రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌

చేపలు పట్టే భారతీయ పడవ లో 173 కిలోగ్రాముల మత్తుపదార్థాల ను తీసుకుపోతుండగా జప్తు చేసిన ఐసిజి మరియు ఎటిఎస్ గుజరాత్; పడవ ను నడుపుతున్న ఇద్దరి ని అరెస్టు చేయడమైంది

Posted On: 29 APR 2024 5:00PM by PIB Hyderabad

భారతీయ కోస్తా తీర రక్షక దళం (ఐసిజి) మరియు గుజరాత్ కు చెందిన ఉగ్రవాద వ్యతిరేక దళం (ఎటిఎస్) లు సమన్వయభరితంగా అరేబియా సముద్రం లో సాగించిన ఒక ప్రయాస లో, 173 కిలోగ్రాముల మాదక ద్రవ్యాల ను తరలిస్తున్న ఒక భారతీయ చేపలు పట్టే పడవ ను జప్తు చేసి, ఆ పడవ లో ప్రయాణిస్తున్న ఇద్దరు నేరగాళ్ల ను అరెస్టు చేయడమైంది.

ఎటిఎస్ గుజరాత్ అందించిన ఒక నిర్దిష్టమైనటువంటి మరియు విశ్వసనీయమైనటువంటి రహస్య సమాచారాన్ని అందుకొని ఐసిజి తన నౌకల ను వ్యూహాత్మకం గా రంగం లోకి దింపి, అనుమానిత పడవ యొక్క ఆచూకీ ని గుర్తించడం కోసం సమగ్ర నిఘా ను పెట్టింది. ఆ పడవ ఆచూకీ ని కనుగొన్న తరువాత చేపట్టిన దర్యాప్తు లో తమకు అందిన సమాచారం ఖచ్చితమైందే అని నిర్ధారణ కావడం తో, ఆ పడవ లో ఉన్న వారు మత్తు పదార్థాల దొంగ రవాణా ను చేపడుతున్నారన్న సంగతి తేటతెల్లం అయింది. వారి ప్రమేయాన్ని గురించిన తదుపరి దర్యాప్తు పురోగమిస్తున్నది.

ఇది ఐసిజి గడచిన మూడు సంవత్సరాల లో చేపట్టిన జప్తుల లో పన్నెండో ది. వీటిలో ఇటీవలే ఒక పాకిస్తానీ మత్స్యపాలన పడవ ను నిర్బంధం లోకి తీసుకొని, అందులో పెద్ద ఎత్తున మత్తు పదార్థాల రాశి ని పట్టుకోవడం కూడా కలిసి ఉంది. ఈ చర్య లు సముద్ర సంబంధి సరిహద్దుల ను రక్షించుకోవడం కోసం మరియు సముద్రం లో చట్టవిరుద్ధ కార్యకలాపాల ను ఎదుర్కోవడం కోసం రెండు ఏజెన్సీ ల నిబద్ధత ను ప్రస్ఫుటం చేస్తున్నది.

 

***



(Release ID: 2019118) Visitor Counter : 84