ప్రధాన మంత్రి కార్యాలయం

'విత్తనం నుంచి మార్కెట్ దాకా'... రైతుల శ్రేయస్సు కోసం ప్రభుత్వం అన్ని యత్నాలూ చేస్తోంది: ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ

Posted On: 12 AUG 2024 12:31PM by PIB Hyderabad

రైతుల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని ‘విత్తనం మొదలుకొని మార్కెట్ వరకు’ ప్రభుత్వం వివిధ దశలలో  అన్ని ప్రయత్నాలను చేస్తోందని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సోమవారం అన్నారు.

కేంద్ర వ్యవసాయ- రైతుల సంక్షేమ శాఖ మంత్రి శ్రీ శివ్ రాజ్ సింగ్ చౌహాన్ రాసిన  ఒక వ్యాసం పై ప్రధాన మంత్రి తన వ్యాఖ్య ను ‘ఎక్స్’లో పొందుపరుస్తూ:

‘‘దేశవ్యాప్తంగా రైతు సోదరీమణులు, రైతు సోదరుల జీవనంలో సమృద్ధిని తేవాలని మా ప్రభుత్వం నిశ్చయించుకుంది. . వ్యవసాయ మంత్రి శ్రీ @ChouhanShivraj రాసిన  ఈ కథనం విత్తనం మొదలుకొని మార్కెట్  వరకు.. వివిధ దశలలో చేతనైన అన్ని విధాలుగా మేం ఏ విధంగా పాటుపడుతోందీ తెలియ జేస్తోంది’’ అని పేర్కొన్నారు.

 

 

***

MJPS/SR/RT



(Release ID: 2044470) Visitor Counter : 45