భారత ఎన్నికల సంఘం

నిష్పక్షపాతంగా మరియు ప్రేరేపణ, బలవంతం మరియు బెదిరింపు లేని ఎన్నికలను నిర్వహించేందుకు దాదాపు 2100 మంది పరిశీలకులు, లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్, ర్యాండమైజ్ ఫోర్స్‌తో పాటు ఇతర సిబ్బందికి పలు అంశాలపై దిశానిర్దేశం చేసిన సీఈసీ రాజీవ్‌ కుమార్‌


లోక్‌సభతో పాటు పలు రాష్ట్ర శాసనసభలకు సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో సాధారణ, పోలీసు మరియు వ్యయ పరిశీలకులకు పలు అంశాలపై ఒక రోజుపాటు ప్రత్యేక సెషన్‌ నిర్వహించిన ఈసీఐ

Posted On: 11 MAR 2024 4:39PM by PIB Hyderabad

త్వరలో లోక్‌సభ మరియు రాష్ట్ర శాసనసభలకు సాధారణ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో భారత ఎన్నికల సంఘం రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో నియమించిన పరిశీలకులకు ఈరోజు ప్రత్యేక సదస్సు నిర్వహించింది.

న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో హైబ్రిడ్ మోడ్‌లో ఏర్పాటు చేసిన బ్రీఫింగ్‌కు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతో పాటు ఇండియన్ రెవెన్యూ సర్వీస్ మరియు ఇతర సెంట్రల్ సర్వీసెస్ నుండి వచ్చిన 2150 మంది సీనియర్ అధికారులు హాజరయ్యారు. కొంతమంది అధికారులు సంబంధిత రాష్ట్రాలు/యూటీలలోని ప్రధాన ఎన్నికల అధికారుల కార్యాలయం నుండి వర్చువల్‌గా కార్యక్రమంలో పాల్గొన్నారు. రానున్న ఎన్నికల్లో 900 మంది జనరల్ అబ్జర్వర్లు, 450 మంది పోలీస్ అబ్జర్వర్లు, 800 మంది వ్యయ పరిశీలకులు విధులు నిర్వహిస్తున్నారు.

 
image.png


స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా, బెదిరింపులు మరియు ప్రేరేపణ లేని ఎన్నికలను నిర్వహించేందుకు పరిశీలకులు నిర్వహించాల్సిన కీలకపాత్రపై ప్రధాన ఎన్నికల కమిషనర్ శ్రీ రాజీవ్ కుమార్ పలు సూచనలు చేశారు. కమిషన్ ప్రతినిధులుగా పరిశీలకులు తమను తాము వృత్తిపరంగా నిర్వహించాలని మరియు అభ్యర్థులతో సహా అందరికీ అందుబాటులో ఉండాలని సీఈసీ ఉద్ఘాటించారు. పరిశీలకులు క్షేత్రస్థాయిలో నిక్కచ్చిగా వ్యవహరించాలని సూచించారు. పోలింగ్‌ కేంద్రాలను సందర్శించి భౌగోళిక పరిస్థితులపై అవగాహన పెంచుకోవాలని, సమస్యాత్మక మరియు సున్నితమైన ప్రాంతాలను పరిశీలించాలని ఆయన కోరారు.

కమిషన్ అన్ని సర్క్యులర్‌లను తిరిగి రూపొందించిందని మరియు ఈసీఐ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్న మాన్యువల్‌లు, హ్యాండ్‌బుక్‌లను శోధించదగిన మరియు సులభంగా చదవగలిగే విధంగా నవీకరించిందని కూడా శ్రీ కుమార్ పేర్కొన్నారు. చేయవలసినవి మరియు చేయకూడని వాటి చెక్‌లిస్ట్‌తో పాటు వివిధ అధికారుల పాత్రలు మరియు విధుల ఆధారంగా హ్యాండ్‌బుక్‌లు మరియు మాన్యువల్‌లను తయారు చేసినట్లు ఆయన తెలిపారు.

 
image.png


బ్రీఫింగ్ సమావేశంలో కమిషన్ యొక్క వివిధ కొత్త కార్యక్రమాలు మరియు ఆదేశాలకు సంబంధించిన  కీలకమైన అంశాల గురించి పరిశీలకులందరికీ వివరించబడింది. బ్రీఫింగ్ సెషన్‌లో ఈ క్రింది అంశాలు నొక్కిచెప్పబడ్డాయి:

  1. మొత్తం ఎన్నికల ప్రక్రియ సమయంలో పరిశీలకులు భౌతికంగా తమకు కేటాయించిన పార్లమెంటరీ నియోజకవర్గం పరిధిలోనే పరిమితం కావాలని ఆదేశించారు. వారి వాహనంలో జీపీఎస్ ట్రాకింగ్‌ను అమర్చాలని ప్రతిపాదించారు.
  2. పరిశీలకులు తమ మొబైల్/ ల్యాండ్‌లైన్ నంబర్లు/ ఈ-మెయిల్ చిరునామాలు/ బస చేసే స్థలాలు మొదలైనవాటిని సీఈఓ/ జిల్లా వెబ్‌సైట్‌లలో విస్తృతంగా ప్రచారం చేయాలని ఆదేశించారు; ఎలక్ట్రానిక్/ప్రింట్ మీడియా ద్వారా మరియు అభ్యర్థులు/గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ద్వారా డీఈఓలు/ఆర్‌ఓలు వారి సంబంధిత నియోజకవర్గాలకు పరిశీలకులు వచ్చిన రోజున వాటిని పంపిణీ చేయాలి.
  3. పరిశీలకులు తమ ఫోన్‌లు/ఈ-మెయిల్స్‌లో ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని మరియు అభ్యర్థులు/ రాజకీయ పార్టీలు/ సాధారణ ప్రజానీకం/ ఎన్నికల విధుల్లో ఉన్న సిబ్బంది మొదలైన ఫోన్‌లకు స్పందించాలని సూచించారు. దీనికి సంబంధించి ఏదైనా ఫిర్యాదులను కమిషన్ తీవ్రంగా పరిగణిస్తుంది.
  4. డీఈఓలు చిత్తశుద్ధి ఉన్న వ్యక్తులను లైజన్ ఆఫీసర్లుగా మరియు సెక్యూరిటీ ఆఫీసర్లుగా పరిశీలకులతో నియమించాలి. ఈ లైజన్ ఆఫీసర్లు/సెక్యూరిటీ ఆఫీసర్లు తటస్థతను కొనసాగించడం మరియు నిజాయితీగా మరియు చిత్తశుద్ధితో తమ విధులకు హాజరవ్వడం గురించి సరైన సమాచారం మరియు అవగాహన కల్పించాలి.
  5. బలగాల మోహరింపు, ర్యాండమైజేషన్ ప్రక్రియ, రాజకీయ పార్టీలు సువిధ పోర్టల్‌ను ఉపయోగించడం మరియు అభ్యర్థులు/రాజకీయ పార్టీలందరికీ స్థాయిని కల్పించడం వంటి ప్రక్రియలలో పూర్తిగా ప్రత్యక్షంగా మరియు సంతృప్తి చెందడం వంటి తమ తప్పనిసరి విధులను నిజాయితీగా చేయాలని పరిశీలకులు ఆదేశించారు. మొత్తం ఎన్నికల ప్రక్రియలో వారు తమ కంఫర్ట్ జోన్ల నుండి బయటకు రావాలి.
  6. పరిశీలకులు వివిధ పోలింగ్ స్టేషన్‌లతో పాటు సమస్యాత్మక ప్రాంతాలను సందర్శించాలని తెలియజేయబడింది; ఆ ప్రాంతాలలో నివసించే వ్యక్తులతో  సంభాషించి సమస్యలను గుర్తించాలని వాటిని పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని తెలిపింది.
  7. అభ్యర్థులు/రాజకీయ పార్టీల సమావేశాలను డీఈఓలు/ఆర్‌ఓలు ఏర్పాటు చేయడాన్ని గమనించి, వారి ఫిర్యాదులను సక్రమంగా విని వాటిపై చర్యలు తీసుకునేలా చూడాలని కూడా పరిశీలకులను ఆదేశించారు.
  8. పోలింగ్ రోజున పోలింగ్ వేళల్లో వీలైనన్ని ఎక్కువ పోలింగ్ కేంద్రాలను సందర్శించి పోలింగ్ స్టేషన్‌లలోని పరిస్థితిని క్రమం తప్పకుండా అంచనా వేయాలని మరియు పోలింగ్ స్వేచ్ఛగా మరియు నిష్పక్షపాతంగా జరిగేలా చూసుకోవాలని పరిశీలకులకు మార్గనిర్దేశం చేశారు.
  9. కేంద్ర బలగాలు/రాష్ట్ర పోలీసు బలగాలు చాకచక్యంగా ఉపయోగించాలని మరియు తటస్థంగా ఉండేలా చూడాలని పరిశీలకులకు సూచించబడింది. మరియు వారి మోహరింపు  రాజకీయ పార్టీలు/అభ్యర్థులకు అనుకూలంగా ఉండకూడదని తెలిపింది.


రోజంతా జరిగిన బ్రీఫింగ్ సెషన్‌లలో, సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమీషనర్, డీఈసీలు మరియు ఈసీఐ డీజీలు ఎన్నికల నిర్వహణకు సంబంధించిన వివిధ అంశాల గురించి అధికారులకు సమగ్రమైన మరియు సవిరమైన ఇన్‌పుట్‌లను అందించారు. ఎన్నికల ప్రణాళిక, పరిశీలకుల పాత్రలు మరియు బాధ్యతలు, ఎన్నికల జాబితా సమస్యలు, ప్రవర్తనా నియమావళి, చట్టపరమైన నిబంధనలు, ఈవీఎం/వివిపిఏటి నిర్వహణ, మీడియా భాగస్వామ్యం మరియు కమిషన్  ఫ్లాగ్‌షిప్ కార్యక్రమం ఎస్‌విఈఈపి (సిస్టమాటిక్ ఓటర్స్ ఎడ్యుకేషన్ అండ్ ఎలక్టోరల్ పార్టిసిపేషన్) ప్రోగ్రామ్ కింద ఓటరు అవగాహన కోసం చేపట్టిన విస్తృత కార్యకలాపాలపై వివరణాత్మక  ప్రదర్శనలు చేయబడ్డాయి.

 
image.png


ఓటింగ్ ప్రక్రియను సులభతరం చేసేందుకు కమిషన్ ప్రారంభించిన వివిధ ఐటీ కార్యక్రమాలు మరియు మొబైల్ అప్లికేషన్‌లతో పాటు క్షేత్రస్థాయిలో ఎన్నికల ప్రక్రియలను సమర్థవంతంగా నిర్వహించడానికి చేపట్టాల్సిన చర్యలను పరిశీలకులు తెలుసుకున్నారు.

పరిశీలకులకు ఈవీఎంలు మరియు వివిపిఎటిల పనితీరుపై వివరణాత్మక ప్రదర్శన అందించబడింది.ఈవీఎం వ్యవస్థను సురక్షితంగా, పటిష్టంగా, విశ్వసనీయంగా, ట్యాంపర్ ప్రూఫ్‌గా చేయడానికి ఉపయోగించిన బహుళ సాంకేతిక భద్రతా లక్షణాలు, పరిపాలనా ప్రోటోకాల్‌లు మరియు విధానపరమైన భద్రతల గురించి వివరించబడింది.

 
image.png


పరిశీలకుల బాధ్యతలను సులభంగా నిర్వహించేందుకు ఎన్నికల నిర్వహణకు సంబంధించిన అన్ని అంశాలకు సంబంధించి ఇటీవల నవీకరించబడిన మరియు సమగ్రమైన మాన్యువల్‌లు, హ్యాండ్‌బుక్‌లు, సూచనల సంగ్రహం, చేయవలసినవి మరియు చేయకూడని వాటి గురించి వివరించడం జరిగింది. ఏవైనా సూచనలు మరియు మార్గదర్శకాలకు సులభంగా యాక్సెస్ కోసం ఇబుక్ మరియు శోధించదగిన ఫార్మాట్‌లో ఇవి ఈసీఐ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి.

నేపథ్యం:


ప్రజాప్రాతినిధ్య చట్టం, 1951 మరియు రాజ్యాంగంలోని ప్లీనరీ అధికారాల సెక్షన్ 20బి కింద కమిషన్ పరిశీలకులను నియమించింది. పరిశీలకులకు ఎన్నికల ప్రక్రియను నిర్వహించే కీలకమైన బాధ్యతను అప్పగించారు. ఇది మన ప్రజాస్వామ్య రాజకీయాలలో పునాదిని ఏర్పరుస్తుంది. కమిషన్ తన జనరల్, పోలీస్ మరియు వ్యయ పరిశీలకులపై చాలా విశ్వాసం ఉంచుతుంది మరియు స్వేచ్ఛగా మరియు నిష్పక్షపాతంగా ఎన్నికలను నిర్ధారించడంలో అటువంటి పరిశీలకుల పాత్ర కమిషన్‌కు అత్యంత ముఖ్యమైనది. ఈ కేంద్ర పరిశీలకులు కమిషన్‌కు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా, పారదర్శకంగా మరియు సమ్మిళిత ఎన్నికలను నిర్వహించాలనే రాజ్యాంగ ఆదేశాన్ని నెరవేర్చడంలో సహాయపడటమే కాకుండా ఓటరు అవగాహన మరియు ఎన్నికలలో భాగస్వామ్యాన్ని పెంపొందించడంలో కూడా సహాయపడతారు.  నిర్దిష్టమైన మరియు ఆపరేటివ్ సిఫార్సులను రూపొందించడం ఎన్నికల పరిశీలన యొక్క ప్రధాన లక్ష్యం.ఈ పరిశీలకులు ఎన్నికల కమిషన్‌కు కళ్ళు మరియు చెవులుగా ప్రసిద్ధి చెందారు.

***


(Release ID: 2013856) Visitor Counter : 73