రాష్ట్రప‌తి స‌చివాల‌యం

భారత రాష్ట్రపతి కి అధికార పత్రాలను సమర్పించిన నాలుగు దేశాల రాయబారులు

Posted On: 11 JUL 2024 2:28PM by PIB Hyderabad

భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము రాష్ట్రపతి భవన్ లో ఈ రోజు న- అంటే 2024 జూలై 11వ తేదీ న- జరిగిన ఒక కార్యక్రమంలో దక్షిణ సూడాన్, జింబాబ్వే, స్పెయిన్, అర్జెంటీనా ల రాయబారులు ఇచ్చిన వారి వారి అధికార పత్రాలను స్వీకరించారు. అధికార పత్రాలను రాష్ట్రపతి కి సమర్పించిన వారిలో:

            1.  దక్షిణ సూడాన్ రాయబారి శ్రీ లుముంబా మక్ లేలె న్యాజొక్; 2.  జింబాబ్వే రాయబారి స్టెలా నకొమొ గారు; 3. స్పెయిన్ రాయబారి శ్రీ జువాన్ ఎంటొనియొ మార్చ్ పుజోల్ తో పాటు, 4. అర్జెంటీనా రాయబారి శ్రీ మారియానో అగస్టీన్ కొసినో  కూడా ఉన్నారు.

 

 

**



(Release ID: 2032431) Visitor Counter : 38