ప్రధాన మంత్రి కార్యాలయం

జమ్ము కశ్మీర్ లోఓ నవ పారిశ్రమికవేత్త మరియు ప్రభుత్వ లబ్ధిదారులలో ఒకరు అయిన శ్రీ నజీమ్ తో సెల్ఫీలో పాలుపంచుకొన్న ప్రధాన మంత్రి

Posted On: 07 MAR 2024 3:23PM by PIB Hyderabad

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ పాల్గొన్న ‘వికసిత్ భారత్ వికసిత్ జమ్ము- కశ్మీర్’ కార్యక్రమం లో జమ్ము- కశ్మీర్ లోని పుల్ వామా కు చెందిన నవ పారిశ్రమికవేత్త మరియు ప్రభుత్వ పథకాల యొక్క లబ్ధిదారులలో ఒకరు అయిన శ్రీ నజీమ్ తో మాట్లాడారు. శ్రీ నజీమ్ అభ్యర్థించిన మీదట ఆయన తో కలసి ఒక సెల్ఫీ లో పాలుపంచుకొనేందుకు ప్రధాన మంత్రి సమ్మతించారు.

 

ప్రధాన మంత్రి ఎక్స్ మాధ్యం లో ఒక సందేశాన్ని నమోదు చేస్తూ, ఆ సందేశం లో -

‘‘నా మిత్రుడు శ్రీ నజీమ్ తో ఒక జ్ఞాపకం పెట్టుకోదగినటువంటి సెల్ఫీ ఇది. ఆయన నడుంకట్టిన సత్కార్యం నాకు నచ్చింది. జన సభ లో పాల్గొన్న ఆయన ఒక సెల్ఫీ లో పాలుపంచుకోవాలంటూ కోరారు. ఆయన తో భేటీ అయినందుకు నాకు సంతోషం గా ఉంది. ఆయన తన భావి ప్రయాసలలో సైతం రాణించాలి అని కోరుకుంటున్నాను.’’ అని పేర్కొన్నారు.

 

 

 

***

DS/TS



(Release ID: 2012253) Visitor Counter : 78