రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

షోపియాన్ బైపాస్ నిర్మాణానికి రూ.224.44 కోట్లు మంజూరు: కేంద్ర మంత్రి శ్రీ నితిన్ గడ్కరీ


- జమ్మూ & కాశ్మీర్‌లోని జాతీయ రహదారి- 444పై నిర్మాణం

నాడు పోస్టు చేయడమైనది: 12 MAR 2024 12:43PM by PIB Hyderabad

జమ్మూ & కాశ్మీర్లో రూనేషనల్ హైవే-444లో షోపియాన్ బైపాస్ నిర్మాణానికి 224.44 కోట్ల నిధులు మంజూరయ్యాయిదీనిని పేవ్డ్ షోల్డర్తో 2-లేన్ కాన్ఫిగరేషన్తో దీనిని నిర్మించానున్నారు. ఈ విషయాన్ని కేంద్ర రోడ్డు రవాణా & రహదారుల శాఖ మంత్రి శ్రీ నితిన్ గడ్కరీ ఒక పోస్ట్లో తెలియజేశారు.  షోపియాన్ జిల్లాలో 8.925 కి.మీ విస్తరించి ఉన్న  అభివృద్ధి పని ఈపీఎస్ విధానాన్ని ఉపయోగించి అమలు చేయబడుతుందిజమ్మూ & కాశ్మీర్లోని యూటీ పరిధిలో షోపియాన్ జిల్లాను ఒకవైపు.. పుల్వామాతోను మరోవైపు కుల్గామ్తోను అనుసంధానం చేస్తూ నిర్మిస్తారు. దీంతోఈ ప్రాజెక్టుకు వ్యూహాత్మక ప్రాముఖ్యత ఉందని ఆయన అన్నారుఇది దక్షిణ కాశ్మీర్లోప్రత్యేకించి "యాపిల్ బౌల్ ఆఫ్ ది వ్యాలీ"గా పిలువబడే షోపియాన్ జిల్లాలో ఆపిల్ పెంపకందారులకు గణనీయంగా ప్రయోజనం చేకూర్చేందుకు ఉపయుక్తంగా ఉంటుందిమార్కెట్లకు ఉత్పత్తులను వేగంగా రవాణా చేయడం ద్వారామెరుగైన అనుసంధానత మరియు రహదారి భద్రతా చర్యలను పెంచడం వంటి మొత్తం ప్రభావం ఉంటుంది.

***


(రిలీజ్ ఐడి: 2013972) సందర్శకుల సూచీ సంఖ్య : : 86
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Punjabi , Tamil