పర్యావరణం, అడవులు, మరియు వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ
హరిత భారత్ కార్యక్రమం
Posted On:
05 AUG 2024 12:18PM by PIB Hyderabad
వాతావరణ మార్పులపై జాతీయ కార్యచరణ ప్రణాళిక కింద చేపట్టిన ఎనిమిది కార్యక్రమాల్లో హరిత భారత్ కోసం జాతీయ కార్యక్రమం(నేషనల్ మిషన్ ఫర్ ఏ గ్రీన్ ఇండియా)(జీఐఎం) ఒకటి. భారతదేశ అటవీ విస్తీర్ణాన్ని పరిరక్షించడం, పునరుద్ధరించడంతో పాటు పెంపొందించడం ఈ కార్యక్రమ లక్ష్యం. సంయుక్త అటవీ నిర్వహణ కమిటీల(జేఎఫ్ఎంసీ) ద్వారా అటవీ, అటవీయేతర ప్రాంతాల్లో పర్యావరణ పునరుద్ధరణ చర్యలు చేపట్టడం ద్వారా వాతావరణ మార్పులను నియంత్రించడం ఈ కార్యక్రమ ఉద్దేశం. జీఐఎం కింద 2015-16 ఆర్థిక సంవత్సరంలో కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ఇప్పటివరకు 155130 హెక్టార్ల విస్తీర్ణంలో మొక్కలు నాటడానికి/పర్యావరణ పునరుద్ధరణకు గానూ 17 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతానికి రూ.909.82 కోట్లు విడుదలయ్యాయి.
ఈ సమాచారాన్ని పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ సహాయమంత్రి శ్రీ కీర్తివర్ధన్ సింగ్ లోక్సభలో సోమవారం రాతపూర్వకంగా తెలియజేశారు.
***
(Release ID: 2041788)