంచి ప్రతినిధులు పాల్గొంటున్నారువీరంతా ముఖ్యమంత్రుల ప్లీనరీ, ‘సీఈవో’ల రౌండ్ టేబుల్ఆవిష్కరణాత్మక ఆర్థిక తోడ్పాటుహరిత ఉదజని-భవిష్యత్ ఇంధన పరిష్కారాలపై ప్రత్యేక చర్చలతోపాటు సమగ్ర కార్యక్రమాల్లో భాగస్వాములవుతారుఈ సదస్సుకు గుజరాత్ ఆతిథ్యం ఇస్తుండగాజర్మనీఆస్ట్రేలియాడెన్మార్క్నార్వే అంతర్జాతీయ భాగస్వాములుగా ఉన్నాయిఇక దేశీయంగా ఆంధ్రప్రదేశ్కర్ణాటకమధ్యప్రదేశ్మహారాష్ట్రరాజస్థాన్తెలంగాణఉత్తరప్రదేశ్ భాగస్వామ్య రాష్ట్రాలుగా పాల్గొంటున్నాయి.

  ఈ సదస్సులో భాగంగా ప్రభుత్వ-ప్రైవేట్ రంగ కంపెనీలుఅంకుర సంస్థలుప్రధాన పారిశ్రామిక సంస్థల అత్యాధునిక ఆవిష్కరణలతో ఏర్పాటైన ప్రదర్శన అతిథులను ఆకట్టుకుంటుందిసుస్థిర భవిత దిశగా భారత్ నిబద్ధతను ఇది వేనోళ్ల చాటుతుంది.



(Release ID: 2055422) Visitor Counter : 75